పోస్ట్‌లు

జీవిత భద్రత

జీవితభద్రత. కన్ను మూస్తే మరణం కన్ను తెరిస్తే జననం అని చావు పుట్టుకల గురించి ఒక కవి నిర్వచనం ఇచ్చాడు. జీవితం చాలా అనిశ్చితమైనది. ఎప్పుడు ఏది ముంచుకొస్తుందో మనకు తెలియదు. రోజు మనంచూస్తున్న మనుషులు సడన్ గా మాయం అయిపోతూ ఉంటారు.కారణాలు అనేకం హార్ట్ ఎటాక్ కావచ్చు మరి ఇతర అనారోగ్యం యాక్సిడెంట్ కావచ్చు కరోనా లాంటి వ్యాధులు కావచ్చు. ఈరోజుల్లో నడి వయసు ఉన్న వ్యక్తులకు నూటికి 90 మందికి ఆర్థిక భారాలు ఎక్కువగా ఉంటున్నాయి. రుణాలు ఇచ్చే బ్యాంకులు విపరీతంగా పెరిగాయి. అలాగే రుణం తీసుకుని వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. అన్ని సౌకర్యాల కోసంబ్యాంకుల దగ్గర అప్పు చేసి వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్నారు. అయితే అనుకోకుండా వచ్చిన ఆ వ్యక్తి మరణం వల్ల ఆ భారం అంతా భార్య మీద పిల్లల మీద పడుతుంది. ఇటువంటి సమయంలో ఆర్థిక భారాలన్నిటిని కుటుంబానికి భారం కాకుండా కాపాడేది టర్మ్ ఇన్సూరెన్స్. అయితే ఇంటి రుణాలు ఇచ్చే ప్రతి జాతీయ బ్యాంకు గాని ఫైనాన్స్ సంస్థలు గాని ఇంటి రుణం భద్రత కోసం భీమా కవరేజ్ తీసుకోవడం తప్పనిసరి చేశాయి. ఇది ఆ ఇంటి రుణం వరకే వస్తుంది. మిగిలిన దేనికి వర్తించదు. దీనితోపాటు ప్రతి వ్యక్తి టర్మ్ ఇ...

మల్లి

మల్లి  "ఏమ్మా మల్లి ఇంత ఆలస్యమైంది అని అడిగాడు పొలానికి క్యారేజీ తీసుకువచ్చిన తన కూతుర్ని రామారెడ్డి. "ఏం లేదు నాన్న నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాను . "నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చావా! దారిలో పాటలు పాడుకుంటూ వచ్చావా! అని అడిగాడు రామారెడ్డి. ఎందుకంటే ప్రతిరోజు రామారెడ్డికి ఇది మామూలే. రెండు మూడు సార్లు కూతురి ఇంకా రావటం లేదని ఎదురు వెళ్లేసరికి చెట్టు మీద ఉన్న కోయిలని ,పాకలో ఉన్న పశువుని పొలం గట్టు మీద ఉన్న చెట్లని, చేలో ఉన్న పంటని చూస్తూ ఏదో పాటలు పాడుకుంటూ అడుగులు అడుగు వేసుకుంటూ వస్తోంది మల్లి. "ఏమ్మా ఎప్పుడు ఆ పాట లేనా తొందరగా రా !ఆకలేస్తుంది అంటూ కేకలేసాడు రామారెడ్డి. చిన్నప్పటి నుంచి రేడియో పట్టుకుని వదలదు.ఎవరి ఇంటికి వెళ్ళని మల్లి ఈమధ్య తరచూ పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్లి ఏదో పాటల ప్రోగ్రాం చూడడం మొదలుపెట్టిందని రామారెడ్డికి భార్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.   "ఏంటో ఈ పిల్లకి అలవాటు ఎలా వచ్చిందో. చిన్నప్పటినుంచి ఊర్లో జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాల పందిళ్ళలోనూ శ్రీరామనవమికి శివరాత్రి జాతరలోనూ ఏదో భక్తి గీతాలు పాడుతూ ఉంటుంది.  "ఇవి ఎక్కడ నేర్చుకున్నావ్ అమ...

బాపనమ్మ

బాపనమ్మ      బాపనమ్మ అదేమీ అందమైన పేరు కాదు. ఒక సినీనటి పేరు అసలే కాదు. గ్రామ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న రాజకీయ నాయకురాలు కాదు. కానీ ఆ ఊరిలో ఈనాటికీ ఆ పేరు ప్రజలందరినోళ్ళల్లో నానుతూ ఉంటుంది. నాకు తెలుసు ఉన్నంతవరకు ఆమెకు అమ్మవారి పేరు పెట్టి ఉంటారు.  మా ఊరి బడినీ అంటే మేము రాజులు బడి అని పిలుచుకునే వాళ్ళం . ఆ బడిలో చదువుకున్న వారు బాపనమ్మ పేరు, ఆ రూపం మర్చిపోయిన విద్యార్థులు గాని గ్రామస్తులు కానీ ఎవరూ ఉండరు. మా ఊరు పాఠశాల ని రాజులు బడి అని ఎందుకంటారు అని అందరికీ సందేహం కలగొచ్చు. కారణం ఏమిటంటే మా పాఠశాలకి సొంత భవనం లేదు. ఆ గ్రామం అప్పట్లో అది కాకినాడ తాలూకా లోని పల్లిపాలెం ఒక కుగ్రామం. ఇప్పుడు కాజులూరు మండలంలోని ఒక అభివృద్ధి చెందిన గ్రామం.ఆ గ్రామానికి అప్పట్లో సరైన రోడ్లు కానీ పాఠశాల భవనం గాని లేదు. ఆ ఊరిలో క్షత్రియ వంశానికి చెందిన సుబ్బరాజు గారు మరియు నారాయణ రాజు గారు అని ఇద్దరు అన్నదమ్ముల వసతి గృహం వెరసి మా ఊరి విద్యార్థులకు సరస్వతి నిలయం అయ్యింది.  ఆ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఆ బడి వెనుక కాపురం ఉండేవారు. అప్పట్లో ఆ బడికి అద్దె ఉందో లేదో నాకు తెలియదు. ...