పోస్ట్‌లు

ఇదీ వ్యసనమే

ఇదీ వ్యసనమే  ప్రపంచంలో సమాజ సేవకి అనేక సంస్థలు ఉన్నాయి. సమాజానికి ఉచితంగా చేసే సేవ ని సోషల్ సర్వీస్ అంటారు.అలాగే సమాజానికి ఉచితంగా సమాచారాన్ని అందించే ఒక వేదికని సోషల్ మీడియా అంటారు. ప్రపంచంలో అత్యధిక ప్రజాభిమానాన్ని చూరగొన్న సోషల్ మీడియా ఫేస్బుక్. తెలుగులో ముఖ పుస్తకం అంటారు. ఈ పేస్ బుక్ లో మనకు ఓ పేజీ ఉంటుంది. మనతోపాటు మన బంధువులు స్నేహితులు ముక్కు మొఖం తెలియని దుబాయ్ శీను లు మనకు స్నేహితులైపోతారు. ఏదైనా మంచి చెడు పక్క వాళ్లకు షేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఫేస్బుక్లో పెట్టకుండా ఉండలేము. కొంతమంది చూసి స్పందిస్తారు. మరి కొంతమంది వదిలేస్తారు. వాళ్లు కొట్టే లైకులకి మన హృదయం లయ తప్పుతుంది. ఇదో మానసిక ఆనందం. తప్పేముంది. మన పుట్టినరోజు అడ్రస్సు పాస్పోర్ట్ సైజు ఫోటో తన కౌగిలిలో బంధించుకుని ప్రపంచానికి మన జాతకం చూపిస్తోంది. ఒకప్పుడు మత్తు పదార్థాలకు మందుకి యువత బానిస అయ్యేవారు. ఇప్పుడు కొత్తగా ఫేస్బుక్ ఆ లిస్టులో చేరింది. పూర్వకాలంలో వార్తల కోసం రేడియోలు వార్తాపత్రికలు మీద  ఆధారపడే వారు కాలం మారింది . సాంకేతికంగా ప్రపంచం అభివృద్ధి చెందింది. ఏదైనా సంఘటన జరిగిన క్షణకాలంలో ఫోటోలు తో ...

ఆ రోజుల్లో ఆదివారం

ఆ రోజుల్లో ఆదివారం ఆదివారం మిట్ట మధ్యాహ్నం అయిందంటే చాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి అతుక్కుపోయి మైమరిచిపోయి ఆ గళం లో గాథలన్నీ విని తమ బాధలన్నీ ఆ సమయంలో మరిచిపోయి అయ్యో అప్పుడే అయిపోయిందా అని నిట్టూర్చి వచ్చే ఆదివారం కోసం ఎదురుచూపులు చూసే అభిమానులు కోకొల్లలు ఆ గళానికి .ఆ గళంలో సుమధుర స్వరం ఉంది. అది నాదస్వరమై బుసలు కొట్టే వారిని కూడా బుద్ధిమంతులుగా చేసింది. యావత్ ప్రపంచాన్ని ఆ గళానికి అభిమానులుగా చేసింది. ఈ మాయా లోకంలో కొట్టుమిట్టాడుతున్న సమాజానికి ఏది మంచి ఏది చెడు చెప్పే ఆ స్వరం కొంతమందికి తమ అనుకరణ విద్యలో భాగంగా చేరిపోయింది. ఆయన ఇంటి పేరు పురాణపండ. పేరు సూర్య ప్రకాశ దీక్షితులు. నమ్ముకున్న సాహిత్యం చదువుకున్న సంస్కృతo వారసత్వంగా వచ్చిన పాండిత్యం, భగవంతుడిచ్చిన గళం ఆయనని తన వృత్తిలో సూర్యుడిలా ప్రకాశింపజేసింది. రామాయణ మహాభాగవత భారత గాధలను ప్రజలకు తనదైన శైలిలో వినిపించడం ఆయనకి ఒక దీక్ష .ఎప్పుడో త్రేతా యుగంలో జరిగిన రాముడి కథ ద్వాపర యుగంలో పుట్టిన ఆ నీ ల మేఘశ్యాముడు లీలలు , కౌ రవ పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం మన కళ్ళ ముందు జరుగుతున్నట్లుగా చెప్పడo ఆయన ప్రత్యేకత.  మ...

గోదావరి డెల్టా పితామహుడు

గోదావరి డెల్టా పితామహుడు. మహారాష్ట్రలోని నాసిక త్రయంబకం వద్ద పుట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను సస్యశ్యామలం చేసిన గోదావరి నదిని జీవనది అంటారు. జీవనది అంటే ఎల్లప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది.  అవి భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించే రోజులు . ఆర్థర్ కాటన్ అనే బ్రిటిష్ దొర వృత్తి రీత్యా ఇంజనీర్ ఇక్కడ పని చేస్తూ ఉండేవాడు. నిరంతరము ప్రవహిస్తూ ఒక పుణ్య నదిగా పేరు తెచ్చుకున్న గోదావరి నది జలాలు వృధాగా ఉండిపోవడం, అంతేకాకుండా ఆ ప్రాంతంలో తాగునీరు పంట నీరు సమస్యలు ఏర్పడడంతో ఇంజనీర్ దొరగారికి అద్భుతమైన ఆలోచన తట్టింది.  అలా గలగల పా రుతున్న గోదావరి తల్లికి అడ్డుకట్ట అంటే ఆనకట్ట కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆనకట్టవలన ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవ్వడమే కాకుండా తాగునీటి సమస్య కూడా తీరుతుందని ఆలోచించి అప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ధవలేశ్వరం వద్ద గోదావరి నది మీద ఆనకట్ట నిర్మాణం చేశాడు. ఎక్కడో పుట్టాడు పరాయి దేశంలో అద్భుతమైన కార్యానికి పునాది వేశాడు భారతదేశంలో.పరాయి దేశస్తుడు అయితే నేమి పది కాలాల పాటు నిలిచే పని. చేశాడు.ఆనకట్ట కార్యరూపంలో ,అనారోగ్యం పాలు అయినా లెక్క చేయకుండా ప్రజల...