పోస్ట్‌లు

మే, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

అది నాకు ఇష్టం లేదు

"అమ్మా ! ఆకలేస్తుంది అన్నం పెట్టవే! అని అడుగుతున్న పదేళ్ల కొడుకు రాఘవని ఉండరా ఇంకా నాలుగు పేపర్లే ఉన్నాయి అవి కూడా దిద్దేసి పెడతాను. ఒక పని అయిపోతుంది. లేదంటే పేపర్లో దిద్దాలంటే బద్ధకం వస్తోంది రా! నీకు ఆకలి కాదురా! వెధవా!సెలవులు కదా ఏమి తోచట్లేదు అనుకుంటాను. టిఫిన్ తిని రెండు గంటలు కూడా అవలేదు అoటు కొడుకుకి సమాధానం ఇచ్చి తెలుగు పేపర్ లో దిద్దడంలో మునిగిపోయింది ప్రత్యూష. ప్రత్యూష ఆ ఊరిలో పేరు మోసిన కాన్వెంట్లో తెలుగు టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. అది అసలే ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్. ఇంకేముంది తెలుగు పేపర్ దిద్దడం అంటే చాలా ఈజీ. కారణం ఏంటంటే తెలుగు అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి చాలా కష్టమైన సబ్జెక్టు అంటారు.  అందుకని తప్పులు ఎక్కువగా రాస్తారు. పిల్లలు కూడా ఏదో పాస్ మార్కుల కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలుగు నేర్చుకోవాలని ఉత్సాహం ఎవరికీ ఉండట్లేదు. చిన్నప్పటినుంచి వర్ణమాల బదులు ఆంగ్ల అక్షరాలు తో ప్రాథమిక విద్య ప్రారంభం అయింది కాబట్టి తెలుగు సబ్జెక్ట్ అంటే చాలా భయం పిల్లలకి ఈ రోజుల్లో.  ఇప్పటికి సుమారుగా నలభై పేపర్లు పైగానే దిద్దింది ప్రత్యూష. అందులో అందరూ ఒక వ్యాసం రాసిన వ...

జరిగిన కథ

మధ్యాహ్నం రెండు గంటలు అయింది  అదొక ప్రభుత్వ ఆఫీసు కార్యాలయం లంచ్ రూమ్ అంత హడావుడిగా ఉంది. లంచ్ చేసే సమయమే ఆటవిడుపు సమయం. ఆ అరగంటసేపు ఆ ఉద్యోగస్తులు అందరూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. రోజు ఏవో ఓ టాపిక్ లు. అది కాలేజీలు స్కూళ్లు తెరిచిన సమయం. ఇంకేముంది చదువులు గురించి అడ్మిషన్ గురించి మొదలైంది కబుర్లపర్వం. " మీ వాడు ఎందులో జాయిన్ అయ్యాడు? అని అడిగాడు ప్రభాకర్ తను స్నేహితుడు కుమార్ ని. మావాడు బీకాంలో జాయిన్ అయ్యాడు రా! అన్నాడు కుమార్. బీకాం ఏమిటిరా! ఇంటర్మీడియట్ లో సైన్స్ గ్రూప్ తీసుకుని అన్నాడు ప్రభాకర్.  ఒక్కసారి కుమార్ మనసుకి బాధగా అనిపించింది. ఈ రోజుల్లో బీకాంలు , బిఏలు ఎవరు చదువుతున్నారు రా! అన్నట్టు అనిపించింది.  మా వాడు బీటెక్ లో జాయిన్ అయ్యాడు అన్నాడు గొప్పగా ప్రభాకర్. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చాలా బాగుందిరా! నాలుగో సంవత్సరంలో ఉండగానే జాబ్ వచ్చేస్తుంది అంటూ ఆ కాలేజీ గురించి చదువు గురించి ఒక పావు గంట సేపు చెప్పాడు.  కుమార్ , ప్రభాకర్ ఇద్దరు ఒక ప్రభుత్వ కార్యాలయంలో కలిసి పని చేస్తూ ఉంటారు. విచిత్రంగా వాళ్ళిద్దరి పిల్లలు కుమార్ కొడుకు ప్రవీణ్ ప్రభాకర్ కొడుకు ప్...

కోరంగి మడ అడవులు

కోరంగి అభయారణ్యo. పూర్వకాలం నుండి మానవుడు తన ఆహారం కోసం, వినోదం కోసం జంతువులను వేటాడి చంపడం అనేది ఉందని మనకు తెలుసు. పైగా అడవులలో స్వేచ్ఛగా జరిగే జంతువులకు అప్పట్లో రక్షణ లేదు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు జంతువులను వేటాడి చంపే వాళ్ళు. ఈ జంతువుల వేట అనేది రకరకాలు గా ఉంటుంది.  ఆహారపు వేట, క్రీడా వేట, వాణిజ్యపు వేట. ఆహారపు వేట అంటే తెలుసు, తమ వినోదం కోసం జంతువులను చంపడం క్రీడా వేట, జంతువుల చర్మం దంతాలు మొదలు వాటిని తమ వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం వాణిజ్యపు వేట. ఇలా ఎవరు మటుకు వాళ్ళు అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే జంతువులు వేటాడుతూ పోతుంటే చాలా జంతువుల రకాలు మనకి కనుమరుగైపోయేయి.  వన్యప్రాణులను సంరక్షించాలని ఉద్దేశంతో ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 లో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం జంతువులు వేట నిషేధించబడింది. అందులో భాగంగానే అభయారణ్యాలు ఏర్పాటు చేయడం జరిగింది.  వన్యప్రాణుల రక్షణ, పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్య పరిరక్షణ, పర్యాటక ,విద్య ,పరిశోధన మొదలైనవి ఈ అభయారణ్యములు ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం. మన దేశంలో చాలా చోట్ల అభయారణ్యాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా...

దారపల్లి జలపాతం

మానవుడుకి సృష్టికి ప్రతి సృష్టి చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ ,మనకి ప్రకృతి ప్రసాదించిన అందాలు చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతుంది. అవి ప్రకృతితో పుట్టిన అందాలు. అసలు మన చుట్టూ ఉండే ప్రకృతి చాలా అందమైనది. పచ్చటి పంట పొలాలు, ఎత్తైన కొండలు, గలగల పారే నదులు, పచ్చటి చెట్లు, అడవులు ఇవన్నీ కూడా ప్రకృతి ప్రసాదించిన వరాలు. గలగల పారే నదిని గాని, పరవళ్ళు తొక్కే సముద్రాన్ని చూసినప్పుడు ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇంకా కొండల నుంచి ఉబికి వచ్చే జలపాతాలను చూస్తే వచ్చే ఆనందం వర్ణనాతీతం. నదులు ,సముద్రాలు, కాలువలు ఉంటాయి కానీ మనకి జలపాతాలు చాలా తక్కువగా కనబడతాయి.  అసలు జలపాతం అంటే ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తుంది. జలము అంటే నీరు అని అందరికీ తెలుసు . పాఠం అంటే క్రిందికి రావడం లేదా పడడం అని అర్థం. జలపాతం అంటే కొండల మీద నుంచి పడే నీటి ధారలు. లేదంటే పైనుంచి కిందకు పడే నీరు అని అర్థం. దీని ఇంగ్లీషులో Water falls అంటారు  జలపాతం అనేది ఒక భౌగోళిక నిర్మాణం, ఇందులో ఒక నది లేదా నీటి ప్రవాహం ఒక ఎత్తైన ప్రాంతం నుంచి ఆకస్మాత్తుగా కిందకి పడుతుంది. ఇది కొండల, రాళ్ల మధ్య ఏర్పడే ప్రకృతి అద్భుతం. 🔹 జలపాతం ఎలా ఏర్పడ...

జీవితం ఒక రంగస్థలం

అది ఒక రంగస్థలం. కాదు కాదు పుణ్యస్థలం. పుణ్యక్షేత్రం సందర్శించాలంటే రాసిపెట్టి ఉండాలి. ఈ రంగస్థలం ఎక్కాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఈ కళమీద విపరీతమైన మక్కువ తో ఇన్నాళ్లు మన మధ్య ఉన్నవాళ్లే ఒక్కసారిగా ఆ రంగస్థలం మీద కాలు పెట్టిన వెంటనే నటులు అయిపోతారు. పాత్రలలో పరకాయ ప్రవేశం చేస్తారు. ఆ నాటకం చూస్తున్నంత సేపు మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్లి పోతారు.  రంగస్థలం మీద ప్రేక్షకుడికి ఎదురుగుండా నిలబడి తన నటన ప్రదర్శించాలి. ఇది చాలా కష్టమైన పని. రకరకాల పాత్రలు రకరకాల వేషధారణలు ధరించాలి . గొంతెత్తి శ్రావ్యంగా రాగయుక్తంగా పద్యాలు చదివి వినిపించాలి. అవసరమైన చోట నృత్యాలు చేయాలి. భారీ సంభాషణలు తో పాత్రను రక్తి కట్టించాలి. నిజంగా నటుల నటన తెలియాలంటే నాటకాలోనే తెలుస్తుంది. అయితే తెరదించిన తర్వాత ఆ నటులు మామూలు మనుషులు అయిపోతారు.  నాటకానికి జీవితానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది అంటారు. కానీ మన నూరేళ్ళ జీవితంలో జీవిత చరమాంకం వరకు నటిస్తూనే ఉంటాం. పాత్రలలో జీవిస్తూనే ఉంటాం. మనం కూడా నటులమే. మానవ జీవితంలో ఉన్న వివిధ దశలలో మనల్ని ఆడించే ఆ పైవాడు మన దర్శకుడు .  ఈ దర్శకుడు మనకి కనపడడు. కానీ మర...

బంధువులు

అవును కాలం మారింది బంధువులకి అర్థం మారింది పాత బంధువులు మరుగున పడిపోయారు కబురు కాకరకాయ లేకుండా వచ్చే బంధువులు మారిపోయారు తన రాకను ముందుగానే తెలియజేసే  కొత్త బంధువులు వచ్చేసారు. ఆతిథ్యం కోరని బంధువులు రోజు మన తలుపు తడుతున్నారు. వేళా పాళా లేదు ఎండా వాన అసలే లేదు కరోనా అడ్డులేదు వేయి కళ్ళతో మన ఇల్లు వెతుక్కుని మన ఆచూకీ తెలుసుకొని అందంగా బాధ్యత నెరవేర్చే బంధువులు నెత్తి మీద టోపీ చేతిలో బరువు సంచి గేటు లోంచే బాధ్యత నెరవేర్చి  వెను తిరిగే మహావీరులు. అమెజాన్ వారి అందాలబ్బాయి. రోజు మనని పలకరించే చుట్టాలు కానీ చుట్టాలబ్బాయి. మనసు పడిన మాలుని అందంగా తెచ్చి ఇచ్చే అబ్బాయి. ఆకలేసినప్పుడు అమ్మ గుర్తుకొచ్చేది. ఇప్పుడు జొమాటో తల్లి టమాటా బిర్యానీతో కడుపు నింపుతోంది. జొమాటో వీరుడు రివ్వున ఎగిరి వచ్చి ఏ వేళైనా కడుపు నింపేస్తున్నారు వీరే మన బంధువులు రోజు క్రమం తప్పకుండా మనల్ని పలకరించే  మనం కలవరించే బంధువులు కాని బంధువులు. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279

తప్పు ఎవరిది?

అవును నది జాలిగా చూస్తోంది ఏరు దాటి తెప్ప తగలేసే వాడిని చూసి  గలగల పారుతూ పంట పొలాల్లో  పచ్చటి మొలకకు జీవమై  బంగారు పంటలు పండించి రైతన్నకు నేస్తమై  భూమాత దాహార్తి తీర్చే నది జాలిగా చూస్తోంది మనిషి ఇంత స్వార్థపరుడా అని  జాలరికి జీవన ఆధారమై  నదిలో నడిచే నావకు ఆధారమైన నదీమ తల్లి జాలిగా చూస్తోంది ఏరు దాటి తెప్ప తగలేసే వాడిని చూసి. గుప్పెడు బూడిదని తనలో కలుపుకుని  ఎన్ని కోట్ల మందిని పుణ్యలోకాలకు మోసుకు పోయిందో ఈ తల్లి  ఊపిరి ఉన్నన్నాళ్ళు నదిలో మూడుమునకలేస్తే ఎంతమందికి పుణ్యం పంచి ఇచ్చిందో  దూసుకుపోతున్న పొగ బండి లోంచి  పడేసిన సత్తు రూపాయలను దాచి  కన్నతల్లి లా పోరగాడి కడుపు నింపే నదీమ తల్లి జాలిగా చూస్తోంది. అయినా మనిషి గుండె కరగలేదు కూసంత భక్తి లేదు. రోజు నగరం మురికితో స్నానం చేయిస్తోంది నదిని. కాలుష్యంతో కౌగిలించుకుంటున్నాయి పరిశ్రమలు.  దారిన పోయే దానయ్య తను వ్యర్థం అంతా గంగపాలు చేసి బరువు దించేసుకుంటున్నాడు.  పున్నమి వెలుగులో ఉండే నదినీ కారు మబ్బులా మంది మార్చేస్తుంటే  నోరులేని మూగజీవిలా జాలిగా చూస్తోంది నది. ...

అభ్యుదయ కవిత్వం లో ఆణి ముత్యం

ఒక దశాబ్దం పాటు ఆంధ్ర సాహిత్య లోకాన్ని ఉత్తేజపరిచిన అభ్యుదయ కవిత్వానికి మూలవిరాట్ శ్రీశ్రీ. పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ రచనలలో వ్యక్తికి సంఘ చైతన్యానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. బహుశా ఆనాడు సమాజంలో ఉండే సమస్యలకి తన కవిత్వం ద్వారా ప్రజలను ఉత్తేజపరిచి పరిష్కార దిశగా అడుగులు వేయించాడని అర్థమవుతుంది. శ్రీ శ్రీ అభ్యుదయ కవి. అసలు ఈ అభ్యుదయ కవిత్వానికి నిర్వచనం ఏమిటి సాధారణ మానవుడి సంక్షేమమే అభ్యుదయం.  శ్రామికుల్లో చైతన్యం కలిగిస్తూ వారి జీవిత సమస్యలను చిత్రించే సాహిత్యమే అభ్యుదయమంటాడు శ్రీ శ్రీ. కమ్యూనిస్టు భావాలు ఉన్నవాడు. మహాప్రస్థానం లాంటి ఎన్నో మహాకావ్యాలు రచించి జనంలో వేడి పుట్టించి సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని అక్షరాల అక్షరాల్లో చూపించాడు. జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి ప్రజల్లో ఉత్సాహం పెంచాడు.అంతవరకు భావ కవిత్వపు ధో రణిలో రచనలు సాగుతున్న కాలంలో ఒక్కసారిగా సమాజాన్ని జాగృతం చేసే రచనలు రావడంతో శ్రీశ్రీ ఒక అభ్యుదయ కవి విప్లవ కవి అని పేరుగాంచాడు.  అందుకే శ్రీశ్రీ కవిత్వంలోని పదాలన్నీ వాడిగా వేడిగా రక్తాన్ని మరిగించేటట్లుగా ఉంటాయి. అంతవరకు సాహిత్యంలో ప్ర...

ఇత్తడి సామాను

ఉదయం 6:00 గంటలు అయింది.  రాజమ్మ గారు స్నానం చేసి పూజ పూర్తి చేసుకుని హాల్లో టీవీలో వార్తలు చూస్తున్న పెద్ద కొడుకు రఘు దగ్గరకొచ్చి "ఒరేయ్ రఘు ఒక పెద్ద వ్యాన్ తీసుకురా అలాగే ఇద్దరు మనుషుల్ని కూడా పురమాయించు. పైన ఉన్న ఇత్తడి సామాను అంతా మనం రాజమండ్రి పట్టుకెళ్ళి అమ్మేద్దాం అంటూ తల్లి చెప్పిన మాటలకు ఆశ్చర్యపోయాడు రఘు. "అమ్మలో ఇంత మార్పు వచ్చింది ఏమిటా అని ఆలోచించసాగాడు. ఒరేయ్ నా మాటలు వింటున్నావా లేదా అంటూ రెండోసారి రెట్టించేసరికి అలాగే అమ్మ అంటూ స్నానం చేయడానికి పెరట్లోకి వెళ్ళిపోయాడు. రఘు రాజమ్మ గారి పెద్ద కొడుకు. రాజమ్మ గారికి నలుగురు కూతుళ్లు నలుగురు కొడుకులు పెళ్లిళ్లు అయిపోయి అంతా హైదరాబాదులోనే సెటిలైపోయారు. రాజమ్మ గారు మాత్రం ఆ ఊరు వదలలేదు. లంకంత కొంప. చేతినిండా పనివాళ్ళు. నెలకొకసారి రఘు హైదరాబాద్ నుంచి వచ్చి రాజమ్మ గారి బాగోగులు చూసుకుని వెళ్తాడు. మిగిలిన పిల్లలు పండక్కి పబ్బాలకి వచ్చి వెళుతుంటారు. రాజమ్మ గారికి ఆ ఇత్తడి సామానికి అవినాభావ సంబంధం ఉంది. ఆమె వాటిని కన్నతల్లిలా చూసుకుంటుంది. ఎవరి చేతిలో నుంచి అయినా చెంబు జారిపోతే అయ్యో సొట్టపడిపోతుంది రా ఎప్పుడో మీ త...

గుడి

ఉదయం 5:00 అయింది.  ప్రతిరోజు లాగే రాఘవచార్యులు గోపాల కృష్ణుడి గుడి తలుపులు తీసి దేవుడి మీదనున్న నిర్మాల్యం తీసి బయట పడేసి శుభ్రంగా తుడుచుకుని ఘంటసాల గారి భగవద్గీత శ్లోకాలు మైకులో వింటూ స్వామి వారికి ఉదయం జరిపే పూజలు యధావిధిగా చేసి తన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పాలు పళ్ళు నైవేద్యం పెట్టి ఒక్కసారిగా వీధిలోకి తొంగి చూసాడు.  ఎవరైనా భక్తులు వస్తున్నారా అని!. అదేo విచిత్రమో! కార్తీకమాసo పుణ్యదినాలైనప్పటికిపెద్దగా ఎవరూ కనపడలేదు. రోజుకి మహా అయితే పదిమంది వస్తే గొప్ప. అదేమిటి ఇది అతి పురాతన దేవాలయం. ఇంత పుణ్య దినాల్లో కూడా ఎక్కువగా ఎవరు గుడికి రావట్లేదు ఏమిటి ? అనుకుంటూ ప్రతిరోజు మనసులో మధన పడసాగాడు రాఘవాచార్యులు.  రాఘవచార్యులు తెలుగు మాస్టారుగా 35 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యి అనువంశికంగా వచ్చిన అర్చకత్వం తీసుకుని తన స్వగ్రామంలో ఉంటూ ప్రభుత్వo ఇచ్చే పెన్షన్తో కాలక్షేపం చేస్తున్నాడు.  దేవుడు మాన్యాలన్ని కాకులు ఎత్తుకుపోయిన రాఘవాచార్యులు గారి వంశస్థులందరూ తమ ఇంటి నుంచి దేవుడికి నైవేద్యం తీసుకువచ్చి పెడుతూ కాలక్షేపం చేసేవారు ఇంతకు ముందు ఉండే అర్చకులు....

ఆ స్వరం

ఆ స్వరం దేవుడిచ్చిన వరo. అన్నమయ్య పద కవితా వైభవాన్ని ఆ గొంతులో వినడం యావత్ ప్రజానీకం చేసుకున్న అదృష్టం. మనం అన్నమయ్య పద సాహిత్యం లోని మాధుర్యాన్ని అనుభవిస్తున్నాం కానీ అన్నమయ్య గొంతు మనకు తెలియదు.  చేతిలో తంబురా పట్టుకుని కర్ణాటక సంగీత స్వరాలు ఆధారంగా చేసుకుని జీవితమంతా అన్నమయ్య పద స్వరార్చన చేస్తూ కాలం గడిపిన మహా గాయకుడు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్. అన్నమయ్య కీర్తనలు అందరూ పాడతారు. కానీ ఈ స్వరము వినగానే ఏదో భక్తి భావం మనలో పుట్టి ఏదో లోకంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. మనసుని ఆనందపరుస్తుంది. పదే పదే ఆ పాట వినాలనిపిస్తుంది. విష్ణు కథ వినడం మన భాగ్యమని అన్నమయ్య గారు అంటే ఆ పాట ఈ గొంతులో వినడం మనమందరం చేసుకున్న అదృష్టం   " నారాయణ నీ నామమే గతి మాకు అని అన్నమయ్య చెబితే ఈ బాలకృష్ణుడు గొంతులో ఆ పాట యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించడం మనకి వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వరప్రసాదంగా భావించాలి. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అనే అన్నమయ్య పాట గరిమెళ్ళ వారి గొంతులో వినగానే ఒక్కసారి ఆ కోనేటి రాయుడుమన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాడు అనడంలో సందేహం లేదు. ఆయన సంగీత స్వర బాణీ అటువంటిది. పల...

మనిషి ఎప్పుడూ బలహీనుడే

ఉదయం 6:00 అయింది.  గదిలో మంచం మీద పడుకున్న సుమతికి వీధిలో గట్టిగా మాటలు అరుపులు వినపడడంతో ఒక్కసారి మెలకువ వచ్చింది.  బయటి నుంచి ఏవో శబ్దాలు. బహుశా వర్షం పడు తోంది అనుకుంటూ కాళ్లు కిందపెట్టేటప్పటికీ చల్లగా తగిలింది.  ఏంటి నీళ్లు ఒలికి పోయాయా! అనుకుంటూ లైట్ వేసింది. లైట్ వెలగలేదు. కరెంట్ లేదనుకుంటా మరి ఇన్వర్టర్ పనిచేయట్లేదా అనుకుంటూ బ్యాటరీ లైట్ వేసి గది అంతా చూసింది  గదినిండా నీళ్లు. అలాగే నడుచుకుంటూ హాల్లోకి వచ్చేటప్పటికి హా లు రెండో బెడ్ రూమ్ కిచెన్ డైనింగ్ హాలు కూడా నీళ్లతోటి మునిగిపోయి ఉన్నాయి. ఒక్కసారి ఒళ్ళు జల్లుమంది సుమతికి. ఏం చేయాలో తోచలేదు. పనిమనిషి రాలేదు. ఇంత నీరు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటూ గదిలోకి వచ్చి భర్త రామారావు నీ లేపింది. సాధారణంగా ఏదైనా ముఖ్యమైన పని ఉంటే గాని భర్తని ఆ సమయంలో నిద్ర లేపని సుమతిని ఏమైంది అని ఆందోళనగా అడిగాడు రామారావు. " మన ఇంట్లో నీళ్లు వచ్చేసేయండి అని సుమతి మాటలు ఒక్కసారి వినేసరికి రామారావు గబుక్కుని హాల్లోకి వచ్చి వీధి తలుపు తీశాడు. బయట హోరున వర్షం కురుస్తోంది. కారు సగం వరకు మునిగిపోయింది. పెరడు నిండా నీళ్లు. అప్పటికే ...

సినిమా రంగంలో ఎన్టీఆర్

భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్ అనే నామం అక్షరాలా సువర్ణాక్షరాలతో లిఖించబడింది. నందమూరి తారక రామారావు తన నటనా ప్రతిభతో, పాత్రల లోతుతో, పాత్రను జీవించిన విధానంతో కోట్లాది ప్రజల మనసుల్లో అమరుడయ్యాడు. ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించినా, కొన్ని పాత్రలు మాత్రం మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అలాంటి పాత్రల్లో అగ్రస్థానంలో ఉండేది — శ్రీకృష్ణుడు పాత్ర. శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ — ఓ జీవమంత పాత్ర ఎన్టీఆర్ చేసిన శ్రీకృష్ణుడు పాత్ర మాత్రమే కాదు, ఆ పాత్రను జీవించడం, ఆ పాత్ర తత్త్వాన్ని ప్రజలకు చేరవేయడం ఆయనకు మాత్రమే సాధ్యమయ్యింది. 1957లో వచ్చిన "మాయాబజార్" సినిమా ఈ పాత్రకు శిఖరంగా నిలిచింది. ఇందులో ఆయన శ్రీకృష్ణునిగా నటించి, ఆ పాత్రలో ఉన్న మాయ, తెలివితేటలు, ధర్మబద్ధత, ప్రేమ, వ్యంగ్యబుధ్ధి — అన్నిటినీ గొప్పగా ప్రదర్శించారు.  మాయబజార్‌లో శ్రీకృష్ణుని పాత్రను చూస్తే, ఆయన కళా నైపుణ్యం, అభినయం, శబ్ద విన్యాసం అన్నింటిలోనూ ఎన్టీఆర్ ఎలా అద్భుతంగా నటించారో స్పష్టంగా తెలుస్తుంది. పౌరాణిక పాత్రలలో ఎన్టీఆర్ ప్రభావం శ్రీకృష్ణుడే కాకుండా, ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు...

టెలిగ్రామ్

సుమారు 50 ఏళ్ళు ఉంటాయేమో ఒక పాత కళ్ళజోడు పెట్టుకుని పళ్ళు ఎత్తుగా ఉండి వదులుగా ఉన్న బట్టలు తొడుక్కుని ఒక పాత సైకిల్ మీద చెమటలు కక్కుతూ ఒక సంచి సైకిల్ కి తగిలించుకుని వచ్చే ఆ మనిషిని చూస్తే అందరికీ భయo వేసేది ఆ ఊర్లో. దూరం నుంచి చూసి మన ఇంటికి కాదు కదా అని భయపడేవారు. అందరికీ ఆ మనిషిని చూసేటప్పటికి ఒంట్లో ఒక రకమైన వణుకు వచ్చేది. దానికి తోడు ఆయన ఆకారం కూడా అలాగే ఉండేది. ఆ మనిషిని చూడగానే పాత అనుభవాలన్నీ గుర్తు చేసుకుని బాధపడేవారు. ఇంతకీ ఎవరు ఆ పెద్దమనిషి సుమారు 5 కిలోమీటర్ల దూరం నుంచి ఆ ఊరికి అప్పట్లో టెలిగ్రామ్ పట్టుకొచ్చే పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. ఆయన పేరు ఇస్మాయిల్. ఒక వార్త తొందరగా చేరవేయాలి అంటే టెలిగ్రాములు పంపించేవారు ఆ రోజుల్లో.  ఏదైనా సరే ఆ మనిషిని చూడగానే అందరికీ చెడుతలంపులే వచ్చేవి. దూరాన్ని ఉన్న తమ బంధువులు ఎలా ఉన్నారో అని భయం పట్టుకునేది. ఎవరి ఆరోగ్యాలు ఎలా ఉన్నాయో అని చింతపడేవారు. వీళ్ళ భయంగాని మంచి వార్త కూడా ఉండొచ్చు కదా. అప్పుడు బంధుప్రీతి ఎక్కువగా ఉండేది. ఇంట్లో జరిగే మంచి విషయమైనా చెడు విషయమైనా బంధువులందరికీ తొందరగా తెలియజేసేవారు. కనీసం ఆఖరి చూపు అయినా అయినవ...

సత్తిబాబు

" పొద్దుటి నుంచి మన ఇంట్లో కరెంట్ లేదండి. ఇవాళ అసలు ఏ  పని అవలేదు వంటింట్లో. మన ఇన్వెర్టర్ కూడా పనిచేయట్లేదు అంటూ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే సంధ్య చెప్పిన మాటలకి రాజారావు గుండెల్లో రాయి పడింది.  అసలే వేసవికాలం రాత్రి ఏసీ లేకుండా ఎలాగా అని ఆలోచిస్తూ అసలే ఈ ఊరికి కొత్త ఇప్పుడు ఎలక్ట్రీషియన్ నెంబర్ ఎలాగా అని అనుకుంటూ రాజారావు ఎదురింటి ప్లాట్ తలుపు తట్టాడు. ప్లాటు తలుపు తీయగా నే " నమస్కారమండి నా పేరు రాజారావు నేను ఎదురింటిలో కొత్తగా దిగా ను. కొంచెం మీకు తెలుసున్న ఎలక్ట్రీషియన్ నెంబర్ ఏదైనా ఉంటే ఇవ్వండి మా ప్లాట్ లో కరెంట్ లేదంటూ చెప్పిన మాటలకి తలుపు తీసిన పెద్దమనిషి వెంటనే తన సెల్ లో వెతికి ఇతని పేరు సత్తిబాబు చాలా బాగా చేస్తా డు అంటూ నెంబర్ ఇచ్చాడు. థాంక్స్ అండి అంటూ బయటికి వచ్చి రాజారావు సత్తిబాబుకి కాల్ చేయగానే  వెంటనే ఫోన్ తీసి పదిహేను నిమిషాల్లో మీ ఇంటి దగ్గర ఉంటానండి అంటూ అడ్రస్ చెప్పమన్నాడు ఎలక్ట్రీషియన్ సత్తిబాబు.  నిజంగానే పదిహేను నిమిషాలకి ముందే కాలింగ్ బెల్ మోగింది. ఒక నల్లగా పొట్టిగా ప్యాంటు చొక్కా వేసుకుని జుట్టు బట్టతలలా ఉన్న ఒక యువకుడు చేతిలో సంచి పట...

హరిశ్చంద్రుడు

రాజ్యపాలన: అయోధ్యకు రాజుగా ఉన్న హరిశ్చంద్రుడు ఎంతో ధర్మపరుడు, నిజాయితీ గలవాడు. అతనికి భార్య శివ్య (తారామతిఅని కూడా పిలుస్తారు), కొడుకు లోహితదాసు ఉన్నారు. అతడు ఎప్పుడూ సత్యాన్ని మాత్రమే అనుసరించేవాడు. తన వాక్కు తప్పక చెల్లించేవాడు. అన్నిఅవకాశాల్లోనూ ధర్మాన్ని పాటించేవాడు. విశ్వామిత్రుని పరీక్ష: ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు, హరిశ్చంద్రుని ధర్మాన్ని పరీక్షించాలనుకుంటాడు. మొదట అతనికి ఒక కలలో దేవతలు ఆశీర్వదించారని చెప్పి, యజ్ఞానికి దానం కోరుతాడు. హరిశ్చంద్రుడు అంగీకరించి తన మొత్తం రాజ్యాన్ని దానం చేస్తాడు. అయితే విశ్వామిత్రుడు వెంటనే చెబుతాడు: "ఇది కలలో ఇచ్చావు, కానీ వాస్తవంగా అమలు చేయాలి. రాజ్యాన్ని ఖచ్చితంగా అప్పగించు మరియు దానానికి తగిన దక్షిణను కూడా చెల్లించు." ధనo లేనివాడు – బానిసత్వం: హరిశ్చంద్రుడు ధనం లేక ఏమీ ఇవ్వలేకపోతాడు. దాంతో ఆయన భార్య, కుమారునితో కలసి వనాలకు వెళ్ళి దానానికి తగిన ధనాన్ని సంపాదించాలనుకుంటాడు. కాశీ (వారణాసి)కి వెళ్లి భార్యను ఒక బ్రాహ్మణుడికి సేవకురాలిగా అమ్మేస్తాడు. తన కుమారుడిని కూడా అతనికి తోడుగా పంపుతాడు. తాను మాత్రం శ్మశానంలో పనిచేయడం మొదలు పెడతాడు, మ...

రాజుల కోటలు

మన ఆంధ్ర ప్రాంతాన్ని అనేక రాజవంశాలు, విదేశీయులు క్రీస్తుపూర్వం రెండో శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు పరిపాలించారు. అందులో శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణు కుండినిలు,వేంగీ చాళుక్యులు, చోళులు ,కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, గజపతులు ,బహుమనీ సుల్తాన్లు, మొగలులు, ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ప్రభుత్వం వారు ముఖ్యులు.  అయితే వీరిలో చాలామంది రాజ్యాలను స్థాపించి కోటలను నిర్మించి పరిపాలించేవారు. ఒకప్పుడు అత్యంత వైభవంతో వెలిగిపోయిన ఈ కోటలు మనకిప్పుడు పర్యాటక ప్రదేశాలుగా మిగిలిపోయేయి.  అసలు కోట అంటే ఏమిటనే సందేహం మనలో చాలామందికి కలుగుతుంది. కోట అంటే రాజులు నివాస ఉండే కట్టడం. అక్కడి నుంచే రాజు రాజ్యాన్ని పరిపాలించేవాడు. శత్రువుల నుండి దేశాన్ని రక్షించడం కోసం సురక్షితమైన కట్టడం ఇది. ఇందులో రాజు తన పరివారంతో కొలువుతీరి ఉండేవాడు. అలా ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన అనేకమంది రాజవంశాలు సిమెంటు ఇటుక కూడా తెలియని రోజుల్లో అంత భారీ ప్రాంగణాలు ఎలా నిర్మించారనేది ముఖ్య విషయం.  నిజంగా వారి దూర దృష్టికి తార్కిక దృష్టికి నిర్మాణ కౌశల్యానికి జోహార్లు చెప్పకుండా ఉండలేం.    అయిత...

అమ్మ@న్యాయమూర్తి

"మీరు విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నారు?" అని ప్రశ్నించింది జడ్జి రాజ్యలక్ష్మి, కోర్టు బోనులో నిలుచున్న ఊర్మిళ అనే యువతిని. ఊర్మిళ దగ్గర నుండి సమాధానం రాకపోవడంతో, మరో ప్రశ్నలు వరుసగా వెల్లువెత్తాయి. "మీ భర్త మిమ్మల్ని బాధిస్తున్నారా? ప్రేమగా చూడడంలేదా? పెళ్లి అయి ఎంతకాలమైంది?" అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం — "మా పెళ్లయి ఎనిమిది నెలలైంది." జడ్జి రాజ్యలక్ష్మి ఒక్కసారి ఉలిక్కిపడింది. "ఎనిమిది నెలల కాపురానికే విడాకులా?" "మీది పెద్దలు కుదిర్చిన పెళ్లి లేదా ప్రేమ వివాహమా?" "పెద్దలే చూశారు మేడం," అని నెమ్మదిగా చెప్పింది ఊర్మిళ. "అయితే పెళ్లి చూపుల్లో మాట్లాడుకోలేదా? తిరగలేదా కలసి?" "తిరిగాం మేడం... పెళ్లి ముందు కలిసి సినిమాలు, షికార్లు చేశాం. పెళ్లి ఘనంగా జరిగింది." "అయితే సమస్య ఏమిటి?" "హనీమూన్‌కి తీసుకెళ్లమన్నాను. ముందు ఒప్పుకున్నారు  పెళ్లయ్యాక ఎన్నో మినహాయింపులు చెప్పాడు. ప్రతిరోజూ అదే గొడవ. మాట తప్పితే నాకు కోపం ఎక్కువ.  అది నాకు తెలుసు మేడం. పుట్టినరోజుకి ప్రామిస్‌ చేసిన పార్టీ కూడ మరిచిపోయాడు....

మేము పండుగకి వెళ్ళాము

ప్రతి సంవత్సరం ఈపాటికి ఎంత హడావిడిగా ఉండేది! ఇల్లంతా పిల్లలతో, బంధువులతో సందడిగా ఉండేది. ఊరంతా సంక్రాంతి సంబరాలతో హర్షాతిరేకంగా కనిపించేది. కానీ ఏం కర్మమో, గత నాలుగు సంవత్సరాలుగా ఇలా ఈ ఆశ్రమంలో ఒంటరిగా జీవించాల్సి వస్తోంది. ప్రతి సంవత్సరం ఎవరిదైనా పండగకైనా పిలుస్తారని ఆశగా ఎదురుచూడటం, తర్వాత నిరాశ చెందటం పరిపాటి అయిపోయింది. చివరికి ఆశ్రమంలో పనిచేసే పని వాళ్లు కూడా ఒక్క రోజైనా సెలవు తీసుకుని వెళ్లిపోతారు. కానీ ఆశ్రమంలో మిగిలిపోతారు మనలాంటి వాళ్లే — అనుకుంటూ బాధపడుతున్నారు పార్వతమ్మ–పరంధామయ్య దంపతులు. సంక్రాంతి నెల మొదలైన దగ్గర్నుంచి పిల్లలకు పండుగకి రమ్మని మరీ మరీ చెప్పడం, వాళ్లకు బట్టలు కొనడం, పిండి వంటలు చేయడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం... వీటితో పార్వతమ్మకి ఎక్కడ ఖాళీ ఉండేది? పిల్లలే కాకుండా ఇంట్లో పనిచేసే పనిమనిషి, చాకలి, దొడ్లో పాలేరు వంటి వారికీ కూడా పండుగ బహుమతులు ఇవ్వడం, బట్టలు పెట్టి సంతోషపెట్టడం ఏటా ఆనవాయితీ. అలాంటిది, గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి పండగని ఆశ్రమంలో ఒంటరిగానే గడపడం వేదనగా ఉంది అనిపిస్తోంది పార్వతమ్మకి. వయస్సులో ఉన్నప్పుడు చేతినిండా పని ఉండేది కానీ చేయలేకపోయేది. ఇప్ప...

భార్య

సాయంత్రం నాలుగు గంటలు అయింది కాకినాడ పిఠాపురం రోడ్ లో ఉన్న బోట్ క్లబ్ పార్క్ రోజు వాకింగ్ కోసం వచ్చేవాళ్ళ తో ,ఆటలాడుకునే పిల్లలతో, మూలగా ఉన్న బెంచీల మీద కూర్చున్న ప్రేమికులతో చెరువులో చిన్న పడవలతో షికారు చేసే వాళ్ళ అరుపులతో, ఆ చెరువు మీద నుంచి వచ్చే చల్లటి గాలితో చాలా సందడిగా ఉంది. వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉంది. సాధారణంగా మనశ్శాంతిగా ఉంటుందని ఇటువంటి ప్రదేశాలకు వస్తారు. కానీ ఆ పార్కులో మూలగా ఉన్న బెంచి మీద ఒంటరిగా కూర్చున్న ఇరవై ఐదు ఏళ్ల వయసున్న యువతి సునీత మనసంతా కోపంతో రగిలిపోతోంది. "రెండు సంవత్సరాల నుంచి భర్త ప్రవర్తనలో ఏమి మార్పు లేదు. అన్ని విషయాలలోను బాగానే ఉంటాడు. బాగానే చూసుకుంటాడు. మరి డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడలేని పిసినారితనం. అప్పులు చేయవద్దు ఉన్న దాంట్లోనే సర్దుకోమంటాడు. సునీత కేమో టూర్లకి వెళ్లాలని సరదా. ఖరీదైన వస్తువులు కొనుక్కోవాలని కార్లలో షికార్లకి వెళ్లాలని ఒక ఆశ.ఆరు నెలలకు ఒకసారి ఏదో ప్లాన్ చేస్తూనే ఉంటుంది. భర్త దానికి ఒప్పుకోడు.  అన్నిటికీ డబ్బే ఆధారం. డబ్బు లేకుండా ఎలా గడుస్తుంది ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కదా. అందుకనే డబ్బులు పొదుపు చే...