పోస్ట్‌లు

అచ్చులు

అ అ నుంచి పుట్టిన పదం అమ్మ, అమ్మలేని మన జీవితం బొమ్మ॥ (అమ్మ అంటే ప్రేమకు రూపం, జీవానికి ఆరంభం) ఆ ఆ నుంచి వెలసినది ఆనందం, ఆనందమంటే మన జీవన ప్రాణం॥ (ఆనందం అంటే మనసుకు ఊపిరి, జీవితం తీపి) ఇ ఇ నుంచి వెలసినది ఇల్లు, కష్టాలు–సుఖాలు పంచుకునే నిలయం॥ (ఇల్లు అంటే గోడలు కాదు, హృదయాల గూటి) ఈ ఈ నుంచి పలికె ఈశ్వరుడు, ఆయన లేని జీవితం వెలితి॥ (దైవం అంటే మనసుకు ఆశ్రయం, ఆత్మకు శాంతి) ఉ ఉ నుంచి ఊగె ఉయ్యాల, చిన్ననాటి కలల లాలిపాట॥ (బాల్యం అంటే అమాయకపు పరిమళం) ఊ ఊ నుంచి పుట్టె ఊరు, జ్ఞాపకాల తోట, మూలాల నిలయం॥ (ఊరు అంటే మూలాలు, మమకారం, మట్టి వాసన) ఋ ఋ నుంచి వెలసె ఋషులు, వారి జ్ఞానం లేక మార్గం లేదు॥ (ఋషులు అంటే సత్యాన్వేషణకు దీపస్తంభాలు) ఎ ఎ నుంచి మెరిసె ఎదురుచూపు, ఆశలే మనిషి ప్రాణశక్తి॥ (ఆశ లేకపోతే అడుగు ముందుకే వేయలేం) ఒ ఓ ఓ నుంచి మ్రోగె ఓంకారం, ప్రాణమంతా నింపే నాదం॥ (ఓంకారం అంటే సృష్టి, స్థితి, లయమనే త్రిస్వరూపం) ఔ ఔ నుంచి వెలసె ఔదార్యం, దానం లేనిది జీవితం వెలితి॥ (ఔదార్యం అంటే పంచుకోవడమే పరమధర్మము

రాజమహేంద్రవరం_ గోదావరి తీరాన శ్వాసించే చరిత్ర

గోదావరి తీరాన విరాజిల్లే రాజమహేంద్రవరం ఒక పట్టణం కాదు, అది పౌరాణిక ప్రాణం. ఎన్నిసార్లు పేర్లు మారినా, చరిత్ర తన మూలాలను చెరపనీయలేదు. రాజరాజ నరేంద్రుని రాజధాని అన్న గౌరవం ఈ నేలకే లభించింది. ప్రతీ వీధి వెనుక ఒక వ్యక్తిత్వం, ప్రతీ చెరువు వెనుక ఒక జ్ఞాపకం, ప్రతీ గుట్ట వెనుక ఒక పురాణం నిద్రిస్తున్నాయి. ఆంధ్ర మహాభారతo పుట్టిన ప్రదేశం.. ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి నడయాడిన ప్రదేశం . ఎంతోమంది దేశభక్తులు కళాకారులు పండితులు నివసించిన పుణ్యభూమిది. ఈ నగరం కేవలం ఇటుకలతో కట్టబడిన వీధుల సమాహారం కాదు. ఇది కవుల కలల సౌధం, సంఘసంస్కర్తల పోరాటాల వేదిక, కళాకారుల ప్రేరణ స్థలం.   ప్రతిరోజు కొన్ని వందల మంది ప్రయాణికులను ఇక్కడ నుంచి వారి గమ్యస్థానాలకు చేర్చే బస్సులు ఆగే స్థలం . అది ఒక పుణ్యక్షేత్రం పేరు పెట్టుకుంది. అదేనండి కోటిపల్లి బస్టాండ్. కానీ దాని వెనక చరిత్ర ఎంతో ఉంది . బిపిన్ చంద్రపాల్, మహాత్మా గాంధీ ఈ ప్రదేశంలో పర్యటించి ఉపన్యాసాలు ఇచ్చారట.   బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఈ ప్రాంతం వారికి స్థావరంగా ఉండేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్లిపోయ...

శమంతక మణి

 శమంతక మణి  పూర్వకాలంలో సత్రాజిత్తు , ప్రసేనుడు అనే ఇద్దరు యదు వంశ రాజులు ఉండేవారు. సత్త్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు . అయితే ఈ సత్రాజిత్తు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు భక్తుడు. ఈ సూర్య భగవానుడు ఎల్లప్పుడూ మెడలో శమంతకమణిని ధరించి ఉండేవాడు. ఈ శమంతకమణి కెంపు రంగులో ఉండేది. ఈ శమంతకమణి ఎక్కడ ఉంటే అక్కడ కరువు కాటకాలు లేకుండా దేశం సుభిక్షంగా ఉంటుందట. అయితే ఈ సూర్య భగవానుడు సత్రాజిత్తు కోరిక మేరకు తన మెడలోని శమంతకమణిని ఇచ్చి వేస్తాడు.  ఆ మణిని ధరించి సత్రాజిత్తు ద్వారకా నగరానికి వస్తుంటాడు. అలా వస్తున్న సత్రాజిత్తుని చూసి సూర్యుడు వస్తున్నాడని భ్రమించి ద్వారకవాసులు పరమాత్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి విషయం విన్నవిస్తారు. అది విన్న శ్రీకృష్ణ పరమాత్మ దివ్యదృష్టితో చూసి వస్తున్నవాడు పంచముఖ బ్రహ్మ కానీ, సూర్యదేవుడు కాదని చెబుతాడు.  ఆ తర్వాత సత్రాజిత్తు బ్రాహ్మణుల వేదమంత్రాలు చదువుతుండగా ఆ శమంతకమణిని తన పూజ మందిరంలో ఉంచుతాడు. అది సామాన్యమైన వస్తువు కాదు. ఒక రోజుకి ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఆ శమంతకమణిని యాదవుల రాజైన ఉగ్రసేన మహారాజ...