పోస్ట్‌లు

చిట్టి తల్లి

పిల్లలు దేవుడు చల్లనివారే అంటూ ఎక్కడో దూరంగా పాట విన పడుతుంది. నిజమే పిల్లలు దేవుడు ఒక్కరే అసలు దేవుడు పిల్లల్ని ఎందుకు పుట్టించాడు అంటే మన ఆనందంగా ఉండడానికి . పిల్లలు ఉన్న ఇల్లు ఎంత సందడిగా ఉంటుంది. ఇంకా చంటి పిల్లలు ఉంటే అసలు చెప్ప అక్కర్లేదు. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇటీవల కాలంలో మా మనవరాలు పుట్టడం తో మరోమారు ఆ అనుభూతుల్ని అనుభవించడానికి భగవంతుడు అవకాశం కల్పించాడు. మా చిట్టి తల్లి కి మరో బుల్లి తల్లి. నా బుల్లి తల్లి రాకతో మా ఇల్లు స్వరూపమే మారిపోయింది. నడుముకు బెల్టు చెవులకు గుడ్డా కాళ్లకు ప్లాస్టిక్ చెప్పు తో నా చిట్టి తల్లి రూపం మారిపోయింది. చంటి దాని ఏడుపుతో ఇల్లంతా మార్మోగిపోతోంది . గుట్టలుగా ఉన్నా మా ఆవిడ పాత చీరలు ముక్కలుగా మారిపోయి ప్రతి గదిలోనూ కనపడుతున్నాయి. పట్టుమని పది రోజులు కూడా ఎప్పుడు మా ఇంట్లో ఉండని మా అత్తయ్య గారు ఆరోగ్యం బాగా లేకపోయినా తన టెంపరరీ అడ్రస్ సామర్లకోటకు మార్చి చంటి దానితో బిజీ అయిపోయింది. అసలు చంటి పిల్లల్ని పెంచడం కూడా ఒక కళే. ఆమె అలనాటి సుధీర్ఘ అనుభవంతో నా చిట్టి తల్లి ని ,చంటి దాని కూడా కంటికి రెప్పలా చూసుకునేది. ముత్త అమ్మమ్మ గా ఆమె జీవ...

సామెత -1

మనం ప్రతిరోజు మాట్లాడుకునేటప్పుడు ఏదో ఒక సందర్భంలో ఒక సామెత వాడుతుంటాం. సామెత అంటే ఏమిటి? సాహిత్యపరమైన అర్థవంతమైన చిన్న పదబంధం.. ఒక్కొక్కసారి సామెత వాడుకలో అర్ధాన్ని మార్చివేస్తుంది. ఉదాహరణకి తెలుగులో ఒక సామెత ఉంది పండగ నాడు కూడా పాత మడుగేనా అది వాడుకలో పండగ నాడు కూడా పాత మొగుడేనా అని మారిపోయింది. ఇంతకీ ఈ సామెత అర్థం పండగ నాడు అందరూ కొత్త బట్టలు కట్టుకుంటారు కదా పండగ నాడు కూడా పాత వస్త్రాలేనా అని అర్థం. మడుగు అంటే వస్త్రము అని అర్థం. అందుకనే అర్థం తెలుసుకుని భాష వ్రాయడానికి ప్రయత్నించాలి. లేకపోతే చాలా ప్రమాదం ఉంది.

పట్టుదల

పట్టుదల " అమ్మాా నేను వచ్చే వారమే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి! అంటూ చేతిలో కాగితం పట్టుకుని చక్రాల కుర్చీ తోసుకుంటూ వచ్చి ఆ చల్లటి వార్త చెప్పిన సుధాకర్ ని తల్లి పార్వతమ్మ చేతిలో ఉన్న పని వదిలేసి వచ్చి గట్టిగా కౌగిలించుకునికన్నీళ్లు పెట్టుకుంది. ఇన్నాళ్ళకి నీ కష్టం తీరుతో oది రా చాలా సంతోషo అంటూ ఎక్కడ జాయిన్ అవ్వాలి రా అని అడిగింది. హైదరాబాదులో పోస్టింగ్ ఇచ్చారు అంటూ సమాధానం చెప్పాడు సుధాకర్. దేవుడు ఒకదాంట్లో చిన్న చూపు చూసిన నీకు ఒక దారి చూపించాడు అంటూ సంతోషంతో దేవుడికి దండం పెట్టుకుంది.  సుధాకర్ పార్వతమ్మ గారికి ఆరో సంతానం. పార్వతమ్మ గారి పిల్లలందరూ తెల్లగా బలంగా ఎత్తుగా ఉండేవారు . అంతా తండ్రి పోలిక. అందరిలాగే పుట్టిన సుధాకర్ ఐదేళ్ళు వచ్చేవరకు బాగానే ఉన్నాడు. ఒకరోజు అర్ధరాత్రి ఉన్నట్టుండి విపరీతమైన జ్వరం వచ్చి కాళ్లు చేతులు కదపలేకపోయాడు. సుధాకర్ తండ్రి రామారావు గారు ఆయుర్వేద వైద్యం చేసేవారు. పిల్లవాడి నాడి పరీక్షించి చూసి వాతం కమ్మిందని అనుకుని వైద్యం మొదలుపెట్టారు. అప్పటినుంచి సుధాకర్ కి అన్నీ మంచం మీదే. బిడ్డనీ అలా మంచం మీద చూసి వీడి భవిష్యత్తు ఎలాగని రోజు దిగులు పడుతుండేది ...