పోస్ట్‌లు

త్యాగమూర్తులు

త్యాగమూర్తులు వీరికి గుడులు గోపురాలు ఉండవు ఎగిరే మువ్వన్నెల జెండాలో అందరికీ మూడు రంగులే కనిపిస్తాయి. మనసుపెట్టి చూస్తే అమరవీరుల ఆశయాలు కనిపిస్తాయి. అసువులు బాసిన అమరవీరులందరి ఆశయాలకు గుర్తులుగా  ఎర్రకోట పై రెపరెపలాడుతోంది మూడు రంగుల జెండా . ఆ మహనీయుల అందరి ఆశయం ఒక్కటే. దేశాన్ని విదేశీ సంకెళ్ల నుండి విడిపించడమే. ఎవరికి నచ్చిన మార్గం వారు ఎంచుకొని పరాయి పాలన ఎదిరించి స్వాతంత్ర సమరయోధులుగా చరిత్రలో మిగిలిపోయారు.  ఈనాడు ఇలా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామంటే ఆనాడు ఎందరో వీరుల ఊపిరి ఆగిపోయిమట్టిలో కలిసిపోయి మహనీయులుగా మిగిలిపోయారు. వారు స్వాతంత్ర ఫలముఅనుభవించలేదు. పదవుల కోసం ఆశపడలేదు. బ్రతికున్న రోజుల్లో కారాగార శిక్ష అనుభవించి ఉరికంబo ఎక్కి అసువులు బాసిన మహాత్ములు.  అహింసావాదంతో గాంధీజీ బ్రిటిష్ వారిని గడగడలాడిస్తే బంకించంద్ర చటర్జీ వందేమాతర గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన గీతం రచించి జాతిని ఉత్తేజపరిచారు. దేశభక్తి ఉప్పొంగించారు. మరికొందరు ఆనాడు సమాజంలో ఉన్న సతీసహమగమనాన్ని బహు భార్యత్వాన్ని ఎదిరించి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి రాజా రామ్మోహన్ రాయ్ గా ప్రజల గుండెల్లో...

నిశ్శబ్దమైన ప్రేమ

నిశ్శబ్దమైన ప్రేమ ఏ జన్మలో ని రుణానుబంధమో ఆ స్థావరంలో నాకు ఇంత చోటు కల్పించింది . ఆ స్థావరం నా ఉనికికి ఆధారమైంది. ఆ దుర్భేద్యమైన కోట చుట్టూ తిరుగుతూ చిమ్మ చీకటిలో గర్భస్థ నరకాలన్ని అనుభవిస్తూ ఎవరో తెలియని దాత అందించిన అమృతాన్ని చప్పరిస్తూ, ఎవరో అజ్ఞాత దాత ప్రసాదించిన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నెలకొకటి చొప్పున స్వీకరిస్తూ అలుపెరుగని సైనికుడి లాగా నిత్య సమరం చేస్తుంటే నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు నీ లోకం వేరు అంటూ మాయాలోకం నుండి మన లోకంలోకి తీసుకొచ్చి పడేసి ఇదిగో నా రూపం అంటూ దేవుడు నన్ను చూపించి ఆనందపరిచాడు మా బంధువుల్ని, స్నేహితులని.  నేను కడుపులో పడినప్పుడు నేను ఒక రకంగాను అమ్మ ఒక రకంగానూ బాధ అనుభవించి నరకాలన్నీ చూసాము. నవనాడులు బిగబట్టి పురిటి నొప్పులు భరించి ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ లోకంలోకి నన్ను తీసుకురావడం అమ్మకి నరకమే. అలా భూమి మీద పడ్డ నాకు ఇన్నాళ్లు అమృతo అందించిన అన్నపూర్ణ నాకు అమ్మ అయింది. అమ్మ నుంచి వచ్చినవే నాకు బంధుత్వాలన్నీ. నాకు తొలి బంధువు అమ్మ.   తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పెరిగిన నేను అమ్మ ఒకరినొకరు చూసుకోలేదు. నా రూపం తెలియదు నా రంగు తెలియదు...

కైలాస వీచికలు

కైలాస వీచికలు. ఉదయం నుంచి కైలాస పర్వతం అంతా హడావుడిగా ఉంది. ఆరోజు ఏమిటి ప్రత్యేకత . మహా శివుడి పుట్టినరోజు. శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు. లోకానికి మహాశివరాత్రి.  మరి అటువంటి శుభ సమయంలో పార్వతి దేవి హడావుడిగా కైలాస పర్వతం అంతా తిరుగుతూ శివుడు గురించి వెతుకుతోంది.  తన నేత్రాలని పత్తికాయలా చేసుకుని వెతుకుతున్న ఆ త్రినేత్రుడు జాడ ఎక్కడా కనపడలేదు. ఏమిటి స్వామి! ఎ క్కడ కనపడటం లేదు అనుకుంటూ ఆందోళన పడుతుండగా దూరం నుంచి శివుడు వస్తూ కనబడ్డాడు. పార్వతి దేవి : స్వామి ఎక్కడికి వెళ్ళిపోయారు ?మీ గురించి ఏ లోకమని వెతకను ?చాలా ఆందోళన పడ్డాను !అంటూ కోపంగా పలికింది.  శివుడు: పార్వతి ఈరోజు ఏమిటో నీకు గుర్తు లేదా! నా పుట్టినరోజు మన కళ్యాణం జరిగిన రోజు అట్లాంటి పవిత్రమైన రోజున భక్తులందరూ నా గురించి అభిషేకాలు పూజలు ఉపవాసాలు కళ్యాణాలు ఎక్కడ ఖాళీ లేదు భూలోకంలో. ఈరోజుకి అంత పవిత్రత ఉంది.  అందుకే జన్మానికో శివరాత్రి అంటారు. వాళ్లంత భక్తితో నా అర్చనలు చేస్తుంటే నేను ఈ కైలాసంలో ఎలా ఉండగలను. శివాలయంలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో భక్తులు నా దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎవరికి తోచిన విధంగా వారు శివ...