పోస్ట్‌లు

జానకమ్మ

ఇల్లంతా పెళ్లి సందడితో హడావుడిగా ఉంది. పందిట్లో సన్నాయి మోగుతోంది. పెరడంతా పందిళ్లతో, పందిళ్లు తోరణాలతో మెరిసిపోతున్నాయి. బంధువులు ఒక్కొక్కరు రావడం మొదలైంది. వచ్చిన బంధువుల్ని, స్నేహితుల్ని ఒక నలభై ఐదు ఏళ్ల స్త్రీ, “రండి… రండి…” అని ఆప్యాయంగా పలకరిస్తూ టిఫిన్ టేబుళ్ల ముందు కూర్చోబెట్టింది. వడ్డన ప్రారంభమైంది. “ఇదిగో ఇంకొక ఇడ్లీ వేసుకోండి… మరో వడ వేసుకోండి… మా ఇందుపల్లి వాళ్ల వంటలు చాలా బాగుంటాయి…” అంటూ కొసరి కొసరి వడ్డిస్తూ హడావుడిగా అటూ ఇటూ తిరుగుతోంది. ఇంతలో ఎవరో, “బీరువా తాళాలు ఎక్కడ పెట్టావ్, జానకమ్మ?” అని గట్టిగా అరిస్తుంటే,“ఇదిగో… మీరు పారేస్తారని నేను పట్టుకుని తిరుగుతున్నాను,” అంటూ తాళాలు అందించి మళ్లీ టేబుల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అందరూ టిఫిన్లు పూర్తి చేయడంతో,“టిఫిన్లు పూర్తయ్యాయి… కాఫీలు ఇవ్వండి,” అంటూ వంట బ్రాహ్మణులకు ఆజ్ఞలు జారీ చేసింది.కాఫీలు తాగిన తర్వాత, “ఎదురింటి కరణం గారింట్లో మీ అందరికీ బస ఏర్పాటు చేశాం. అక్కడికి వెళ్దాం, పదండి. మీ సామానంతా మా వాళ్లు తీసుకువస్తారు,” అంటూ ముందుకు దారి తీసింది. అప్పటికే అక్కడ హాలంతా పరుపులు పరిచి ఉన్నాయి. హాలులో ఒక మూల పెద్ద...

పేరు

వాడు ఎవరు? సమాధానం ఏం చెబుతాము? వాళ్ల అమ్మా నాన్నల పేరు చెప్పి “వాళ్ల కొడుకు” అంటాము. అక్క పేరు చెప్పి “దాని తమ్ముడు” అంటాము. నిన్న మొన్నటి వరకు అమ్మ కడుపులో విహారం చేసి భూమ్మీదకి వచ్చి మూడు నెలలు అయింది. ఇవాళ్టి నుంచి వాడికో పేరు ఉంది. నిన్నటి వరకు ఏదో నోటికి వచ్చిన ముద్దుపేరుతో వాడిని పిలిచేవాళ్లం. ఇప్పుడు ఆ బాధ లేదు. పేరు పెట్టుకున్నాడు కాబట్టి సర్కారు వారు గుర్తింపు పత్రం కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ముద్దు పేరుతో పిలిస్తే వాళ్ల అమ్మ ఊరుకోదు. ఎంతో కష్టపడి వాళ్ల అమ్మానాన్న ఈ పేరు నిర్ణయించారు. పేరు నిర్ణయించడానికి ఎన్నో ఆలోచించాలి. ఆకాశంలో మెరిసే తారలను, గతించిపోయిన తరాలను కలుపుకోవాలి. ఇలవేల్పులను, ఇష్టదైవాలను మర్చిపోకూడదు. చివరలో ఎవరు పెట్టని పేరు ఉండాలి. అవి కదా నిబంధనలు! ఈ నిబంధనల చట్రంలో గిరగిరా ఎన్నో రాత్రులు తిరిగి అలసిపోయి, ఒక పేరుకు ఓట్లు వేసి, ఆ పేరు మనసులో మననం చేసుకుంటూ ఆ శుభముహూర్తం కోసం ఎదురు చూశారు వాడి తల్లిదండ్రులు. పేపర్ ఎక్కడా లీక్ అవ్వలేదు. అంత పగడ్బందీగా పబ్లిక్ పరీక్షల్లాగా ఏర్పాట్లు చేసుకున్నారు. అవును, పేపర్ లీక్ అయితే మజా ఏముంటుంది! పెళ్లి చూపుల్లో...

సూత్రధారి

నీ లీలారంగంలో పాత్రనై పుట్టాను, నీ కరుణాకటాక్షంలో శరణాగతినై నిలిచాను, నీ పాదపద్మాల చెంత విశ్రాంతినై లీనమయ్యాను. నేను నీ సంకల్పసూత్రాలకు కట్టుబడిన కీలుబొమ్మను; తెరపై తెల్లవారుజామునే నాట్యం ఆరంభింపజేసేది నీవే, తెరదించి నాటకసమాప్తి ఘడియను నిర్ణయించేది నువ్వే. తెరపై నటనకు “మహానటుడు” అనే మహిమాబిరుదులు నీవే ప్రసాదిస్తావు, ఆ బిరుదుల మత్తులో నేను ఉప్పొంగి ఉరకలేస్తాను; పాత్రపరిసమాప్తి వేళ మెడలో పూలహారాలు వేయిస్తావు, ఆ హారాల పరిమళంలో కూడా నీ చిత్తమే దాగి ఉంటుంది. నేను క్షణిక పాత్రధారిని — నీవు శాశ్వత సూత్రధారివి నేను నటనలో నిమగ్నుడను  నీవు లీలలో పరిపూర్ణుడవు. నా ఆరంభం నీ సంకల్పం, నా ముగింపు నీ మౌనం. నటించిన ప్రతి క్షణమూ నీకర్పణం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279