పోస్ట్‌లు

శ్మశానం

నిత్యజీవితంలో మనం కొన్ని ప్రదేశాల పేర్లు తలచుకోడానికి ఇష్టపడం.ఆ పేరు వింటూనే ఏదో అపశకునంగా భావిస్తాం. ఉదాహరణకు రుద్రభూమి . దాన్నే స్మశానం అంటారు. కానీ ఊపిరి లేని వాళ్ళందరూ చివరికి చేరేది ఆచోటే. ఆ చోటుకు చేరుతామని తెలుసు కానీ మనం చేరే రోజు కానీ మనం చేరిన రోజు కానీమనకు తెలియదు. కానీ ఒక కవికి ఆ స్మశాన వాటిక కవితా వస్తువై అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. కవి ఎక్కడకైనా ప్రయాణిస్తాడు. పరకాయ ప్రవేశం చేసి రావలసిన వస్తువు రాబట్టుకుంటాడు. అటువంటి కవులలో చిరస్మరణీయుడు కీర్తిశేషులు గుర్రం జాషువా ఒకరు ఇంటిపేరు గుర్రం వారు . పేరులో ఏముంది పెన్నిధి అనకండి. ఆయన ఆలోచన గుర్రం కంటే వేగంగా పయనించి అద్భుతమైన కవిత కళాఖండాలను సృష్టించాడు. ఒక స్మశాన వాటికను కవిత వస్తువు కింద ఎన్నుకోవడం ఏమిటి అనే ప్రశ్న అందరిలాగే నాకు అనిపించింది . కానీ ఈయన పద్యాలు చదివినప్పుడు ఆనాటి సమాజంలో ఉన్న అస్పృశ్యతను పారద్రోలడానికి పద్యాన్ని ఒక ఆయుధంగా ఈ స్మశాన వాటిక ఒక కవిత వస్తువుగా ఎన్నుకొన్నారు. ఇక్కడ అందరూ సమానులే కులం మతం వర్ణం వర్గం ఏమీ తేడా లేదు ఈ స్థలంలో అంటాడు. అంటే ప్రజల్ని చైతన్య పరచడానికి ఇది ఒక సాధనం. ఈ స్మశాన స్థల...

దసరా

మానవ జీవితానికి పండుగలు అంటే ఒక వరం. స్నేహితులు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండే రోజు పండుగ రోజు. ఒత్తిడితో నలిగిపోతున్న మానవ జీవితం ఆ ఒక్కరోజైనా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండగలుగుతుంది. అన్ని మతాల వారు ఈ పండుగలు జరుపుకుంటారు. ఎవరి మతానుసారం వారికి ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి. ముస్లిం మతస్తులకి రంజాన్ ప్రత్యేకమైన పండగ. అలాగే క్రైస్తవ సోదరులకు క్రీస్తు జన్మదినం అయిన క్రిస్మస్ ఒక పండుగ. హిందూమతస్తులకి ఉగాది మొదలు ప్రతినెలా ఏదో ఒక పండగ జరుపుకుంటారు. ఇది కాకుండా అమ్మవారి జాతరలు కూడా ఒక పండగలా చేసుకుంటారు. మొన్నటి వరకు గణేష్ నిమజ్జోత్సవాలు ఆనందంగా జరుపుకున్నాము. ఇక దసరా ఉత్సవాల సందడి మొదలైంది. మార్కెట్లో దసరా తగ్గింపు ధరల హోరు ప్రారంభమైంది. ప్రయాణాల సందడి మొదలైంది. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. దీన్నే దసరా పండుగ అంటారు. శరన్నవరాత్రులు అని కూడా అంటారు. శరదృతువులో వచ్చే పండుగ దసరా. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి భగవంతుడు వివిధ రూపాల్లో అవతారాలు ఎత్తేవాడు. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి త్రిమూర్తులు సృష్టించిన శక్తి స్వరూపం దుర్గామాత. శివుడు ను...

చిలిపి పనులు

అర్ధరాత్రి 12 గంటలు అయింది. వీధి తలుపు ఎవరో కొడుతుండడంతో గాఢ నిద్రలో ఉన్న గోవిందరావుకి మెలకువ వచ్చింది. "ఎవరబ్బా ఇంత అర్ధరాత్రి వేళ!" అనుకుంటూ తలుపు సందులో నుంచి బయటకు తొంగి చూసాడు. వీధిలో పదిమంది యువకులు నిలబడి ఉన్నారు. "ఎవరండీ? ఏం కావాలి?" అంటూ ప్రశ్నించాడు గోవిందరావు. "చలపతిరావు గారు పంపించారండి. ఎవరికో పురుడు వచ్చిందిట. ఇంగువ తీసుకురమ్మని పంపించారంటూ చెప్పారా" అని యువకులు. "వస్తున్నాను, ఉండండి. కొట్టు తీస్తాను," అంటూ పక్కనే ఉన్న కిరాణా కొట్టు గదిలోకి వెళ్లి లైట్ వేసి డబ్బా గురించి వెతకడం మొదలెట్టాడు గోవిందరావు గోవిందరావు అంటే ఆ ఊర్లో ఉన్న ఏకైక కోమటి. కిరాణా కొట్టు వ్యాపారం – అక్కడ లేని సరుకు ఉండదు. కానీ అన్ని హై రేట్లు. ఏ వేళ లేపినా సరుకు అప్పిస్తాడు. 'లేదు' అనకుండా కిరాణా కొట్టు మీద ఆ ఊర్లో పది ఎకరాలు భూమి సంపాదించాడు. దానికి తోడు తాకట్టు–వాకట్టు వ్యాపారం కూడా ఉంది. అంతా వ్యవసాయదారులు. ఇంకేముంది! వ్యవసాయం పనుల కోసం అప్పు తీసుకుని, పంటలు రాగానే తీర్చేస్తుంటారు. పైగా ధాన్యం కొనుగోలు కూడా ఆయనే. "మా ఊరుకి బ్యాంక్ లాంటివాడు" అని...