పోస్ట్‌లు

పండుగలో పల్లె_టూరు

పండగలో పల్లె _టూరు "ఊరూ పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు "అంటూ మనవాళ్లు ఈ మధ్యన నా గురించి అందమైన పాట ఒక చలనచిత్రంలో చాలా గొప్పగా వ్రాశారు. అప్పటినుంచి పల్లె టూరు మొదలైంది. పల్లెటూరు అంటే చుట్టూ అందమైన చెట్లు గలగల పారే సెలయేళ్లు పిల్ల కాలువలు చెరువులు పంట చేలు పాడి పశువులు అందమైన పెంకుటిల్లు విశాలమైన మనసులు ఆత్మీయమైన పలకరింపులు ఇవి నా గుర్తులు  మామూలుగానే నేను చాలా అందంగా ఉంటాను. అందులో సంక్రాంతి పండుగ. పండగ అందం పల్లెటూర్లోనే కనబడుతుంది. నా వీధుల్లో ఉండే ఇళ్ళు తోరణాలతోటి, రంగుల తోటి ,వాకిళ్లు ముగ్గుల తోటి అందంగా మెరిసిపోతూ వంటగదిలన్నీ పిండి వంటల వాసనలతో నిండిపోతూ వచ్చే అతిధుల కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి ఏదో వాహనం ఆగిన శబ్దం వినబడింది . డోర్ తీసి కళ్ళకు కూలింగ్ గ్లాసులు పెట్టుకుని నలుగురు కుర్రాళ్ళు అందంగా బ్యాగులు భుజాన్ని తగిలించుకుని కారు దిగుతూ కనబడ్డారు. వీళ్ళు ఎవరబ్బా ఆనమాలు తెలియడం లేదు ఆ ఇంటికి వచ్చేవాళ్ళు నాకు తెలియని వాళ్ళు ఎవరుంటారు. ఇంట్లో తరాలు మారిన నేను మాత్రం మారలేదు కదా.  ఎవరి పిల్లలు వీళ్ళు అని నాలో నేను అనుకుంటూ ఉంటే మన "ఊరంతా మారిపోయింది అమ్మ ...

భజన

భజన " శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనo   అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం "  ఇవి వ్యాస మహర్షి చెప్పిన నవవిధ భక్తి మార్గాలు. భగవంతుని చరిత్ర వినడం, భగవంతుని లీలలను కీర్తించడం ఇవన్నీ భగవంతుని చేరుకునే మార్గాలు. ఈ నవవిధ భక్తి మార్గముల ద్వారా భగవంతుని ఆరాధించి ముక్తి పొందిన అనేకమంది చరిత్రలు మనకి పురాణ గాథలు చెబుతున్నాయి.  అలాంటి నవవిధభక్తి మార్గాలలో భగవంతుని లీలలు కీర్తించడం ఒకటి. అనేకమంది భక్తులు రామదాసు అన్నమయ్య త్యాగరాజు ముత్తుస్వామి దీక్షితులు వంటి వారు తమ కీర్తనల ద్వారానే భగవంతుని ఆరాధించి ముక్తి పొందారని మనకి చరిత్ర చెబుతోంది. ఈనాటికీ మనం అనేక గ్రామాల్లోనూ పట్టణాలలోనూ దేవాలయాల్లో భజనలు చేయడం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా పర్వదినాల్లోనూ పండుగలలోనూ ఈ భజన కార్యక్రమాలు జరుగుతూ ఉండడం అనాది నుంచి వచ్చే సాంప్రదాయం. మా చిన్నతనాల్లో మా గ్రామంలో మా ఇంటిలో కూడా ప్రతి శనివారం భజనలు చేసేవారు.  అసలు భజన అంటే ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తుంది. పదిమంది ఒకచోట కూర్చుని చేసే భగవన్నామస్మరణ "భజన. భగవంతుని లీలలు తలుచుకుంటూ ప్రార్థించడం భజన. ఇది కూడా భగవంతుని చేరుకునే ...

ఆశయం

ఆశయం. అందాల రంగురంగుల బల్బుల వెలుగులో ఆ బహుళ అంతస్తుల భవనం మీద అందంగా మెరిసిపోతున్న" పరంధామయ్య నిలయం "అనే పేరు చూసి ఆనందపడిపోయాడు రఘురామయ్య.  ఎన్నో ఏళ్ల కలల ఫలితం. ఎన్నో సంవత్సరాలు వంటరితనంతో బాధపడిన రఘురామయ్య తొమ్మిది కుటుంబాలతో కాపురం ఉంటున్నాడు. వాళ్లు రక్త సంబంధీకులు కాదు. దూరపు బంధువులు మరియు స్నేహితులు. అయినా కావాలని అందర్నీ ఒక చోటుకు చేర్చాడు. పదిమందితో కలిసి ఉండాలని జీవితాశయం. తనకంటూ ఎవరూ తోడబుట్టిన వాళ్ళు లేకపోయినా కట్టుకున్న భార్య లేకపోయినా ఇవాళ నా వెనుక తొమ్మిదికుటుంబాలు వాళ్ళు ఉన్నారని ఆనందం రఘురామయ్య కళ్ళల్లో కనబడుతోంది ఆ అపార్ట్మెంట్ చూసి. పిల్లలు సందడితో అపార్ట్మెంట్ అంతా కళకళలాడి పోతోంది.   ఒంటరితనం నిజంగా అంత భయంకరమైనది. డబ్బు ఒంటరితన్నాన్ని దూరం చేయలేదు. వ్యసనాలు ఒంటరితనాన్ని దూరం చేస్తాయని చాలామంది దానికి అలవాటు పడతారు. కానీ ఆ కొద్ది సేపే అది తోడు ఇస్తుంది కానీ ఆ తర్వాత మామూలే. ఎవరు ఒంటరితనాన్ని కోరుకోరు.  జీవితంలో ఎవరికి ఏది వ్రాసిపెట్టి ఉంటే అదెలా జరిగిపోతుంది. దాన్ని ఆపే శక్తి ఎవరికీ ఉంటుంది. ఏది మన ప్రయోజకత్వం కాదు. ఏదో తెలియని శక్తి మనల్ని...