పోస్ట్‌లు

ఇది సత్యం

ఇది సత్యం. " ఈసారి పండక్కి పిల్లలు ఎవరికీ ఫోన్ చేయకండి. నేను చాకిరి చేయలేకపోతున్నాను. మీరు కూడా రిటైర్ అయిపోయి ఉన్నారు. ఖర్చులు తట్టుకోవడం కష్టం కదా! అయినా పిల్లలందరికీ పెళ్లిళ్లు అయ్యి పది ఏళ్లు పైన అయింది. ఏమీ అనుకోరు లెండి అంది జానకమ్మ తన భర్త సుందర రామయ్య తో. సుందర రామయ్య ఎటు చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఏం చేస్తాడు ఇంటి యజమాని కదా! ఏ నిర్ణయం తీసుకున్న మాటలు పడేది ఆ ఇంటి యజమాని కదా! సుందర రామయ్యకి కూడా అదే అనిపించింది. రమారమీఅరవై ఐదు ఏళ్లు వయస్సు దాటింది జానకమ్మకి. ఇప్పుడు ఇంకా కష్టపెట్టడం ఏమిటి అనుకున్నాడు.  సుందరామయ్యకి నలుగురు ఆడపిల్లలే. అందరికీ పెళ్లిళ్లు అయ్యి పిల్లలతోటి భాగ్యనగరంలో కాపురాలు చేసుకుంటున్నారు. ఎవరికి ఏ లోటు లేదు. సుందరామయ్య మటుకు ఉన్న ఊరిలో సొంత ఇంట్లోనే ఉంటూ భార్యతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. జానకమ్మ ఆరోగ్యం అంతగా బాగుండదు. అయినా ఏ పండుగకి పిల్లల్ని పిలవకుండా ఉండరు.  ఈసారి జానకమ్మ ఎందుకు అలా చెప్పింది? అలా ఎప్పుడూ చెప్పలేదు. సుమారు యాభై సంవత్సరాల నుంచి చాకిరీ చేసి చేసి అలిసిపోయింది జానకమ్మ. ఏమిటో రేపు ఒకసారి జానకమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్...

పెళ్లి దొంగ

పెళ్లి దొంగ " అయ్యా సోమేశ్వరావు గారు ఇరవై ఇత్తడి గ్లాసులు లెక్కకు తక్కువయ్యాయి. అన్నిచోట్ల వెతికాము. ఆరోజు లెక్క కట్టి అప్పచెప్పాము మీకు .వీటి ఖరీదు మీరు భరించవలసిందే. మీరు ఇచ్చిన అడ్వాన్స్ లో వీటి ఖరీదు తగ్గించుకుంటాము అంటూ కన్యకా పరమేశ్వరి సత్రం గుమస్తా చెప్పిన మాటలకు తల తిరిగిపోయినట్లు అయింది సోమేశ్వరావుకి.  ఈ మాటలు ఎవరైనా వింటే పరువు కూడా పోతుంది అనుకుని ఈ ఇత్తడి గ్లాసులు ఎవరు పట్టుకెళ్ళిపోయారబ్బా పనివాళ్ళు తీసుకెళ్లే ఆస్కారం లేదు. బయట పని వాళ్ళు ఎవరూ రాలేదు.మన బంధువులలో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా మగ పెళ్లి వారు ఆ మాట పైకి అనడానికి వీలు లేదు. మమ్మల్ని అనుమానించావని దెబ్బలాడుతా రు.   అవును ఆ ఇత్తడి గ్లాసులు దుక్కల్లా ఉన్నాయి. పెళ్ళి వారి విడిదిలోకి కాఫీ కోసమని మంచినీళ్ల కోసం అని పంపించిన గ్లాసులు. బాగా గుర్తున్నాయి. ఏమిటో ఈ సమస్య. ఏమీ ఎవరిని అడగడానికి వీలులేదు. పైకి మాట్లాడుకోవడానికి వీల్లేదు. అయినా కానీ పొరపాటున తీసుకుని వెళ్ళిపోయారు అంటే అవి చాలా బరువు కూడా ఉన్నాయి. ఇది కావాలనే పట్టుకెళ్ళిపోయారు.  మగ పెళ్లి వారిలో ఇద్దరు ఆడవాళ్లు ఆ సత్రం అంతా ఎప్పుడు తిరుగు...

అవును ఆయన చనిపోలేదు

అవును ఆయన చనిపోలేదు !. " నిన్న ఉదయం ఇద్దరం కలిసి వాకింగ్ కి వెళ్లొచ్చాం. ఆరోగ్యం బాగాలేదని ఏమీ చెప్పలేదు. ఇంతట్లో ఇలా అయిపోతాడని ఎలా ఊహిస్తాం అంటూ చనిపోయిన పరంధామయ్య స్నేహితులు మాట్లాడుకుంటున్నారు." ఎంత మంచివాడు ఎప్పుడూ గట్టిగా కూడా మాట్లాడేవాడు కాదు అంటూ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు తలోరకంగా చెప్తున్న మాటలు పరంధామయ్య భార్యకి తలకెక్కట్లేదు. ఒకపక్క భర్త పోయిన బాధ ఇంకొకపక్క ఆయన ఆశయం ఎలా నెరవేర్చాలనే భయం బంధువులు ఏమనుకుంటారు అని మరొక పక్క భయం.  పోనీ పరంధామయ్య ఆశయం డబ్బుతో కూడుకున్నదైతే ఏ గొడవ లేదు. ఆ స్తోమత ఉంది కుటుంబ సభ్యులకి. మరి ఆచార వ్యవహారాలకు సంబంధించింది. మరి పరంధామయ్య నాలుగు వేదాలు చదువుకున్నవాడు. తెల్లవారి లేస్తే అందరికీ మంచి చెడ్డ చెప్పే వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఇటువంటి కోరిక ఏమిటి? మరి దీన్ని లోకం ఎలా తీసుకుంటుంది. " ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. దీన్ని కచ్చితంగా నువ్వు పాటించాలి. ఇది నా కోరిక. నా వయసు అరవై సంవత్సరాలు దాటింది. ఎప్పుడు ఎలా ఉంటానో తెలియదు.  మనిద్దరిలో ఎవరు ముందో తెలియదు. కానీ నేనే ముందుగా పోతే నా అవయవాలను రంగరాయ మెడికల్ కాలేజీకి దానం ఇచ్చే...