పోస్ట్‌లు

తల్లి

చిత్రం
ఆ తల్లి ఒడి బిడ్డకి  హంస తూలికాతల్పం  ఆ చిన్ని గొంతు తడిపే రసధార  పంచభక్ష్య పరమాన్నం.  రాగాలు లేని జోల పాట  ఆనంద సంగీతం.  ఆదరించే అమ్మ చేతులు  వాడికి అభయం. శిశిరంలో అమ్మవడి  నులివెచ్చని కొలిమి  మండుటెండలో అది  మంచు కురిసే హిమగిరి  గొంతు దాటి రాని మాటకి  అమ్మ ఆనందపు శ్రోత. ఒడిలో చేసే కసరత్తుకి  ఆమె ఒక మార్గదర్శి.  తడబడే అడుగులకి  ఆసరా ఇచ్చే తరువు తేనె పలుకులు నేర్పించే     వాగ్దేవి.  తనువులు రెండు అయినా  తలపులు అన్ని అమ్మవే  బిడ్డ తలాడించే బొమ్మ  ఆజ్ఞలు ఇచ్చేది అమ్మ తల్లిగా పుట్టడం వరమైతే  బాధ్యతతో మెలగడం  బిడ్డ జన్మ సార్ధకం .  రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279

సేవగా మారిన విషాదం

ఇది ఇప్పటి మాట కాదు. ఒకప్పటి చరిత్ర. ఒక పక్షి మరణం ఒక అద్భుత కావ్య రచనకి అవకాశం కల్పించింది. అన్నదమ్ముల పిల్లల మధ్య జరిగిన యుద్ధం భగవద్గీతకు ప్రేరణగా నిలిచింది.  ఒక చారిత్రక కట్టడం నిర్మించడానికి వెనుక అనేక బలీయమైన కారణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది.. భార్య మీద ఉన్న ప్రేమతో ఒక నవాబు గారు తాజ్ మహల్ నిర్మించారు. అలాగే భాగ్యనగరంలో ఉన్న నాలుగు స్తంభాల కట్టడం వెనుక అనేక చారిత్రక కథలు ఉన్నాయి.  ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా కాకినాడ మండలం పెనుమర్తి గ్రామంలో నిర్మించిన ఈ ఆసుపత్రి వెనుక ఒక విషాదకరమైన కథ ఉంది. మానవ శరీరంలో అతి ముఖ్యమైన భాగం కళ్ళు. కళ్ళు లేని జీవితం ఊహించలేం. ఆ చీకటి ప్రపంచంలో వారు పడే బాధలు వర్ణనాతీతం. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా ఉచితంగా కంటి చూపును ప్రసాదించాలనే ఆశయంతో కాకినాడ జిల్లా పెనుమర్తి గ్రామంలో కిరణ్ కంటే ఆసుపత్రి 1993 సంవత్సరంలో ప్రారంభించబడి రోగులకు సేవలు చేస్తూ దిన దిన ప్రవర్ధమానం అవుతూ వచ్చింది.  ఈ ఆసుపత్రి అంధుల పాలిట ఒక వరం. ఈ ఆసుపత్రి ప్రారంభించడానికి వెనుక ఉన్న ఆశయం పరిశీలిస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. జీవితంలో ఎవరికి ఇటువంటి సమస్య రా...

కలలు కన్న రాజ్యం

ఉదయo ఎనిమిది గంటలు అయింది. ఆకాశమంత దట్టంగా మబ్బులు పట్టి ఉంది. ఉదయం నుంచి ఒకటే ఈదురుగాలులు . గత రెండు రోజుల నుంచి బంగాళాఖాతంలో తుఫాను హెచ్చరికలు రేడియోలో టీవీలు గంట గంటకి వినిపిస్తున్నాయి.ఈ సమయంలో తుఫాన్లు ఏమిటి విపరీతకాలం కాకపోతేను .ఇదివరకు వర్షాకాలంలోనే వచ్చేవి. ఇప్పుడు కాలంతో పనిలేదు. ఏమిటో పంటలన్నీ కోతకు రెడీగా ఉన్నాయి.  ఇప్పుడు కనక తుఫాను వస్తే రైతులు మట్టి కొట్టుకుపోతారు. పైగా ఇది గోదావరి నది ఒడ్డు పక్కన ఉన్న పల్లెటూరు. వర్షం వస్తే గోదావరి కూడా వరదలు వస్తాయి. గత ఏడాది వచ్చిన వరదలకే ఇంకా ప్రజలు తేరుకోలేదు. ఎంత ప్రాణ నష్టం జరిగింది . పంటలన్నీ పాడైపోయా యి. పశువులన్నీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయేయి. ప్రభుత్వ సహాయం అందేటప్పటికి జరగవలసిన నష్టం జరిగిపోయింది అనుకొని భయపడుతూ ఆ వీధి అరుగు మీద కూర్చుని విద్యార్థులకి వేద పాఠాలు చెబుతున్నారు చలపతి శాస్త్రి గారు. పరోపకారార్ధం ఇదం శరీరం అనే సూక్తిని గట్టిగా నమ్మిన వ్యక్తి చలపతి శాస్త్రి గారు. పైగా అగ్రహారంలో ఉండే వేద పండితుల్లో ఒకరు.  వారసత్వంగా వచ్చిన ఆస్తి, పెద్ద ఇల్లు పదిమందితో కలిసి పోయే మంచితనం, స్నేహ తత్వం, కులమతాలు అంటే పెద్...