పోస్ట్‌లు

సాంబయ్య

శివరాత్రి పండుగ శివ శివ అంటూ గజగజ వణికించే చలిని కూడా తీసుకుని వెళ్లిపోయింది. ఒక్కసారిగా భానుడు తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు. మనిషి నిలువునా నిలబడితే మునిగిపోయేంత లోతుగా ఉండి ఎప్పుడూ నీళ్లతో ఉండే ఆ ఊరికి ఈ ఊరికి మధ్య ఉండే పెద్ద కాలువకి నీళ్లు ఇవ్వడం ఆపేసారు గవర్నమెంట్ వారు. ఈ పెద్ద కాలువ తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని ఆర్థర్ కాటన్ బ్యారేజీ ముద్దుబిడ్డ. పంటల కాలం అయిపోయింది కదా. ఇప్పుడు ఆ కాలువ నీటితో పనిలేదు. సాధారణంగా గవర్నమెంట్ వారు ఈ వేసవికాలంలో కాలువలకు నీరు ఆపేసి మరమ్మత్తులు చేస్తారు. మామూలుగా పంటల కాలంలో ఆ పచ్చటి పొలాలకు ఇరవై నాలుగు గంటలు నీళ్లు సరఫరా చేసే ఆ పెద్ద కాలువ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకాలోని ఒక కుగ్రామం వెళ్ళాలంటే ఆ పెద్ద కాలువ దాటవాల్సిందే. ఆ పెద్ద కాలువ ఆ పక్క ఈ పక్క పెద్ద గట్లు ఉండి, ఆ గట్లు వెంబడి రకరకాల పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. కాలువ దాటాలంటే చెక్కలతో తయారుచేసిన ఒక బల్లకట్టు ఆధారం. ఆ బల్లకట్టు నడుపుతూ సాంబయ్య కుటుంబం తరతరాల నుంచి అదే వృత్తిలో జీవిస్తూ ఉండేవారు. సాధారణంగా ఉదయం ఐదు గంటల నుంచి చీకటి పడే వరకు ఆ బల్లకట్టును నడిపే సాంబయ్య, అర్ధరాత్రి అ...

అమ్మమ్మ గారి ఇల్లు

“రేపటి నుంచి నా కాలేజీకి సెలవులు!” అని ఉత్సాహంగా చెప్పాడు కిరణ్. “రేపు నేను అమ్మమ్మగారి ఊరికి వెళ్లిపోతున్నా” అనగానే, కిరణ్ మాటలు విని నవ్విపోయింది తల్లి సంధ్య. “కాలేజీకి సెలవిస్తే ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండవు. అమ్మమ్మగారి ఊరు వెళ్తా అనావు. అక్కడ ఏముంది రా? నాకంటే నీకు అమ్మమ్మ ఎక్కువా?” అని అంది సంధ్య. “అవును అమ్మ! అమ్మమ్మ… కావాల్సినవన్నీ చేసిపెడుతుంది. ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమగా మాట్లాడుతుంది. ఆప్యాయంగా దగ్గర తీసుకుంటుంది. ఆ ఇల్లు చూస్తే స్వర్గంలా ఉంటుంది…” అని అమ్మమ్మ–తాతయ్యల గురించి చెప్పుకుంటూ ఆ రాత్రే నిద్రపోయాడు కిరణ్. --- మరుసటి ఉదయం మొదటి బస్సులోనే కిరణ్‌ని రావులపాలెం దగ్గర ఉన్న వాడపల్లిలోని అమ్మమ్మగారి ఇంటికి పంపించాడు తండ్రి రామారావు. సంధ్య తండ్రి పరంధామయ్య ఇంకా ఆ ఊరిలోనే ఉంటాడు. వృద్ధాప్యం వచ్చినా చిన్నపాటి వ్యవసాయం కౌలుకి ఇచ్చి రోజులు గడుపుతుంటాడు. పరంధామయ్యకి నలుగురు ఆడ పిల్లలు. మూడు అమ్మాయిలు హైదరాబాదులో ఉంటే, చిన్న కూతురు సంధ్య మాత్రం తునిలో ఉంది. సంధ్య భర్త రామారావు హంసవరం హైస్కూల్ హెడ్మాస్టర్. వారికి కిరణ్ ఒక్కరే కొడుకు. ఇంటి ముందు ఆగిన ఆటోలోంచి దిగిన కిరణ్‌ను...

ఆధునిక పురుషుడు

ఒకప్పుడు ఆ కుటుంబ సామ్రాజ్యానికి ఆయనే రారాజు. ఆయన మాట రాజ శాసనం. కాలు మీద కాలేసుకుని కుర్చీలో కూర్చుని ఆజ్ఞలు జారీ చేస్తే పాటించే భార్యామణి భయభక్తులతో మెలిగే పిల్లలు, యజమానిగా గౌరవం ఇచ్చే దాస దాసి జనం, సమాజంలో పురుషుడిగా ఒక గౌరవం ఉండేవి.  పురుషుడు అంటే ఒక చైతన్యం. కుటుంబానికి పునాది. కనిపించని ఒత్తిడి, దాచుకున్న కన్నీరు, చెప్పని బాధ, మౌనమైన ప్రేమ పురుషుడి లక్షణాలు. ఇరవై ఒకటో శతాబ్దం సమాజాన్ని మాత్రమే మార్చలేదు— పురుషుడి స్వరూపాన్ని కూడా లోతుగా మార్చింది. ఇప్పటి పురుషుడు గత శతాబ్దపు నిర్వచనానికి పూర్తిగా భిన్నం.ఇంతకుముందు బలం, బాధ్యత, సంపాదన, ఆధిపత్యం—ఇవి పురుషుడి ప్రధాన గుర్తింపులు. కానీ ఆధునిక సమాజం పురుషుని పాత్రను మరింత విభిన్నంగా, మరింత మానవీయంగా చూస్తోంది. ఇప్పుడు ఆయన పాత్ర కేవలం సంపాదనకే పరిమితం కాదు; అతను ఒక భార్య యొక్క సహచరి, పిల్లలకి స్నేహితుడు, తల్లిదండ్రులకు మద్దతు, సమాజానికి మార్గదర్శి, తనకు తానే మానసికంగా నిలబడే మనిషి. మునుపటి కాలంలో పురుషుని విలువ అతని ఆదాయం. ఇంటి మొత్తం బరువు అతని భుజాలపై. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది: పురుషుడు ఎంత సంపాదిస్తున్నాడన్న దానికంటే అ...