శ్రీకాకుళం జిల్లా విహారయాత్ర

శ్రీకాకుళం జిల్లా విహారయాత్ర.

వేసవి సెలవులు ఇచ్చే సమయం ఆసన్నమైపోయింది. పిల్లలందరూ టూర్లు పెడదామని ఒకటే గొడవ పెడుతుంటారు. పెద్దలు కూడా ఏదో ఆటవిడుపు కోసం ఏదో ఒక ప్రదేశానికి వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. పిల్లల్ని తీసుకుని విదేశాలకు వెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాకాకుండా మన రాష్ట్రంలోనే(ఆంధ్రప్రదేశ్) చాలా చారిత్రక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, విహార స్థలాలు, సముద్ర తీర ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లా కూడా విహారయాత్రలకు అనుకూలమైనదే. ముందుగా మనం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని విహారయాత్ర స్థలాలు, పుణ్యక్షేత్రాలు, సముద్ర తీర ప్రాంతాలు గురించి తెలుసుకుందాం. 

శ్రీకాకుళం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ కి ఉత్తర ప్రాంతంలో ఉండే జిల్లా ప్రధాన కేంద్రం. ఒరిస్సా రాష్ట్రానికి సరిహద్దుగా ఉండే ఒక ప్రదేశం. ఈ జిల్లాలో నాగావళి వంశధార నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అద్భుతమైన ఆలయాలు, బౌద్ధ చరిత్ర , గ్రామీణ సంస్కృతి ఒకే చోట చూడాలంటే ఈ జిల్లాని మనం తప్పకుండా సందర్శించాలి.

శ్రీకాకుళం పట్టణం విశాఖపట్నం విమానాశ్రయానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి బస్సు రైలు సౌకర్యం ఉంది.

 ఏ ప్రాంతం నుంచైనా శ్రీకాకుళం పట్టణానికి చేరుకుని అక్కడ బస చేసి టాక్సీ ల మీద కానీ మరి ఏ ఇతర ప్రయాణ సాధనo మీద గాని మీ యాత్ర సుఖంగా చేయొచ్చు. శ్రీకాకుళం పట్టణంలో అన్ని వర్గాల వారికి ఉండడానికి అనువైన ధరలలో హోటల్స్ ,గెస్ట్ హౌస్ కూడా ఉన్నాయి. 

ముందుగా మనం శ్రీకాకుళం పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రత్యక్ష దైవo అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం తో మొదలుపెడదాం. ఇది అతి పురాతన మైన సూర్య దేవాలయం. ఇక్కడ స్వామివారికి సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేస్తుంటారు. రథసప్తమి ముఖ్యమైన పర్వదినం. అంతేకాకుండా సూర్యకిరణాలు స్వామి వారి మీద పడడం ఒక అత్యంత మహిమాన్వితమైన విషయం. 

ఆ తదుపరి చూడదగిన ముఖ్య ప్రదేశం శ్రీకూర్మం యాత్రా స్థలం. ఇది కూడా చాలా పురాతనమైన గుడి. చూడవలసిన శిల్పకళ చాలా ప్రశాంతమైన ప్రదేశం. ఇక్కడ శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో దర్శనమిస్తాడు. ఇట్లాంటి గుడి మరి ఎక్కడ లేదు. ఇక్కడ దేవస్థానం వారి గెస్ట్ హౌస్ కూడా ఉంది.

ఇంకా శ్రీకాకుళం జిల్లాలో మూడవ ఆకర్షణ కళింగపట్నం బీచ్. ఒకప్పుడు ఇది నౌకాయాన కేంద్రంగా ప్రముఖ ప్రసిద్ధిగా ఉండేది. ప్రస్తుతం సందర్శకులను ఆహ్లాదకరంగా ఉండే పరిసరాలతో ఆనందపరు స్తోంది. 

సూర్యాస్తమ సమయంలో తీసుకునే చిత్రాలు జీవితంలో మరిచిపోలేని అనుభూతులుగా ఉండిపోతాయి. ప్రైవేట్ యాజమాన్యంతో నడిచే బీచ్ వ్యూ గెస్ట్ హౌస్ ఉంది.  

శ్రీకాకుళం జిల్లాలో మరొక చూడదగిన పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం. ఇది వంశధార నది తీరాన శ్రీకాకుళం కి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ముఖలింగేశ్వర స్వామి , భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి అనే మూడు ప్రముఖ శివాలయాలు ఉన్నాయి. శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.

శ్రీకాకుళం జిల్లా విహార స్థలాల్లో మరొకటి బారువా బీచ్. ఈ బీచ్ విశాలమైన ఇసుక తిన్నెలు కొబ్బరి చెట్లతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని భారతదేశపు రెండవ గోవాగా పిలుస్తారు.

శ్రీకాకుళం నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న  శా లి హుండం అనే బౌద్ధ క్షేత్రం చూడదగిన ప్రదేశాల్లో ఒకటి. కొన్ని శిధిలమైనప్పటికీ చూడవలసిన ప్రదేశం. వంశధార నదిని కూడా పలకరించి పార్వతిపురం మన్యం జిల్లా అని చూసి వద్దాం.



శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మరి ఇతర సమాచారం కోసం గైడ్లు సహాయం తీసుకోవాల్సిన వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక అధికారి శ్రీకాకుళం జిల్లా వారిని సంప్రదించి తగిన సహాయం పొందగలరు. 

శ్రీ రాజశేఖర్ పర్యాటక గైడ్ శ్రీకాకుళం జిల్లా 
సెల్ నెంబర్ 7799006648

కామెంట్‌లు

  1. మీరు శ్రీ ముఖలింగం, రావివలస శివాలయం, బారువా beach మర్చిపోయారు ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి .... సీతంపేట అరణ్యం చూడటానికి పిల్లలు ఆట విడుపు కోసం చాలా బాగుంటుంది ... మందస నుండి eastern ghats వెళ్లడం మరచినట్టు ఉన్నారు. తూర్పు కానుములలో ఎత్తైన పర్వతాలు అక్కడ మహేంద్రగిరి ఉదయం సూర్యోదయం చాలా అద్భుతంగా ఉంటుంది కానీ అది అటవీ ప్రాంతం కాబట్టి అటవీశాఖ వారు మనకి వెళ్ళనివ్వరు. శివరాత్రి రోజు మాత్రమే మనం మహేంద్రగిరి అందాలు ఆస్వాదించగలం

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట