పోస్ట్‌లు

చేతి వ్రాత

" ఏవండీ ఆ గూట్లో ఉన్న డైరీలు దుమ్ము కొట్టుకు పోతున్నాయి. బయట పడేస్తాను. ప్రతిసారి దులుపుకోవడం కష్టంగా ఉంది అంది సుధాకర్ భార్య రమ్య ఇల్లు దులుపుతూ. " నేను వాటిని ప్రతి ఆదివారం చదువుకుంటున్నాను గా! ఎందుకు పడేయడం? నీకు అంత కష్టంగా ఉంటే నేను దుమ్ము దులుపుకుంటాను. నువ్వు అక్కడ వదిలేసేయ్ అన్నాడు కోపంగా సుధాకర్.  " ప్రతిసారి ఇదే మాట చెబుతున్నారు. ఒకసారి కూడా దులిపిన పాపాన పోలేదు అoది రమ్య. " సరేలే అలా వదిలేసేయ్. తర్వాత చూద్దాం అన్నాడు చిరాకుగా సుధాకర్ .రమ్య ఏమీ చేయలేక విసురుగా వంటింట్లోకి వెళ్లిపోయింది. " ఏమిటో రమ్య అర్థం చేసుకోదు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రాణప్రదంగా దాచుకున్న డైరీ లని పడేస్తాను అంటుంది ఏమిటి ? దాని విలువ తనకేం తెలుసు! కొన్ని కోట్లు ఖర్చుపెట్టిన అలాంటి వాటిని మళ్లీ తీసుకురాలేము సుధాకర్ అనుకుంటూ ఒకసారి గతంలోకి వెళ్లిపోయాడు.  రామయ్య రవణమ్మల ఏకైక పుత్రుడు సుధాకర్. రామయ్య ఒక చిన్న రైతు. రవణమ్మ అప్పటి రోజుల్లో ఎస్.ఎస్.ఎల్.సి పాసయ్యి టీచర్ గా పనిచేస్తూ ఉండేది . వాళ్ళిద్దరు కాపురం ఆ పల్లెటూర్లో ఒక మూడు గదులు ఉన్న పాడుబడిన బంగాళా పెంకుల కొంప.   లేక లేక పు...

ఒక సూర్యోదయం_ గోదావరి తీరం

ప్రతి ఉదయం ఒక కొత్త ఆశ. ఒక కొత్త ఊపిరి. కొత్త ఆశయాలు కొత్త కోరికలు, ప్రారంభమవుతాయి.అది ఏ కాలం అయినా సూర్యుడు తూర్పు కొండల పైనుంచి తళతళలాడుతూ ఉదయిస్తాడు. ఆరు నూరైనా తన డ్యూటీని మరిచిపోకుండా చేస్తాడు. అది మనం జీవితం మీద నమ్మకాన్ని నింపుకునే క్షణం. ఉదయిస్తున్న సూర్యుని అరుగు మీద కూర్చుని చూసిన చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఆ క్షణం గోదావరి తీరంలో ఎలా ఉంటుందో చెప్పడానికి పదాలు చాలవు. కనులు చూసే దృశ్యం, మనసు తేలికపడే అనుభూతి, శ్వాసలో పరిమళించే తడి నేల వాసన – ఇవన్నీ కలిసే గోదావరి ఒడ్డున ఒక సూర్యోదయం. " ఉదయిస్తున్న సూర్యుడు ఉల్లి పువ్వు ఛాయ అన్నట్టు ఉదయిస్తున్న సూర్యుడు లేలేత కిరణాలు గోదావరి నది నీటి మీద పడిన దృశ్యం చూడడానికి కన్నుల ముచ్చటగా ఉంటుంది. ప్రవహిస్తున్న గోదావరి నదితో పాటు కిరణాలు కూడా ప్రయాణం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ ఆనందం ,ఈ అనుభూతి కూడా మనం స్వయంగా చూస్తేనే తెలుస్తుంది.  సూర్యుడుతోపాటుగా నిద్ర లేచి పశువులను తోలుకుంటూ పొలం వెళ్లే రైతులు, సైకిల్ మీద లుంగీ పంచ కట్టుకుని నోట్లో చుట్ట పెట్టుకుని సైకిల్ కి పాల తప్పేలా తగిలించుకుని పొలం వెళ్లే పెద్ద రైతు గోదావరి గట్టుమీద ప్రత...

ఉన్న ఊరు

రాత్రంతా ఆలోచనలతో నిద్ర పట్టలేదు వెంకన్న మాస్టారికి పుట్టి పెరిగిన ఊరు .టీచర్ గా పనిచేసిన ఆ ఊరు కదలకుండా ఎంత దూరమైనా ఉద్యోగం చేసి సాయంకాలానికి ఇంటికి చేరే వారు. ఆ ఊరు అంటే ఆయనకు అంత ప్రేమ. తండ్రిగారి కట్టిన ఇల్లు అంటే ఎనలేని అభిమానం. ఇద్దరు మగ పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివించేడే తప్ప ఆ ఊరు వదిలి పోలేదు. ముప్పై సంవత్సరములు టీచర్ గా పనిచేసి రేపు పదవి విరమణ చేయబోతున్నాడు. ముందుగానే పిల్లలు ఇద్దరు చెప్పారు. రిటైర్మెంట్ అయిన వెంటనే నువ్వు అమ్మ మా దగ్గరకు వచ్చేయండి. మీకు వయసు మీరి పోతోంది. ఇక ఇక్కడ ఉండలేరు. ఇల్లు వాకిలి పొలం పుట్రా అన్ని అమ్మేసి వెళ్ళిపోదాం అంటూ పిల్లలు ఒకటే గోల.  ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. రేపు మాపో పిల్లలు వచ్చి మళ్ళీ పట్టుబడతారు. ఇంతవరకు ఎటు నిర్ణయం చెప్పలేదు. ఊరు వదిలి వెళ్ళిపోవడం ఎలాగా అలా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుని తెల్లవారి ఆలస్యంగా లేచాడు. తెల్లవారి లేచింది మొదలు యాంత్రికంగా పనులు చేస్తున్నాడు తప్ప ఆలోచనలు మళ్ళీ చుట్టుముట్టా యి. పొలం పొట్రా ఇల్లు అన్ని అమ్మేస్తాం అది పెద్ద పనేం కాదు. తట్టా బట్టా సర్దుకుని వెళ్ళిపోతాం. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ...