ఊరి ముచ్చట్లు
ఊరి ముచ్చట్లు సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత పిల్లలందరూ రాబోయే వేసవికాలం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. సంక్రాంతి పండక్కైతే పది రోజులు సెలవులు కానీ వేసవికాలం వచ్చిందంటే ఇంకేముంది రెండు మూడు నెలల పాటు పిల్లలకి ఆటవిడుపే. పెద్ద పరీక్షలు అయిపోతే అమ్మమ్మ గారి ఊరికి పరుగులు తీస్తుంటారు. అసలు రుతువు మారుతోందని మనకి ఎలా తెలుస్తుంది. వాతావరణంలో వచ్చే మార్పులే మనకి రుతువు మారిపోతోందని తెలుస్తుంది. మహాకవి పోతన గారు భాగవత గ్రంథంలో గ్రీష్మ రుతువు గురించి చెబుతూ పగటి సమయాలు అంతకంతకు పెరుగుతున్నాయని సూర్యుడు ఉత్తర దిక్కు వైపుకు సంచరిస్తున్నాడని ఎండ తీక్షణ రోజురోజుకీ పెరుగుతుందని భూమి నుండి లేచిన దుమ్ము రేణువులు ఆకాశమంతటా వ్యాపించి ఉన్నాయని సెలయేళ్లు కొలనులు ఎండిపోయాయి బాటసారులు చలివేంద్రాల వైపు అడుగులు వేస్తున్నారని పాములు ఎండలు భరించలేక పొదల్లో చేరిపోతున్నాయని చెట్లు పూలు వాడిపోయాయని అగ్నిదేవుడు అడవులతో ఆడుకుంటున్నాడని అద్భుతమైన వర్ణన చేశారు. అలాంటి వాతావరణంలోని మార్పులతో ఆ ఊరికి అంటే మా స్వగ్రామం కాకినాడ తాలూకా కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామoలో కూడా వేసవికాలం అడుగుపెట్టేసింది....