కోనసీమ జిల్లా విహారయాత్ర
ఆంధ్రప్రదేశ్ 2022 సంవత్సరంలో జిల్లా పునర్విభజన చట్టం ప్రకారం కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలు ఏర్పడ్డాయి. ఇంతకుముందు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలుగా ఉండే ప్రాంతమంతా మూడు జిల్లాలు అయింది. ఈ జిల్లాలో పచ్చటి పంట పొలాలతో, పిల్ల కాలువలతో, అందమైన గోదావరి నది తీరాలతో, కొబ్బరి తోటలతో అరటి తోటలతో పూల తోటలతో చాలా ఆహ్లాదకరంగా చూడడానికి ఆనందంగా ఉంటుంది.
కడియం : తూర్పుగోదావరి జిల్లాలో కడియం గ్రామంలో పూల తోటలు చూడదగినవి. ఇక్కడనుండి ప్రతిరోజు పూలని దేశంలోని వివిధ ప్రాంతాలకి విమానాల ద్వారా ఎగుమతి చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ అనేక నర్సరీలు దేశంలోని వివిధ ప్రాంతాలకి మొక్కలను సప్లై చేస్తూ ఉంటాయి.
అంతర్వేది: ఇక్కడ అతి ప్రాచీనమైన లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది. సముద్ర ప్రాంతంలో అన్నా చెల్లెళ్ల గట్టు అనే ప్రదేశం చూడదగింది.
అప్పనపల్లి : బాల బాలాజీ స్వామి వారి దేవస్థానం.
అయినవిల్లి: అమలాపురానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయంలో లక్ష్మీ గణపతి కొలువై ఉన్నాడు
ఇక్కడికి దగ్గరలో ఉన్న ముక్తేశ్వరం అనే గ్రామంలో క్షణముక్తేశ్వరుడు ఆలయం చూడదగినది
మందపల్లి: కోనసీమ జిల్లాలో కొత్తపేట మండలంలో ఉన్న శ్రీ మందేశ్వర స్వామి వారి దేవస్థానం లో శనీశ్వరుడు కొలువై ఉన్నాడు.
కోటిపల్లి: పామర్రు మండలంలో ఉన్న కోటిపల్లి గ్రామంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యత ఉన్న దేవాలయం శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవాలయం. గోదావరి తీర ప్రాంతం.
అలాగే కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం గ్రామంలో శ్రీ బాలయోగి క్షేత్రం , మురమళ్ళలో ఉన్న భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానం చూడవలసిన ప్రదేశాలు
పట్టిసీమ: ఏలూరు జిల్లాలో గోదావరి మధ్యనున్న ప్రముఖ శైవ క్షేత్రం పట్టిసీమ. ఇక్కడ వీరభద్రస్వామి కొలువై ఉన్నాడు. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు.
అయ్యా సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పోస్ట్ బాగుంది. అయితే పట్టిసీమ ని కోనసీమ జిల్లాలో చూపించారేమిటి ? అది పాత ఉమ్మడి ప .గో.జి లో లేదా ప్రస్తుత ఏలూరు జిల్లాలో కదా ఉంది ?