పోస్ట్‌లు

శ్రీకాకుళం జిల్లా విహారయాత్ర

శ్రీకాకుళం జిల్లా విహారయాత్ర. వేసవి సెలవులు ఇచ్చే సమయం ఆసన్నమైపోయింది. పిల్లలందరూ టూర్లు పెడదామని ఒకటే గొడవ పెడుతుంటారు. పెద్దలు కూడా ఏదో ఆటవిడుపు కోసం ఏదో ఒక ప్రదేశానికి వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. పిల్లల్ని తీసుకుని విదేశాలకు వెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాకాకుండా మన రాష్ట్రంలోనే(ఆంధ్రప్రదేశ్) చాలా చారిత్రక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, విహార స్థలాలు, సముద్ర తీర ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లా కూడా విహారయాత్రలకు అనుకూలమైనదే. ముందుగా మనం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని విహారయాత్ర స్థలాలు, పుణ్యక్షేత్రాలు, సముద్ర తీర ప్రాంతాలు గురించి తెలుసుకుందాం.  శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ కి ఉత్తర ప్రాంతంలో ఉండే జిల్లా ప్రధాన కేంద్రం. ఒరిస్సా రాష్ట్రానికి సరిహద్దుగా ఉండే ఒక ప్రదేశం. ఈ జిల్లాలో నాగావళి వంశధార నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అద్భుతమైన ఆలయాలు, బౌద్ధ చరిత్ర , గ్రామీణ సంస్కృతి ఒకే చోట చూడాలంటే ఈ జిల్లాని మనం తప్పకుండా సందర్శించాలి. శ్రీకాకుళం పట్టణం విశాఖపట్నం విమానాశ్రయానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంత...

ముసలితనం

ముసలితనం ఉదయం ఏడు గంటలు అయింది.  ఎప్పుడూ తెల్లవారుజామునే లేచే నాన్న ఇంకా లేవలేదు ఏమిటి. ఒంట్లో ఏమైనా బాగోలేదా ! రాత్రి బాగానే ఉన్నాడు గదిలో చప్పుడు ఏమీ లేదు అనుకుంటూ తండ్రి రామయ్య గదిలోకి అడుగుపెట్టి న శరత్ కి రామయ్య గారు ఇంకా దుప్పటి ముసుగులోనే ఉండడం చూసి దుప్పటి తీసి ఒంటి మీద చెయ్యి వేసాడు. ఒళ్ళు వేడిగా ఉంది. కాలిపోతోంది. వెంటనే నాన్న ధర్మా మీటర్ నోట్లో పెట్టుకో అంటూ కంగారుగా రామయ్య గారిని లేపి ధర్మా మీటర్ నోట్లో పెట్టాడు. 102 జ్వరం. ఏమైంది నాన్న? అంటూ కంగారుగా అడిగా డు. ఏమి లేదురా ఈమధ్య రోజు ఎండకు తట్టుకోలేక రాత్రి పగలు a c వేసుకుని పడుకుంటున్నాను కదా. కాస్త జలుబు చేసి జ్వరం వచ్చింది.  నాకు ఏసీ పడదు కదా! నేను మొహం కడుక్కొని వస్తానంటూ బాత్రూంలోకి వెళ్ళాడు రామయ్య. శరత్ కి చిన్నతనం నుంచి కంగారు ఎక్కువ. భయం. ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటాడు. పైగా రామయ్య గారికి ఒక్కడే కొడుకు శరత్. తల్లి పోయిన దగ్గర నుంచి తండ్రిని చంటి పిల్లాడిలా చూసుకుంటాడు. అయిందానికి కాని దానికి డాక్టర్ దగ్గరికి బలవంతంగా తీసుకుపోతుంటాడు రామయ్య గారిని. అతి ప్రేమతో చచ్చిపోతున్నారు ఇంట్లో జనం. మావయ్య గారు ఇప...

మానవత్వం

మానవత్వం  రచన : మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు                   కాకినాడ 9491792279 " ఏమండీ మన సుజాత పిల్లలనీ మనం తెచ్చుకుని పెంచుకుందామా! అంటూ ఆప్యాయంగా అడిగింది భర్త రాజారావుని భార్య రాధిక. మనకు పెళ్లయ్యి మూడు ఏళ్లు అయింది కదా! రేపు మాపో మనకు కూడా పిల్లలు పుడతారు. మనకి కూడా పిల్లలు పుడితే రేపొద్దున ఈ పిల్లలందరినీ కలిపి పెంచి పెద్ద చేయగలమా అని ఆలోచిస్తున్నాను అన్నాడు రాజారావు భార్యతో. భర్త సందేహం కూడా నిజమే అనిపించింది రాధిక కి. ఏం చేయాలి ? పాపం పసివాళ్లను చూస్తే జాలేస్తుంది.  సుజాత పోయిన దగ్గర నుంచి భర్త కూడా వాళ్ళని పట్టించుకోవడం మానేశాడు. సుజాత బతికున్నప్పుడు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకునేది. అంత చిన్న వయసులోనూ క్యాన్సర్ తోటి పోవడం ఏంటి ఈ పిల్లల కర్మ ఇలా కాలిపోవడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అనుకున్నారు భార్యాభర్తలు . అలా భార్యాభర్తలిద్దరికీ చాలాసేపు ఆ రాత్రి నిద్ర పట్టలేదు.  సుజాత రాజారావుకి ఒక్కగా నొక్క చెల్లెలు. భర్త రామ్ గోపాల్ తో ఇద్దరు పిల్లలతో హైదరాబాదులో చక్కగా కాపురం చేసుకుంటూ ఉండేది. ఆడపిల్...