పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

పేరు

వాడు ఎవరు? సమాధానం ఏం చెబుతాము? వాళ్ల అమ్మా నాన్నల పేరు చెప్పి “వాళ్ల కొడుకు” అంటాము. అక్క పేరు చెప్పి “దాని తమ్ముడు” అంటాము. నిన్న మొన్నటి వరకు అమ్మ కడుపులో విహారం చేసి భూమ్మీదకి వచ్చి మూడు నెలలు అయింది. ఇవాళ్టి నుంచి వాడికో పేరు ఉంది. నిన్నటి వరకు ఏదో నోటికి వచ్చిన ముద్దుపేరుతో వాడిని పిలిచేవాళ్లం. ఇప్పుడు ఆ బాధ లేదు. పేరు పెట్టుకున్నాడు కాబట్టి సర్కారు వారు గుర్తింపు పత్రం కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ముద్దు పేరుతో పిలిస్తే వాళ్ల అమ్మ ఊరుకోదు. ఎంతో కష్టపడి వాళ్ల అమ్మానాన్న ఈ పేరు నిర్ణయించారు. పేరు నిర్ణయించడానికి ఎన్నో ఆలోచించాలి. ఆకాశంలో మెరిసే తారలను, గతించిపోయిన తరాలను కలుపుకోవాలి. ఇలవేల్పులను, ఇష్టదైవాలను మర్చిపోకూడదు. చివరలో ఎవరు పెట్టని పేరు ఉండాలి. అవి కదా నిబంధనలు! ఈ నిబంధనల చట్రంలో గిరగిరా ఎన్నో రాత్రులు తిరిగి అలసిపోయి, ఒక పేరుకు ఓట్లు వేసి, ఆ పేరు మనసులో మననం చేసుకుంటూ ఆ శుభముహూర్తం కోసం ఎదురు చూశారు వాడి తల్లిదండ్రులు. పేపర్ ఎక్కడా లీక్ అవ్వలేదు. అంత పగడ్బందీగా పబ్లిక్ పరీక్షల్లాగా ఏర్పాట్లు చేసుకున్నారు. అవును, పేపర్ లీక్ అయితే మజా ఏముంటుంది! పెళ్లి చూపుల్లో...

సూత్రధారి

నీ లీలారంగంలో పాత్రనై పుట్టాను, నీ కరుణాకటాక్షంలో శరణాగతినై నిలిచాను, నీ పాదపద్మాల చెంత విశ్రాంతినై లీనమయ్యాను. నేను నీ సంకల్పసూత్రాలకు కట్టుబడిన కీలుబొమ్మను; తెరపై తెల్లవారుజామునే నాట్యం ఆరంభింపజేసేది నీవే, తెరదించి నాటకసమాప్తి ఘడియను నిర్ణయించేది నువ్వే. తెరపై నటనకు “మహానటుడు” అనే మహిమాబిరుదులు నీవే ప్రసాదిస్తావు, ఆ బిరుదుల మత్తులో నేను ఉప్పొంగి ఉరకలేస్తాను; పాత్రపరిసమాప్తి వేళ మెడలో పూలహారాలు వేయిస్తావు, ఆ హారాల పరిమళంలో కూడా నీ చిత్తమే దాగి ఉంటుంది. నేను క్షణిక పాత్రధారిని — నీవు శాశ్వత సూత్రధారివి నేను నటనలో నిమగ్నుడను  నీవు లీలలో పరిపూర్ణుడవు. నా ఆరంభం నీ సంకల్పం, నా ముగింపు నీ మౌనం. నటించిన ప్రతి క్షణమూ నీకర్పణం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279

పిచ్చుక _ పల్లె జ్ఞాపకo

ప్రకృతి అందాలకు పుట్టినిల్లు మన పల్లెటూళ్లు. అనుబంధం, ఆప్యాయతలతో నిండిన మనుషుల మధ్య, మాటరాని మూగజీవాల సాన్నిధ్యంలో మనిషి ప్రశాంతమైన జీవితం గడపగలిగే ప్రదేశం పల్లెటూరు. అక్కడ జీవితం కృత్రిమం కాదు — సహజం. ప్రతి ఉదయం ఒక కొత్త ఉత్సాహంతో మొదలవుతుంది. గంప కింద కూస్తున్న కోడి తెల్లవారిందని సంకేతం ఇస్తుంది. పాకలోని లేగదూడ అరుపు మన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఆకాశంలో విహరించే పక్షులు, చెట్టు మీద “కుహూ కుహూ”మని ఆలపించే కోయిల, చుట్టూ నీడనిచ్చే చెట్లు — ఇవన్నీ కలిసి జీవన సంగీతాన్ని సృష్టిస్తాయి. గలగల పారే గోదావరి ప్రవాహం మనసుకు నెమ్మదిని ఇస్తుంది. తూర్పున ఉదయించే బాలభానుడు భూమిని బంగారు వెలుగులతో నింపుతాడు. ఈ సృష్టిలోని ప్రతి జీవరాశి మధ్య మనిషి సహజంగా మమేకమై ఆనందంగా జీవిస్తాడు.  ఇలాంటి వాతావరణం కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కొనలేం. ప్రకృతి అంటే కొనుగోలు చేయలేనిది, నిర్మించలేనిది — అది సహజ సిద్ధమైన వరం. దానిని ఆస్వాదించడమే మన అదృష్టం. అలాంటి మన ఊరిలో, మన ఇంటి చూరులో, ఇంటి ముందు ఉన్న తాటాకు పందిరిలో, పచ్చటి చెట్టు కొమ్మమీద గూడు కట్టుకుని నిత్యం “కిచకిచ”మని శబ్దం చేస్తూ, గోధుమరంగులో మెరిసిపోతూ నేలపై ఉ...

నిశ్శబ్ద వీరుడు

  నీ గెలుపుకోసం   ఎన్నోసార్లు నేనే ఓడిపోయాను —   మన సంసార సమరంలో   బాధ్యతగల భర్తగా నిలిచాను. కన్నబిడ్డల కలలన్నీ   నా భుజాలపై మోసుకుంటూ,   నాన్నగా నా జీవితాన్ని   నిశ్శబ్ద త్యాగంగా మార్చుకున్నాను. కుర్చీకి అతుక్కుపోయిన రోజులు,   పని గంటలు మరిచిన రాత్రులు,   రక్తపోటు పెరిగినా   కుటుంబ సంతోషమే ఔషధమైంది. ఎవరూ చప్పట్లు కొట్టలేదు, ఎవరూ గాథలు రాయలేదు; అయినా ప్రతి ఇటుకలో నా చెమట ఉంది, ఈ ఇంటి ప్రతి వెలుగులో నా శ్వాస ఉంది. ఇంతకీ నేనెవరు? పేరులేని త్యాగాల మధ్య నిశ్శబ్దంగా జీవించే వాడిని కాదు — తుఫాన్లను ఆపే తీరం, చీకట్లను తట్టుకునే దీపస్తంభం, కూలిపోకుండా కుటుంబాన్ని నిలబెట్టే అదృశ్య బలాన్ని. నేను సగటు మగవాడిని కాదు… ప్రేమను బాధ్యతగా మోసే ఒక నిశ్శబ్ద వీరుడిని రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279

అరుగు

అరుగు ఇంటికి అందం, యజమానికి ఆనందం, యజమాని కంటే ముందే అతిథి గౌరవం. ఇంటి గౌరవం కాపాడే మౌన బంధం, అడుగుపెట్టగానే మనసు నిండే అనుబంధం. రాజు కూర్చుంటే అది సింహాసనం, పసిబిడ్డకు అది ఆటస్థలం. పండు ముదుసలికి విశ్రాంతి మందిరం, ఉబుసుపోక కూర్చుంటే బోలెడు కాలక్షేపం. రామాయణం, లోకాభిరామాయణం తరతరాలుగా వింటూనే ఉంది; నవ్వుల ప్రతిధ్వనులు, కన్నీటి చరిత్రలు నిశ్శబ్దంగా తనలో దాచుకుంది. గడిచిన కాలానికి గడియారం కాదు అది— జ్ఞాపకాలను కాపాడే నిలువెత్తు గ్రంథం. వచ్చినవారిని ఆహ్వానించి, వెళ్లినవారు గుర్తుంచుకునే  మనసులను మోసే మట్టి పలక . కాలం మారినా కదలని సాక్ష్యం, మనుషులు మారినా తగ్గని ఆత్మీయత. అడుగుల రాకపోకలే దీని శ్వాస అయితే, అరుగు అంటే… ఇంటి ముందు నిలిచిన జీవితం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279

సంధ్యా రాగం

“ఒసేయ్ రమ్య, ఒసేయ్ సంధ్య … వచ్చే నెలలోనే నాన్న రిటైర్మెంట్,” అంది రమ్య, సంధ్యల తల్లి సరస్వతి. “అవునమ్మా! మొన్ననే కదా చెప్పావు. నాన్నకు అరవై ఏళ్లు నిండుతున్నాయని వెటకారం కూడా ఆడావు. అయినా ఇప్పటికి ఐదు సార్లు నుంచి ఇదే మాట చెబుతున్నావ్!” అంది రమ్య నవ్వుతూ. రమ్య తండ్రి భాస్కరరావు ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ చేరదీసి పెంచి, చదువు చెప్పించి, పెళ్లి కూడా చేశాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా, “బిడ్డ చదివితే భవిష్యత్తు వెలుగుతుంది” అనే నమ్మకంతో మేనమామ పడిన కష్టం భాస్కరరావు జీవితానికి బలమైన పునాది అయింది. అందుకే చిన్ననాట అతనికి ముద్దు ముచ్చట్లు, పుట్టినరోజు సరదాలు తెలియనే తెలియలేదు. పెళ్లైన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. పిల్లల పుట్టినరోజులు ఎంత ఘనంగా జరిపేదో, అంతే ప్రేమతో భర్త పుట్టినరోజును కూడా పండుగలా మార్చేది సరస్వతి. పొదుపు అతని అలవాటు, సంతోషం ఆమె స్వభావం—ఆ రెండు కలిసి ఆ ఇంటిని సంతోషంగా నిలబెట్టాయి. తెలుగు ఉపాధ్యాయుడిగా జీవితాన్ని అక్షరాలకు అంకితం చేస్తూ, సంసారాన్ని జాగ్రత్తగా నడిపిస్తూ, పిల్లలిద్...

రుచిలో రారాజు _అతిధి మర్యాదలో మహారాజు

అల్లుడు గుమ్మంలోకి అడుగుపెట్టాడో లేదో, ఆ క్షణమే మర్యాదలు మొదలవుతాయి మా గోదారోళ్లింట్లో. అల్లుడైనా, ఆత్మీయ అతిథులైనా—ముందుగా వండి పెట్టేది కరకరలాడే మినప గారెలే. మినుము తింటే కండబలం పెరుగుతుందన్న నమ్మకం ఒకటి; పిండి వంటలలో అది మహారాజులాంటిదన్న విశ్వాసం మరొకటి. అందుకే పెద్దలు— “తింటే గారెలే తినాలి, వింటే మహాభారతం వినాలి” అని అలా నిశ్చితంగా చెప్పేవారు. అంతేకాదు, ఈ లోకంలో ఉన్న వాళ్లకే కాకుండా పరలోకంలో ఉన్న వాళ్లకి కూడా ఈ గారెలు అంటే మహా ప్రీతి. ఏ పితృకార్యమైనా గారెలు లేకుండా ఉండదు. ఎర్రగా నూనెలో వేగిన గారె ముక్క విరుచుకుని, అల్లపు చెట్నీతో నంజుకుని తింటే స్వర్గమే కనపడుతుంది. తినేవాళ్లకి స్వర్గం కనబడుతుంది గానీ, పాపం వండే వాళ్ల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తుంది. ఒకప్పుడు యంత్రాలు వంటింట్లోకి ప్రవేశించని కాలంలో, రుబ్బురోలుతో కుస్తీపట్టి, చెమటలు కక్కుతూ, పీకల లోతు నీళ్లలో నానబెట్టిన మినప గుండును కర్కశంగా తోలువలచి, కసి కొద్దీ రుబ్బురోలు పత్రాన్ని తిప్పుతూ, ఇనప గుండులాంటి మినప గుండును పాలనురుగు రంగులో ఉన్న మినప రుబ్బుగా మార్చేవారు. రుబ్బు తయారయ్యాక హమ్మయ్య అనుకునేవారు. పిండి రుబ్బుతూ అడుతూ పాడుతూ ...