పోస్ట్‌లు

ఆ స్వరం

ఆ స్వరం దేవుడిచ్చిన వరo. అన్నమయ్య పద కవితా వైభవాన్ని ఆ గొంతులో వినడం యావత్ ప్రజానీకం చేసుకున్న అదృష్టం. మనం అన్నమయ్య పద సాహిత్యం లోని మాధుర్యాన్ని అనుభవిస్తున్నాం కానీ అన్నమయ్య గొంతు మనకు తెలియదు.  చేతిలో తంబురా పట్టుకుని కర్ణాటక సంగీత స్వరాలు ఆధారంగా చేసుకుని జీవితమంతా అన్నమయ్య పద స్వరార్చన చేస్తూ కాలం గడిపిన మహా గాయకుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్. అన్నమయ్య కీర్తనలు అందరూ పాడతారు. కానీ ఈ స్వరము వినగానే ఏదో భక్తి భావం మనలో పుట్టి ఏదో లోకంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. మనసుని ఆనందపరుస్తుంది. పదే పదే ఆ పాట వినాలనిపిస్తుంది. విష్ణు కథ వినడం మన భాగ్యమని అన్నమయ్య గారు అంటే ఆ పాట ఈ గొంతులో వినడం మనమందరం చేసుకున్న అదృష్టం   " నారాయణ నీ నామమే గతి మాకు అని అన్నమయ్య చెబితే ఈ బాలకృష్ణుడు గొంతులో ఆ పాట యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించడం మనకి వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వరప్రసాదంగా భావించాలి. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అనే అన్నమయ్య పాట గరిమెళ్ళ వారి గొంతులో వినగానే ఒక్కసారి ఆ కోనేటి రాయుడుమన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాడు అనడంలో సందేహం లేదు. ఆయన సంగీత స్వర బాణీ అటువంటిది. పల...

మనిషి ఎప్పుడూ బలహీనుడే

ఉదయం 6:00 అయింది.  గదిలో మంచం మీద పడుకున్న సుమతికి వీధిలో గట్టిగా మాటలు అరుపులు వినపడడంతో ఒక్కసారి మెలకువ వచ్చింది.  బయటి నుంచి ఏవో శబ్దాలు. బహుశా వర్షం పడు తోంది అనుకుంటూ కాళ్లు కిందపెట్టేటప్పటికీ చల్లగా తగిలింది.  ఏంటి నీళ్లు ఒలికి పోయాయా! అనుకుంటూ లైట్ వేసింది. లైట్ వెలగలేదు. కరెంట్ లేదనుకుంటా మరి ఇన్వర్టర్ పనిచేయట్లేదా అనుకుంటూ బ్యాటరీ లైట్ వేసి గది అంతా చూసింది  గదినిండా నీళ్లు. అలాగే నడుచుకుంటూ హాల్లోకి వచ్చేటప్పటికి హా లు రెండో బెడ్ రూమ్ కిచెన్ డైనింగ్ హాలు కూడా నీళ్లతోటి మునిగిపోయి ఉన్నాయి. ఒక్కసారి ఒళ్ళు జల్లుమంది సుమతికి. ఏం చేయాలో తోచలేదు. పనిమనిషి రాలేదు. ఇంత నీరు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటూ గదిలోకి వచ్చి భర్త రామారావు నీ లేపింది. సాధారణంగా ఏదైనా ముఖ్యమైన పని ఉంటే గాని భర్తని ఆ సమయంలో నిద్ర లేపని సుమతిని ఏమైంది అని ఆందోళనగా అడిగాడు రామారావు. " మన ఇంట్లో నీళ్లు వచ్చేసేయండి అని సుమతి మాటలు ఒక్కసారి వినేసరికి రామారావు గబుక్కుని హాల్లోకి వచ్చి వీధి తలుపు తీశాడు. బయట హోరున వర్షం కురుస్తోంది. కారు సగం వరకు మునిగిపోయింది. పెరడు నిండా నీళ్లు. అప్పటికే ...

సినిమా రంగంలో ఎన్టీఆర్

భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్ అనే నామం అక్షరాలా సువర్ణాక్షరాలతో లిఖించబడింది. నందమూరి తారక రామారావు తన నటనా ప్రతిభతో, పాత్రల లోతుతో, పాత్రను జీవించిన విధానంతో కోట్లాది ప్రజల మనసుల్లో అమరుడయ్యాడు. ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించినా, కొన్ని పాత్రలు మాత్రం మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అలాంటి పాత్రల్లో అగ్రస్థానంలో ఉండేది — శ్రీకృష్ణుడు పాత్ర. శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ — ఓ జీవమంత పాత్ర ఎన్టీఆర్ చేసిన శ్రీకృష్ణుడు పాత్ర మాత్రమే కాదు, ఆ పాత్రను జీవించడం, ఆ పాత్ర తత్త్వాన్ని ప్రజలకు చేరవేయడం ఆయనకు మాత్రమే సాధ్యమయ్యింది. 1957లో వచ్చిన "మాయాబజార్" సినిమా ఈ పాత్రకు శిఖరంగా నిలిచింది. ఇందులో ఆయన శ్రీకృష్ణునిగా నటించి, ఆ పాత్రలో ఉన్న మాయ, తెలివితేటలు, ధర్మబద్ధత, ప్రేమ, వ్యంగ్యబుధ్ధి — అన్నిటినీ గొప్పగా ప్రదర్శించారు.  మాయబజార్‌లో శ్రీకృష్ణుని పాత్రను చూస్తే, ఆయన కళా నైపుణ్యం, అభినయం, శబ్ద విన్యాసం అన్నింటిలోనూ ఎన్టీఆర్ ఎలా అద్భుతంగా నటించారో స్పష్టంగా తెలుస్తుంది. పౌరాణిక పాత్రలలో ఎన్టీఆర్ ప్రభావం శ్రీకృష్ణుడే కాకుండా, ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు...