పోస్ట్‌లు

మరో తిరుపతి

తిరుపతి అనగానే ముందు మనకు గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లాలోని పెద్ద తిరుపతి. అది కాదంటే ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల గుర్తుకొస్తుంది. ఒకటి పెద్ద తిరుపతి, రెండోది చిన్న తిరుపతి. పెద్ద తిరుపతిలో వెలిసిన స్వామిని దర్శించాలంటే ఏడుకొండలు ఎక్కవలసిందే. ద్వారకుడు అనే భక్తుడి కోరిక మేరకు స్వామి చిన్న తిరుపతిలో కొలువై ఉన్నాడు. ఏడుకొండలు ఎక్కలేని వారు చిన్న తిరుపతిలో స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.  సప్తగిరులు ఎక్కినా, ద్వారకా తిరుమల స్వామిని దర్శించినా, "గోవిందా!" అని పిలిస్తే స్వామి భక్తుల మొర ఆలకిస్తూ ఉంటాడు. అంత మహిమ గలవి ఈ రెండు పుణ్యక్షేత్రాలు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం చదలవాడ గ్రామంలో మరో తిరుపతి కూడా ఉంది. ఇక్కడ శ్రీ శృంగార వల్లభ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయం సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లు అక్కడి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అందుకేనేమో ఈ ప్రాంతాన్ని "తొలి తిరుపతి" అని అందరూ పిలుస్తారు. ప్రతి పుణ్యక్షేత్రం వెనుక ఒక చారిత్రక కథ ఉంటుంది. అది కథగా మనం...

రామ నామంలో నిలిచిన మహావీరుడు

ఆంజనేయస్వామి సర్వమానవ ఆరాధ్య దైవం. రామ బంటుగా రామ భక్తుడిగా, అసాధ్యకార్యసాధకుడుగా, రాక్షస సంహారిగా మన మనసులో నిలిచిపోయిన దైవం.  భారతదేశంలో ఏ గ్రామం చూసిన ఏ రహదారి చూసిన స్వామి విగ్రహం లేని చోటు ఉండదు. దేవాలయంలో ఆంజనేయ స్వామిని చూసిన రహదారి పక్కనున్న విగ్రహాలు చూసిన ఒక రకమైన ఉత్తేజం ధైర్యం కలుగుతుంది. బహుశా ఆయన రూపం చూసి భయం తొలుగుతుంది. విశాలమైన వక్షస్థలం పొడవైన కాళ్లు చేతులు చేతిలో గధ వానర ముఖం వానరులకుండే ప్రత్యేకమైన అవయవం తోక కలిగి ఉంటారు స్వామి.  మానవ రూపంలో ఉండే ఈ దేవుడుకి వానర ముఖం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న అందరికీ కలుగు తుంది. ఆంజనేయ స్వామి తల్లి అంజనీ దేవి. ఆమె వానర వనిత. ఆంజనేయ స్వామి తల్లి అంజనీదేవి పూర్వ జన్మలో ఒక అప్సరస శాపం కారణంగా వానర కన్యగా పుడుతుంది. ఆమెకు కేసరితో వివాహం జరుగుతుంది. చాలా కాలo వరకు సంతానం కలగపోవడంతో శివుడుని పూజించి శివుడు లాంటి కొడుకు కావాలని కోరుకుంటుంది.   శివుడి యొక్క తేజమును వాయుదేవుడు పండు రూపంలో అంజనీ దేవికి ఇవ్వగా ఆ పండు తిన్న అంజనీ దేవికి ఆంజనేయ స్వామి జన్మిస్తాడు. అంజనీ దేవి పుత్రుడు కాబట్టి ఆంజనేయుడు అయ్యాడు. శివ...

దివాన్ బుచ్చిరాజు

రాత్రి పది గంటలయింది. మండువేసవి కాలం. గోడ గడియారం శబ్దం తప్పితే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అందులో ఉండే వ్యక్తులు ఒకరు తప్ప అంతా నిద్రలో మునిగిపోయి ఉన్నారు. వీధిలో ఎటు చూసినా చిమ్మచీకటి. లాంతరు వెలుగు తప్ప ఇంకేమీ కనపడటం లేదు. కాపలాదారులు అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు. ఏ మూల నుంచి ఎవరు దాడి చేస్తారో అనే భయంతో చాలా జాగ్రత్తగా అటూ ఇటూ చూస్తూ, కళ్లకు మూతలు పడకుండా విశ్వప్రయత్నం చేసుకుంటూ తమ విధి నిర్వహణలో మునిగిపోయారు. అవును… అది మామూలు వ్యక్తి ఇల్లు కాదు. రాజుగారి తర్వాత రాజుగారంతటి గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిన ఒక సంస్థానంలోని దివాన్ గారి ఇల్లు. “దివాన్” అంటే ఈ రోజుల్లో మన ఇళ్లలో వాడే మంచం ఆకారంలో ఉండే వస్తువు గుర్తుకొస్తుంది. కానీ ఆ రోజుల్లో రాజ్యాలలో, సంస్థానాలలో “దివాన్” అనేది ఒక పదవి పేరు. రాజుగారి తర్వాత రాజుగారంతటి వాడు దివాన్. ప్రధానమంత్రి లాంటివాడు అన్నమాట. రాజ్య పరిపాలనంతా ఆయన చేతిమీద నడిచేది. రాజు చెప్పిన ఆజ్ఞలను అమలు చేయడమే దివాన్ గారి పని. చాలా అధికారాలు ఉన్నప్పటికీ, ప్రతి విషయంలో రాజుగారి అనుమతి తీసుకోవాలి. నివసించడానికి మంచి ఇల్లు, ఇంటినిండా పనివాళ్లు, వీధిలో కాపలాదారులు, ఒక గుర్రప...