పోస్ట్‌లు

సత్తిబాబు

" పొద్దుటి నుంచి మన ఇంట్లో కరెంట్ లేదండి. ఇవాళ అసలు ఏ  పని అవలేదు వంటింట్లో. మన ఇన్వెర్టర్ కూడా పనిచేయట్లేదు అంటూ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే సంధ్య చెప్పిన మాటలకి రాజారావు గుండెల్లో రాయి పడింది.  అసలే వేసవికాలం రాత్రి ఏసీ లేకుండా ఎలాగా అని ఆలోచిస్తూ అసలే ఈ ఊరికి కొత్త ఇప్పుడు ఎలక్ట్రీషియన్ నెంబర్ ఎలాగా అని అనుకుంటూ రాజారావు ఎదురింటి ప్లాట్ తలుపు తట్టాడు. ప్లాటు తలుపు తీయగా నే " నమస్కారమండి నా పేరు రాజారావు నేను ఎదురింటిలో కొత్తగా దిగా ను. కొంచెం మీకు తెలుసున్న ఎలక్ట్రీషియన్ నెంబర్ ఏదైనా ఉంటే ఇవ్వండి మా ప్లాట్ లో కరెంట్ లేదంటూ చెప్పిన మాటలకి తలుపు తీసిన పెద్దమనిషి వెంటనే తన సెల్ లో వెతికి ఇతని పేరు సత్తిబాబు చాలా బాగా చేస్తా డు అంటూ నెంబర్ ఇచ్చాడు. థాంక్స్ అండి అంటూ బయటికి వచ్చి రాజారావు సత్తిబాబుకి కాల్ చేయగానే  వెంటనే ఫోన్ తీసి పదిహేను నిమిషాల్లో మీ ఇంటి దగ్గర ఉంటానండి అంటూ అడ్రస్ చెప్పమన్నాడు ఎలక్ట్రీషియన్ సత్తిబాబు.  నిజంగానే పదిహేను నిమిషాలకి ముందే కాలింగ్ బెల్ మోగింది. ఒక నల్లగా పొట్టిగా ప్యాంటు చొక్కా వేసుకుని జుట్టు బట్టతలలా ఉన్న ఒక యువకుడు చేతిలో సంచి పట...

హరిశ్చంద్రుడు

రాజ్యపాలన: అయోధ్యకు రాజుగా ఉన్న హరిశ్చంద్రుడు ఎంతో ధర్మపరుడు, నిజాయితీ గలవాడు. అతనికి భార్య శివ్య (తారామతిఅని కూడా పిలుస్తారు), కొడుకు లోహితదాసు ఉన్నారు. అతడు ఎప్పుడూ సత్యాన్ని మాత్రమే అనుసరించేవాడు. తన వాక్కు తప్పక చెల్లించేవాడు. అన్నిఅవకాశాల్లోనూ ధర్మాన్ని పాటించేవాడు. విశ్వామిత్రుని పరీక్ష: ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు, హరిశ్చంద్రుని ధర్మాన్ని పరీక్షించాలనుకుంటాడు. మొదట అతనికి ఒక కలలో దేవతలు ఆశీర్వదించారని చెప్పి, యజ్ఞానికి దానం కోరుతాడు. హరిశ్చంద్రుడు అంగీకరించి తన మొత్తం రాజ్యాన్ని దానం చేస్తాడు. అయితే విశ్వామిత్రుడు వెంటనే చెబుతాడు: "ఇది కలలో ఇచ్చావు, కానీ వాస్తవంగా అమలు చేయాలి. రాజ్యాన్ని ఖచ్చితంగా అప్పగించు మరియు దానానికి తగిన దక్షిణను కూడా చెల్లించు." ధనo లేనివాడు – బానిసత్వం: హరిశ్చంద్రుడు ధనం లేక ఏమీ ఇవ్వలేకపోతాడు. దాంతో ఆయన భార్య, కుమారునితో కలసి వనాలకు వెళ్ళి దానానికి తగిన ధనాన్ని సంపాదించాలనుకుంటాడు. కాశీ (వారణాసి)కి వెళ్లి భార్యను ఒక బ్రాహ్మణుడికి సేవకురాలిగా అమ్మేస్తాడు. తన కుమారుడిని కూడా అతనికి తోడుగా పంపుతాడు. తాను మాత్రం శ్మశానంలో పనిచేయడం మొదలు పెడతాడు, మ...

రాజుల కోటలు

మన ఆంధ్ర ప్రాంతాన్ని అనేక రాజవంశాలు, విదేశీయులు క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు పరిపాలించారు. అందులో శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణు కుండినిలు,వేంగీ చాళుక్యులు, చోళులు ,కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, గజపతులు ,బహుమనీ సుల్తాన్లు, మొగలులు, ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ప్రభుత్వం వారు ముఖ్యులు.  అయితే వీరిలో చాలామంది రాజ్యాలను స్థాపించి కోటలను నిర్మించి పరిపాలించేవారు. ఒకప్పుడు అత్యంత వైభవంతో వెలిగిపోయిన ఈ కోటలు మనకిప్పుడు పర్యాటక ప్రదేశాలుగా మిగిలిపోయేయి.  అసలు కోట అంటే ఏమిటనే సందేహం మనలో చాలామందికి కలుగుతుంది. కోట అంటే రాజులు నివాస ఉండే కట్టడం. అక్కడి నుంచే రాజు రాజ్యాన్ని పరిపాలించేవాడు. శత్రువుల నుండి దేశాన్ని రక్షించడం కోసం సురక్షితమైన కట్టడం ఇది. ఇందులో రాజు తన పరివారంతో కొలువుతీరి ఉండేవాడు. అలా ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన అనేకమంది రాజవంశాలు సిమెంటు ఇటుక కూడా తెలియని రోజుల్లో అంత భారీ ప్రాంగణాలు ఎలా నిర్మించారనేది ముఖ్య విషయం.  నిజంగా వారి దూర దృష్టికి తార్కిక దృష్టికి నిర్మాణ కౌశల్యానికి జోహార్లు చెప్పకుండా ఉండలేం.    అయిత...