పోస్ట్‌లు

శ్రమజీవి

. ఆ శ్రమజీవి చెమట చిందించకపోతే మన రోజు గడవదు… ఈ వాక్యం కేవలం మాట కాదు—మన జీవన సత్యం. మనం ఉదయం నిద్రలేవగానే కనిపించే శుభ్రత, మనం తినే ఆహారం, మనం ప్రయాణించే వాహనం, మనం నివసించే ఇల్లు—ఇవన్నీ ఒక శ్రమజీవి చెమటతో నిర్మితమైనవే. మనం చూస్తున్న సౌకర్యం వెనుక, అతను చూడని కష్టాల చరిత్ర దాగి ఉంటుంది. శ్రమకు మనం ధర కడతాం. కానీ ఆ శ్రమ విలువను మాత్రం ఎప్పటికీ కొలవలేము. మనం ఇచ్చే జీతం అతని కష్టానికి ఒక చిన్న ప్రతిఫలం మాత్రమే. కానీ అతను వెచ్చించే శక్తి, అతను మోసే బాధ్యతలు, తన కుటుంబం కోసం చేసే త్యాగాలు—ఇవి అన్నీ కలిపితే అది ఒక అమూల్యమైన రుణంగా మారుతుంది. ఆ రుణం మనం డబ్బుతో తీర్చలేము… గౌరవంతో మాత్రమే కొంతైనా చెల్లించగలం. ఉదయం లేవగానే “అమ్మగారు…” అనే పిలుపు వినిపిస్తే, అది ఒక సాధారణ శబ్దం కాదు—ఒక నమ్మకం. ఒక శ్రమజీవి తన ఇంటి పనులు పక్కన పెట్టి, మన ఇంటిని శుభ్రంగా మార్చడానికి వస్తుంది. మనకు అది ఒక పని మాత్రమే అనిపించవచ్చు… కానీ ఆమెకు అది జీవనాధారం. ఆమె చెమటలో తన పిల్లల భవిష్యత్తు దాగి ఉంటుంది. తెల్లవారక ముందే సైకిల్ తొక్కుకుంటూ ఇంటింటికి తిరిగి సమయానికి పాల ప్యాకెట్లు అందించే వ్యక్తి, నెత్తిమీద తట్ట మోసుకుం...

ఆ ఊరు మాకు వరమే

విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే రత్నాచల్ ఎక్స్ప్రెస్ నెమ్మదిగా నడుస్తూ అన్నవరం స్టేషన్ లోకి వచ్చి ఆగింది. ప్రయాణికులంతా లగేజ్ చేత పట్టుకుని గబగబా దిగే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయాణికులను ఒకసారి చూస్తే కొత్తగా పెళ్లయిన జంట దగ్గర నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. అక్కడే సగం బండి ఖాళీ అయిపోయింది. స్టేషన్లో నిలబడి ఉన్న ప్రయాణికులను గమనిస్తే ఎక్కువ శాతం మంది నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకుని గుండు చేయించుకునీ తలకి గంధం పూత పూసుకున్న వాళ్ళు ఎక్కువగా కనబడ్డారు. అవును ఇది పుణ్యక్షేత్రం కదా ఇక్కడ ఎక్కువ స్వామివారి భక్తులే ఉంటారు. చెన్నై కలకత్తా రైలు మార్గంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు కనబడుతూ ఉంటాయి అలాంటి వాటిలో అన్నవరం ఒకటి  ఎప్పుడూ రెండు నిమిషాలకు మించి ఆగని రైలు బండి సిగ్నల్ ఇవ్వని కారణంగా స్టేషన్లో నిలిచిపోయింది. రైలు స్టేషన్ అంత ఒక్కసారి చూస్తే దూరంగా అనంత లక్ష్మీ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఫోటో దూరంగా కనబడుతోంది. ప్రతి ప్రయాణికుడు ఆ స్వామికి దండం పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.  ఆ రైలు మార్గంలో ప్రయాణం చేస్తుంటే దూరాన్నించి కొండమీద కనబడే స్వామికి నమస్కారము చేయని వాళ్ళ...

అక్క హృదయం

  నాన్న మంచం మీద ఉన్నప్పుడు చేతినిండా పని ఉండేది.ఎప్పుడు “ఒరేయ్ కృష్ణా” అని పిలుస్తూనే ఉండేవాడు. ఇప్పుడు ఏ పని లేకుండా ఉంది అని అనుకున్నాడు కృష్ణారావు, చనిపోయిన తన తండ్రి రామారావు గురించి. ఆఫీసుకు వెళ్లిన ఇంటి దగ్గర తండ్రి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు కృష్ణారావు. ఇప్పుడు సమయం గడవడం లేదు. ఆఫీసు నుండి వచ్చిన వెంటనే రామారావు పని చూడడం ఒక పెద్ద బాధ్యతగా ఉండేది. రామారావు మంచం మీద ఉన్నా ఎంతో ధైర్యంగా ఉండేవాడు. ఇంచుమించుగా భార్య పోయిన తర్వాత రామారావు మంచం పట్టేసాడు. తండ్రి గుమ్మం దాటిన తర్వాత ఇప్పుడు “ఒంటరి వాడిని” అనే ఫీలింగ్ వస్తోంది కృష్ణారావుకి. అప్పుడే పన్నెండు రోజులు గడిచిపోయాయి. బంధువులంతా కృష్ణారావుకు ధైర్యం చెప్పి ముందుకు సాగిపోయారు. బంధువులతో పాటు కృష్ణారావు అక్క కూడా బయలుదేరుతూ, “తమ్ముడు బాధపడకు, ఏ అవసరం వచ్చినా నేను ఉన్నాను అని గుర్తుపెట్టుకో!” అని చెప్పి ఏడుస్తూ తమ్ముడిని దగ్గరకు తీసుకుంది కృష్ణారావు అక్క సుమతి. “ఇంకో ముఖ్య విషయం… డాక్యుమెంట్లు రెడీ చేయించు. మాసికానికి వచ్చినప్పుడు సంతకం పెడతాను. నాకు కూడా వయసు మీరిపోతోంది, ఇది చాలా ముఖ్యం,” అని చెప్పి వెళ్ళిపోయింది సుమతి. ఇంకా...