ఆ స్వరం
ఆ స్వరం దేవుడిచ్చిన వరo. అన్నమయ్య పద కవితా వైభవాన్ని ఆ గొంతులో వినడం యావత్ ప్రజానీకం చేసుకున్న అదృష్టం. మనం అన్నమయ్య పద సాహిత్యం లోని మాధుర్యాన్ని అనుభవిస్తున్నాం కానీ అన్నమయ్య గొంతు మనకు తెలియదు. చేతిలో తంబురా పట్టుకుని కర్ణాటక సంగీత స్వరాలు ఆధారంగా చేసుకుని జీవితమంతా అన్నమయ్య పద స్వరార్చన చేస్తూ కాలం గడిపిన మహా గాయకుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్. అన్నమయ్య కీర్తనలు అందరూ పాడతారు. కానీ ఈ స్వరము వినగానే ఏదో భక్తి భావం మనలో పుట్టి ఏదో లోకంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. మనసుని ఆనందపరుస్తుంది. పదే పదే ఆ పాట వినాలనిపిస్తుంది. విష్ణు కథ వినడం మన భాగ్యమని అన్నమయ్య గారు అంటే ఆ పాట ఈ గొంతులో వినడం మనమందరం చేసుకున్న అదృష్టం " నారాయణ నీ నామమే గతి మాకు అని అన్నమయ్య చెబితే ఈ బాలకృష్ణుడు గొంతులో ఆ పాట యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించడం మనకి వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వరప్రసాదంగా భావించాలి. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అనే అన్నమయ్య పాట గరిమెళ్ళ వారి గొంతులో వినగానే ఒక్కసారి ఆ కోనేటి రాయుడుమన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాడు అనడంలో సందేహం లేదు. ఆయన సంగీత స్వర బాణీ అటువంటిది. పల...