కైలాస వీచికలు
కైలాస వీచికలు. ఉదయం నుంచి కైలాస పర్వతం అంతా హడావుడిగా ఉంది. ఆరోజు ఏమిటి ప్రత్యేకత . మహా శివుడి పుట్టినరోజు. శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు. లోకానికి మహాశివరాత్రి. మరి అటువంటి శుభ సమయంలో పార్వతి దేవి హడావుడిగా కైలాస పర్వతం అంతా తిరుగుతూ శివుడు గురించి వెతుకుతోంది. తన నేత్రాలని పత్తికాయలా చేసుకుని వెతుకుతున్న ఆ త్రినేత్రుడు జాడ ఎక్కడా కనపడలేదు. ఏమిటి స్వామి! ఎ క్కడ కనపడటం లేదు అనుకుంటూ ఆందోళన పడుతుండగా దూరం నుంచి శివుడు వస్తూ కనబడ్డాడు. పార్వతి దేవి : స్వామి ఎక్కడికి వెళ్ళిపోయారు ?మీ గురించి ఏ లోకమని వెతకను ?చాలా ఆందోళన పడ్డాను !అంటూ కోపంగా పలికింది. శివుడు: పార్వతి ఈరోజు ఏమిటో నీకు గుర్తు లేదా! నా పుట్టినరోజు మన కళ్యాణం జరిగిన రోజు అట్లాంటి పవిత్రమైన రోజున భక్తులందరూ నా గురించి అభిషేకాలు పూజలు ఉపవాసాలు కళ్యాణాలు ఎక్కడ ఖాళీ లేదు భూలోకంలో. ఈరోజుకి అంత పవిత్రత ఉంది. అందుకే జన్మానికో శివరాత్రి అంటారు. వాళ్లంత భక్తితో నా అర్చనలు చేస్తుంటే నేను ఈ కైలాసంలో ఎలా ఉండగలను. శివాలయంలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో భక్తులు నా దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎవరికి తోచిన విధంగా వారు శివ...