పోస్ట్‌లు

అది నాకు ఇష్టం లేదు

"అమ్మా ! ఆకలేస్తుంది అన్నం పెట్టవే! అని అడుగుతున్న పదేళ్ల కొడుకు రాఘవని ఉండరా ఇంకా నాలుగు పేపర్లే ఉన్నాయి అవి కూడా దిద్దేసి పెడతాను. ఒక పని అయిపోతుంది. లేదంటే పేపర్లో దిద్దాలంటే బద్ధకం వస్తోంది రా! నీకు ఆకలి కాదురా! వెధవా!సెలవులు కదా ఏమి తోచట్లేదు అనుకుంటాను. టిఫిన్ తిని రెండు గంటలు కూడా అవలేదు అoటు కొడుకుకి సమాధానం ఇచ్చి తెలుగు పేపర్ లో దిద్దడంలో మునిగిపోయింది ప్రత్యూష. ప్రత్యూష ఆ ఊరిలో పేరు మోసిన కాన్వెంట్లో తెలుగు టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. అది అసలే ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్. ఇంకేముంది తెలుగు పేపర్ దిద్దడం అంటే చాలా ఈజీ. కారణం ఏంటంటే తెలుగు అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి చాలా కష్టమైన సబ్జెక్టు అంటారు.  అందుకని తప్పులు ఎక్కువగా రాస్తారు. పిల్లలు కూడా ఏదో పాస్ మార్కుల కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలుగు నేర్చుకోవాలని ఉత్సాహం ఎవరికీ ఉండట్లేదు. చిన్నప్పటినుంచి వర్ణమాల బదులు ఆంగ్ల అక్షరాలు తో ప్రాథమిక విద్య ప్రారంభం అయింది కాబట్టి తెలుగు సబ్జెక్ట్ అంటే చాలా భయం పిల్లలకి ఈ రోజుల్లో.  ఇప్పటికి సుమారుగా నలభై పేపర్లు పైగానే దిద్దింది ప్రత్యూష. అందులో అందరూ ఒక వ్యాసం రాసిన వ...

జరిగిన కథ

మధ్యాహ్నం రెండు గంటలు అయింది  అదొక ప్రభుత్వ ఆఫీసు కార్యాలయం లంచ్ రూమ్ అంత హడావుడిగా ఉంది. లంచ్ చేసే సమయమే ఆటవిడుపు సమయం. ఆ అరగంటసేపు ఆ ఉద్యోగస్తులు అందరూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. రోజు ఏవో ఓ టాపిక్ లు. అది కాలేజీలు స్కూళ్లు తెరిచిన సమయం. ఇంకేముంది చదువులు గురించి అడ్మిషన్ గురించి మొదలైంది కబుర్లపర్వం. " మీ వాడు ఎందులో జాయిన్ అయ్యాడు? అని అడిగాడు ప్రభాకర్ తను స్నేహితుడు కుమార్ ని. మావాడు బీకాంలో జాయిన్ అయ్యాడు రా! అన్నాడు కుమార్. బీకాం ఏమిటిరా! ఇంటర్మీడియట్ లో సైన్స్ గ్రూప్ తీసుకుని అన్నాడు ప్రభాకర్.  ఒక్కసారి కుమార్ మనసుకి బాధగా అనిపించింది. ఈ రోజుల్లో బీకాంలు , బిఏలు ఎవరు చదువుతున్నారు రా! అన్నట్టు అనిపించింది.  మా వాడు బీటెక్ లో జాయిన్ అయ్యాడు అన్నాడు గొప్పగా ప్రభాకర్. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చాలా బాగుందిరా! నాలుగో సంవత్సరంలో ఉండగానే జాబ్ వచ్చేస్తుంది అంటూ ఆ కాలేజీ గురించి చదువు గురించి ఒక పావు గంట సేపు చెప్పాడు.  కుమార్ , ప్రభాకర్ ఇద్దరు ఒక ప్రభుత్వ కార్యాలయంలో కలిసి పని చేస్తూ ఉంటారు. విచిత్రంగా వాళ్ళిద్దరి పిల్లలు కుమార్ కొడుకు ప్రవీణ్ ప్రభాకర్ కొడుకు ప్...

కోరంగి మడ అడవులు

కోరంగి అభయారణ్యo. పూర్వకాలం నుండి మానవుడు తన ఆహారం కోసం, వినోదం కోసం జంతువులను వేటాడి చంపడం అనేది ఉందని మనకు తెలుసు. పైగా అడవులలో స్వేచ్ఛగా జరిగే జంతువులకు అప్పట్లో రక్షణ లేదు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు జంతువులను వేటాడి చంపే వాళ్ళు. ఈ జంతువుల వేట అనేది రకరకాలు గా ఉంటుంది.  ఆహారపు వేట, క్రీడా వేట, వాణిజ్యపు వేట. ఆహారపు వేట అంటే తెలుసు, తమ వినోదం కోసం జంతువులను చంపడం క్రీడా వేట, జంతువుల చర్మం దంతాలు మొదలు వాటిని తమ వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం వాణిజ్యపు వేట. ఇలా ఎవరు మటుకు వాళ్ళు అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే జంతువులు వేటాడుతూ పోతుంటే చాలా జంతువుల రకాలు మనకి కనుమరుగైపోయేయి.  వన్యప్రాణులను సంరక్షించాలని ఉద్దేశంతో ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 లో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం జంతువులు వేట నిషేధించబడింది. అందులో భాగంగానే అభయారణ్యాలు ఏర్పాటు చేయడం జరిగింది.  వన్యప్రాణుల రక్షణ, పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యాటక ,విద్య ,పరిశోధన మొదలైనవి ఈ అభయారణ్యములు ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం. మన దేశంలో చాలా చోట్ల అభయారణ్యాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా...