మదిని దోచిన బొమ్మ
నల్లటి శరీరం, కమలాల వంటి కళ్ళు. ఆ కళ్ళల్లో కృపారసం. చేతిలో వేణువు, తల మీద పరిసర్పిత పింఛం. ఎప్పుడూ నవ్వుతూ విరాజిల్లే మొహం. ఇది పోతన గారి శ్రీకృష్ణుడి వర్ణన. ఆ వర్ణన చదువుతుంటేనే మన మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడిని మనం చూడలేకపోయినా వెన్నదొంగగా, రాధాకృష్ణుడిగా, అల్లరి కృష్ణుడిగా చిత్రపటంలో చూసినప్పుడు మనసు పదేపదే ఆ ముగ్ధమోహన రూపాన్ని చూడాలని అనిపిస్తుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మతో సమకాలీకులుగా పెరిగిన ఆ యాదవులు ఎంతటి అదృష్టవంతులో అనిపిస్తుంది. నిజమే, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మతో స్నేహితులుగా మెలిగిన యాదవులు చాలా ధన్యాత్ములు. అంటే భగవంతుని పక్కనే ఉండి తమ స్నేహితుడే భగవంతుడు అని తెలియని వాళ్లు. అంత అందమైన పరమాత్మను చూడడానికి ఆ కాలంలో ప్రజలు వీధుల్లో బారులు తీరి ఉండేవారట. మనం ఈ కాలంలో అందమైన శ్రీకృష్ణుడి చిత్రపటం కానీ, బొమ్మ కానీ రోడ్డుమీద కనబడితే ఒకసారి అటు చూడకుండా ఉండలేము. చెరసాలలో పుట్టిన శ్రీకృష్ణ పరమాత్మ, సంకెళ్లతో మన మనసును బంధించి ఆ బొమ్మని ఎంత ఖరీదైనదైనా కొని మన ఇంటికి తీసుకువెళ్లేలా చేస్తాడు. అది శ్రీకృష్ణ పరమాత్మ సమ్మోహనాస్త్రం. ఒక్కడే కాదు, పదహారు వేల...