పోస్ట్‌లు

ఊరి ముచ్చట్లు

ఊరి ముచ్చట్లు  సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత పిల్లలందరూ రాబోయే వేసవికాలం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. సంక్రాంతి పండక్కైతే పది రోజులు సెలవులు కానీ వేసవికాలం వచ్చిందంటే ఇంకేముంది రెండు మూడు నెలల పాటు పిల్లలకి ఆటవిడుపే. పెద్ద పరీక్షలు అయిపోతే అమ్మమ్మ గారి ఊరికి పరుగులు తీస్తుంటారు.  అసలు రుతువు మారుతోందని మనకి ఎలా తెలుస్తుంది. వాతావరణంలో వచ్చే మార్పులే మనకి రుతువు మారిపోతోందని తెలుస్తుంది.  మహాకవి పోతన గారు భాగవత గ్రంథంలో గ్రీష్మ రుతువు గురించి చెబుతూ పగటి సమయాలు అంతకంతకు పెరుగుతున్నాయని సూర్యుడు ఉత్తర దిక్కు వైపుకు సంచరిస్తున్నాడని ఎండ తీక్షణ రోజురోజుకీ పెరుగుతుందని భూమి నుండి లేచిన దుమ్ము రేణువులు ఆకాశమంతటా వ్యాపించి ఉన్నాయని సెలయేళ్లు కొలనులు ఎండిపోయాయి బాటసారులు చలివేంద్రాల వైపు అడుగులు వేస్తున్నారని పాములు ఎండలు భరించలేక పొదల్లో చేరిపోతున్నాయని చెట్లు పూలు వాడిపోయాయని అగ్నిదేవుడు అడవులతో ఆడుకుంటున్నాడని అద్భుతమైన వర్ణన చేశారు. అలాంటి వాతావరణంలోని మార్పులతో ఆ ఊరికి అంటే మా స్వగ్రామం కాకినాడ తాలూకా కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామoలో కూడా వేసవికాలం అడుగుపెట్టేసింది....

ఇది సత్యం

ఇది సత్యం. " ఈసారి పండక్కి పిల్లలు ఎవరికీ ఫోన్ చేయకండి. నేను చాకిరి చేయలేకపోతున్నాను. మీరు కూడా రిటైర్ అయిపోయి ఉన్నారు. ఖర్చులు తట్టుకోవడం కష్టం కదా! అయినా పిల్లలందరికీ పెళ్లిళ్లు అయ్యి పది ఏళ్లు పైన అయింది. ఏమీ అనుకోరు లెండి అంది జానకమ్మ తన భర్త సుందర రామయ్య తో. సుందర రామయ్య ఎటు చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఏం చేస్తాడు ఇంటి యజమాని కదా! ఏ నిర్ణయం తీసుకున్న మాటలు పడేది ఆ ఇంటి యజమాని కదా! సుందర రామయ్యకి కూడా అదే అనిపించింది. రమారమీఅరవై ఐదు ఏళ్లు వయస్సు దాటింది జానకమ్మకి. ఇప్పుడు ఇంకా కష్టపెట్టడం ఏమిటి అనుకున్నాడు.  సుందరామయ్యకి నలుగురు ఆడపిల్లలే. అందరికీ పెళ్లిళ్లు అయ్యి పిల్లలతోటి భాగ్యనగరంలో కాపురాలు చేసుకుంటున్నారు. ఎవరికి ఏ లోటు లేదు. సుందరామయ్య మటుకు ఉన్న ఊరిలో సొంత ఇంట్లోనే ఉంటూ భార్యతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. జానకమ్మ ఆరోగ్యం అంతగా బాగుండదు. అయినా ఏ పండుగకి పిల్లల్ని పిలవకుండా ఉండరు.  ఈసారి జానకమ్మ ఎందుకు అలా చెప్పింది? అలా ఎప్పుడూ చెప్పలేదు. సుమారు యాభై సంవత్సరాల నుంచి చాకిరీ చేసి చేసి అలిసిపోయింది జానకమ్మ. ఏమిటో రేపు ఒకసారి జానకమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్...

పెళ్లి దొంగ

పెళ్లి దొంగ " అయ్యా సోమేశ్వరావు గారు ఇరవై ఇత్తడి గ్లాసులు లెక్కకు తక్కువయ్యాయి. అన్నిచోట్ల వెతికాము. ఆరోజు లెక్క కట్టి అప్పచెప్పాము మీకు .వీటి ఖరీదు మీరు భరించవలసిందే. మీరు ఇచ్చిన అడ్వాన్స్ లో వీటి ఖరీదు తగ్గించుకుంటాము అంటూ కన్యకా పరమేశ్వరి సత్రం గుమస్తా చెప్పిన మాటలకు తల తిరిగిపోయినట్లు అయింది సోమేశ్వరావుకి.  ఈ మాటలు ఎవరైనా వింటే పరువు కూడా పోతుంది అనుకుని ఈ ఇత్తడి గ్లాసులు ఎవరు పట్టుకెళ్ళిపోయారబ్బా పనివాళ్ళు తీసుకెళ్లే ఆస్కారం లేదు. బయట పని వాళ్ళు ఎవరూ రాలేదు.మన బంధువులలో అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా మగ పెళ్లి వారు ఆ మాట పైకి అనడానికి వీలు లేదు. మమ్మల్ని అనుమానించావని దెబ్బలాడుతా రు.   అవును ఆ ఇత్తడి గ్లాసులు దుక్కల్లా ఉన్నాయి. పెళ్ళి వారి విడిదిలోకి కాఫీ కోసమని మంచినీళ్ల కోసం అని పంపించిన గ్లాసులు. బాగా గుర్తున్నాయి. ఏమిటో ఈ సమస్య. ఏమీ ఎవరిని అడగడానికి వీలులేదు. పైకి మాట్లాడుకోవడానికి వీల్లేదు. అయినా కానీ పొరపాటున తీసుకుని వెళ్ళిపోయారు అంటే అవి చాలా బరువు కూడా ఉన్నాయి. ఇది కావాలనే పట్టుకెళ్ళిపోయారు.  మగ పెళ్లి వారిలో ఇద్దరు ఆడవాళ్లు ఆ సత్రం అంతా ఎప్పుడు తిరుగు...