సేవగా మారిన విషాదం
ఇది ఇప్పటి మాట కాదు. ఒకప్పటి చరిత్ర. ఒక పక్షి మరణం ఒక అద్భుత కావ్య రచనకి అవకాశం కల్పించింది. అన్నదమ్ముల పిల్లల మధ్య జరిగిన యుద్ధం భగవద్గీతకు ప్రేరణగా నిలిచింది. ఒక చారిత్రక కట్టడం నిర్మించడానికి వెనుక అనేక బలీయమైన కారణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది.. భార్య మీద ఉన్న ప్రేమతో ఒక నవాబు గారు తాజ్ మహల్ నిర్మించారు. అలాగే భాగ్యనగరంలో ఉన్న నాలుగు స్తంభాల కట్టడం వెనుక అనేక చారిత్రక కథలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా కాకినాడ మండలం పెనుమర్తి గ్రామంలో నిర్మించిన ఈ ఆసుపత్రి వెనుక ఒక విషాదకరమైన కథ ఉంది. మానవ శరీరంలో అతి ముఖ్యమైన భాగం కళ్ళు. కళ్ళు లేని జీవితం ఊహించలేం. ఆ చీకటి ప్రపంచంలో వారు పడే బాధలు వర్ణనాతీతం. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా ఉచితంగా కంటి చూపును ప్రసాదించాలనే ఆశయంతో కాకినాడ జిల్లా పెనుమర్తి గ్రామంలో కిరణ్ కంటే ఆసుపత్రి 1993 సంవత్సరంలో ప్రారంభించబడి రోగులకు సేవలు చేస్తూ దిన దిన ప్రవర్ధమానం అవుతూ వచ్చింది. ఈ ఆసుపత్రి అంధుల పాలిట ఒక వరం. ఈ ఆసుపత్రి ప్రారంభించడానికి వెనుక ఉన్న ఆశయం పరిశీలిస్తే చాలా బాధాకరంగా ఉంటుంది. జీవితంలో ఎవరికి ఇటువంటి సమస్య రా...