పోస్ట్‌లు

పెళ్లి

పెళ్లి " నాన్న  ఈ అమ్మాయి ఫోటో నాకు బాగా నచ్చింది అంటూ  చేతిలో ఉన్న పది ఫోటోల్లో ఒకటి సెలెక్ట్ చేసి తండ్రి కిచూపించాడు రఘు. ఈ అమ్మాయి బీఎస్సీ బీడీ చదువుకుంది రా మరి నువ్వేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వి మీ ఇద్దరికీ ఎలాకుదురుతుంది పైగా పిల్ల ఎక్కడో కోనసీమలో ఉంటోoది. లేదునాన్న టీచర్ ఉద్యోగమే బెస్ట్ ఆడవాళ్ళ కి. బోల్డన్ని సెలవులుఉంటాయి .       పైగా టైమింగ్ లు కూడా చాలా సౌకర్యంగా  ఉంటాయి. నాకు ఆ కోనసీమ అంటే ఇష్టం. మనం రేపే  పెళ్లిచూపులుకి వెళదాం అంటూ తండ్రి రఘురామయ్యని  తొందరపెట్టాడు రఘు. రఘురామయ్యగారి భార్యతో ఆలోచించి పెళ్లి చూపులకు వస్తున్నామని పెళ్లికూతురు సీతాదేవి తండ్రి కృష్ణారావు గారికి కబురు పంపారు. కృష్ణారావు గారు కోనసీమలోని అయినవిల్లి గ్రామంలో సైన్స్ టీచర్ గా పని చేస్తున్నారు. ఆయనకి ఇద్దరు పిల్లలు. కొడుకు కూతురులు ఇద్దరినీ బిఎస్సి బీఈడీ చదివించారు. చాలా సాంప్రదాయమైన కుటుంబం అని మధ్యవర్తుల ద్వారా విని రఘురామయ్య గారు భార్య పెళ్లి కొడుకు ,పెళ్లి కొడుకు చెల్లి హైదరాబాదులో రాత్రి 10 గంటలకు బస్సు ఎక్కి తెల్లవారుజామున నాలుగు గంటలకి రావులపాలెంలో దిగి...

మోసం

మోసం  అర్ధరాత్రి 12 గంటలు అయింది. అందరూ ఆదమర్చి నిద్రపోయేవేళ ఒక పొట్టిగా ఉండే ఆకారo పంచ కట్టుకుని ఆ పుంతలోనడిచి వెళ్తోంది. ఎవరైనా చూస్తున్నారేమో అని అటు ఇటు చూసుకుంటూ ముందుకు నడుస్తోంది. ఆ ఊరి ప్రజలకు ఇది తెలియని బాగోతం కాదు జుట్టు పట్టుకుని నిలదీద్దాం అంటే ఆయన ఊరికి వంద ఎకరాల మోతుబరి రైతు .పోనీలే వయసులో ఉన్న కుర్రాడు అనుకుంటే కనిపెంచిన అమ్మ బ్రతికే ఉంది కానీ తల మీద నెరిసిన జుట్టు కుర్రాడు అంటే వెక్కిరిస్తుంది. అలా వె డుతూ మధ్యలో కనిపించిన అమ్మవారి గుడి ముందు ఆగి నమస్కారం చేసుకుని సందు తిరిగి కుడి చేతి పక్కనున్న ఇంటి ముందు ఆగింది. రోజు అలవాటు కదా తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. తలుపు తీసుకుని లోపలికి అడుగుపెట్టాడు. ఏ ఆకర్షణ లేకుండా ఏ గుమ్మంలోనూ అడుగుపెట్టడు ఈ పెద్దమనిషి. రాజకీయంగా ఎదగాలని చీకట్లో ఓటర్ల కాళ్లు పట్టుకుని చేతిలో పెట్టవలసింది పెట్టి పంచాయతీ పీఠం ఎక్కేసాడు. సరిహద్దు పొలం బక్క రైతు ని అవసరానికి ఆదుకుని వడ్డీ మీద వడ్డీ చక్ర వడ్డీలు కట్టి సరిహద్దులు చెరిపేసాడు. కనపడిందంతా నాది అని గర్వంగా చెప్పుకుంటాడు.  మరి ఈ గుమ్మంలో కనపడిన ఆకర్షణ ఏమిటో. ఎవరికీ అర్థం కాదు. పోన...

ఉగాది పండుగ

ఉగాది పండుగ " ఒరేయ్ సుధాకర్ రేపు ఉదయం నాలుగు గంటలకు అలారం పెట్టు అంటూ మంచం మీద వాలింది పార్వతమ్మ. " అంత పొద్దున్నే ఎందుకమ్మా లేవడం అని అడిగాడు కొడుకు సుధాకర్ పార్వతమ్మ ని. రేపు ఉగాది పండుగ కదరా. బోల్డంత పని ఉంది నాకు. ఉదయం లేచి గుమ్మాలికి తోరణాలు కట్టుకోవాలి. వంటింట్లో బోల్డు పనుంది. మీరు లేచిన దగ్గర్నుంచి ఆకలి అంటూ చంపేస్తారు. మీరు లేచిన వెంటనే కాఫీ కూడా తాగకుండా రేపు తలంటు పోసుకోవాలి. మర్చిపోకుండా అంటూ నిద్రకి ఉపక్రమించింది. అలా మంచం మీద పడుకుoదేగాని చాలాసేపటి వరకు ఆలోచనలతో నిద్ర పట్టలేదు. పాపం రమ్య భాగ్యనగరంలో చంటి పిల్లతో ఎలా ఇబ్బంది పడుతుందో. ఉగాది పండుగకి రమ్మని ఫోన్ చేస్తే ఒక్కరోజే సెలవు అంటూ చెప్పింది. పిల్లలతో చేసుకోవడం కష్టం అనుకుంటూ ఉండగా ఇంతలో అలారం మోగింది. పార్వతమ్మకి బద్దకంగా అనిపించిన ఇక తప్పదు అనుకుంటూ లేచి బాత్రూం లోకి వెళ్లి మొహం కడుక్కుని తలంటుకుని గుమ్మాలకు తోరణాలు కట్టుకుని పసుపు బొట్టు పెట్టుకుని వంటింట్లోకి ప్రవేశించింది. మామూలుగా ఏ స్త్రీ కైనా పండగ అంటే రోజు ఉండే పనితో పాటు కొంచెం ఎక్కువగానే పని ఉంటుంది. అందులో ఉగాది పండుగ. తొలి పండుగ. ఏది ఏమైనా ఆ...