పోస్ట్‌లు

పాదముద్రలు

పాదముద్రలు మన జీవిత ప్రయాణంలో మనకు ముఖ్యంగా సహకరించేవి మన శరీరంలో అంతర్భాగమైన కాళ్లు మరియు వాటిని అంటిపెట్టుకొని ఉండే పాదాలు.  మన గమనానికి ఇవే ఆధారం. బాల్యంలో అమ్మ చిటికెన వేలు పట్టుకుని నడిపించే తొలి అడుగులుకి తడబడే అడుగులకి మన కాళ్ళే మనకు ఆధారం.  కాలం గడిచే కొద్దీ కాళ్లు బలపడతాయి. మనసు కూడా బలపడుతుంది. ఒకప్పుడు అమ్మ ఆసరా అవసరమయ్యే మనల్ని మన కాళ్లు స్నేహితులతో పాఠశాలలకి ఆటపాటలకి తీసుకెళ్తాయి. ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేయడానికి కూడా మన అడుగులు ముందుకు పడతాయి. జీవితంలో ఎక్కవలసిన మెట్లు ఎక్కడానికి మనల్ని గమ్యం చేరుస్తూ ఉంటాయి మన కాళ్లు కానీ... పాదాలు మాత్రం ప్రతి అడుగులో ముద్ర వేసిపోతుంటాయి. కాళ్లు మన శరీరాన్ని మోస్తే...పాదాలు మన కదలికల్ని జ్ఞాపకంగా మిగులుస్తాయి. ఎప్పుడో చిన్నప్పటి ఇంటి ప్రాంగణం లో మిగిలిన పాదముద్రలు ఇప్పుడీ వృద్ధాప్యంలో వెతుక్కుంటే కనిపించవు. కానీ మనసులో మాత్రం అవే పాదాలు... మనల్ని వెనక్కి పిలుస్తుంటాయి. కాళ్లు శక్తి కాదు కాదు... ఆశ్రయం. పాదాలు గుర్తు కాదు కాదు... అనుబంధం.ఏదో ఒక రోజు  ఈ కాళ్లు నిలబడలేని స్థితి వస్తుంది. కానీ మనం వేసిన పాదాల దార...

నిత్య కళ్యాణం

నిత్య కళ్యాణం ఆంధ్రప్రదేశ్లో ప్రవహించు పవిత్ర గోదావరి నది ఒడ్డున అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో కాకినాడ జిల్లాలోని ఐ పోలవరం మండలంలో ఉన్న మురమళ్ళ గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి గుడి ఒకటి. ఇది చూడదగిన ప్రదేశం.   పార్వతి దేవి తండ్రి అయిన దక్షుడు యజ్ఞవాటికను నాశనం చేయడానికి శివుడి అంశతో పుట్టిన వీరభద్ర స్వామి నీ శాంత పరచడానికి భద్రకాళి అమ్మవారు ఒక కన్య రూపంలో వచ్చి స్వామి వివాహం గాంధర్వ వివాహం చేసుకుంటుంది.  ఈ దేవాలయం  ప్రతిరోజు ఉదయం 4:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సాయంకాలం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల సౌకర్యార్థం తెరిచి ఉంటుంది. ప్రతినిత్యం పూజలతోపాటు నిత్యం భక్తులకు అన్నదానం ప్రతిరోజు సాయంకాలం స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. పిల్లలకి వివాహాలు ఆలస్యం అవుతుంటే తల్లిదడ్రులు ఈ స్వామికి కళ్యాణం చేయిస్తామని మొక్కుకుంటారు.  ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. కాకినాడ నుంచి అమలాపురం వెళ్లే దారిలో ఈ మురమళ్ళ గ్రామం ఉంది. కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి. 

అమ్మా బొమ్మ కావాలి

అమ్మా బొమ్మ కావాలి! సాయంత్రం నాలుగు గంటలు అయింది. విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ సందర్శకులతో సందడిగా ఉంది.  ఆరోజు ఆదివారం. కొంతమందికి ఆటవిడుపు. మరి కొంతమందికి ఏరోజైనా ఒకటే.  బ్రతుకు బండి నడవాలంటే  మూడు వందల అరవై ఐదురోజులు ఆ  తీరంలో బ్రతుకు సమరం సాగించవలసిందే. ఆ సాగర తీరంలో ఒక మూలగా దుప్పటి పరుచుకుని దాని నిండా బొమ్మలు పెట్టుకుని పక్కన చంటి బిడ్డను కూర్చోబెట్టుకుని బొమ్మల అమ్ముతోంది ఓ యువతి. అది ఆమె బ్రతుకు సమరం. ఉదయం పూట రహదారి పక్కన సాయంకాలం సాగర తీరం లో బొమ్మలు అమ్మడం ఆమె దినచర్య.  ఉదయమేఇంత ముంత కట్టుకుని షావుకారు దగ్గర బొమ్మలు  తెచ్చుకుని తట్టలో బొమ్మలు పెట్టుకుని ఒక చేత్తో  బిడ్డను నడిపించుకుంటూ బ్రతుకు సమరం ప్రారంభిస్తుంది. సాయంకాలానికి  షావుకారు ఇచ్చిన రోజు కూలీతో బ్రతుకు జీవనం సాగిస్తుంది. ఆమె పేరు నరసమ్మ. ఆమె పక్కనే కూర్చుని ఇసుకలో ఆడుకుంటున్న ఆ పోరడి పేరు రాజు. రాజు ఉదయం నుంచి ఒకటే ఏడుపు. బొమ్మలు కావాలని. పాపం చేతిలో ఎన్నో బొమ్మలు ఉన్న ఒక బొమ్మ కూడా ఆ పిల్లాడికి పిచ్చి ఆడించలేని ఆర్థిక పరిస్థితి ఆమెది. ఒక బొమ్మ ఖరీదుతో ఒకరోజు జీవితం నడిచిపో...