పోస్ట్‌లు

ఆగస్టు, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

భూమాత కన్నీరు

"అమ్మా పద్మ! నా బంగారు తల్లి కదా, రెండు మాత్రలు వేసుకో. పొద్దున్న టిఫిన్ మాత్రలు కూడా వేసుకోలేదు. ఈ లంచ్ మాత్ర వేసుకో అమ్మా. నీరసం వస్తుంది" అంటూ పద్మ తల్లి నీరజ కూతుర్ని బతిమాలుతోంది. "లేదమ్మా! నాకు ఆకలిగా లేదు. ఆ మాత్రలు వేసుకుంటే కడుపులో ఏదోలా ఉంటోంది. ఆ మాత్రలు చేదుగా ఉంటున్నాయి. వికారంగా ఉంటుంది. నాకు వద్దు" అంటూ ఏమి తినకుండానే స్కూల్‌కి వెళ్ళిపోయింది పద్మ. "ఆకలి చంపుకోడానికి మాత్రలు వేసుకుంటున్నాను కానీ నిత్యం నా పరిస్థితి కూడా ఇదే" అని తనలోతాను అనుకుంది పద్మ తల్లి నీరజ. "అయినా శరీరానికి ఈ మాత్రలు అలవాటు పడటానికి కొద్ది రోజులు పడుతుంది అని డాక్టర్ గారు చెప్పారు కదా. ఈ పిల్ల అర్థం చేసుకోవడం లేదు" అని అనుకుంది నీరజ. "ఒసేయ్ నీరజా! నాకు ఆ దిక్కుమాలిన మాత్రలు వద్దు. నాకు రెండు ముద్దల మజ్జిగ అన్నం పెట్టు. అసలే నేను రోగానికి మందులు మింగుతున్నాను. దానికి తోడు మళ్ళీ ఈ దిక్కుమాలిన బాధ ఒకటీ! అలవాటైన ప్రాణం... వేళకి రెండు ముద్దలు తినకుండా ఉండలేము. ఇటువంటి పరిస్థితి వచ్చింది ఏమిటి దేవుడా! కడుపులోని ఆకలిని చంపడానికి మందులు మింగే స్థితికి వచ్చేసాము...

హల్లులు

1. క క నుంచి పూసె కరుణ, హృదయ తోటలో పరిమళ గంధం॥ కరుణ లేనిదే మానవత్వం శూన్యం ప్రేమలేని మనసు రాయి అవుతుంది॥ 2. ఖ ఖ నుంచి వెలసె ఖ్యాతి, కష్టపడి సాధించిన ఫలం॥ కృషి లేని ఖ్యాతి శూన్యం, నిజమైన మహిమ కృషిలోనే॥ 3. గ గ నుంచి పూసె గుణం, మనిషి గౌరవానికి పునాది॥ గుణములేని విద్య వృథా, గుణమున్నవాడే నిజమైన రత్నం॥ 4. ఘ ఘ నుంచి వినిపించె ఘనత, ధర్మం నిలబెట్టిన గౌరవం॥ అన్యాయం గెలిచిన చోట ఘనత లేదు, ధర్మమే ఇచ్చేది నిజమైన కీర్తి॥ 5. ఙ ఙ నుంచి వెలసె ఙ్ఞానం, చీకటిని పారద్రోలి వెలుగు॥ జ్ఞానం లేని జీవితం అంధకారం, జ్ఞానమే మానవుని నిజమైన బలం॥ 6. చ చ నుంచి మెరిసె చందమామ, బాల్యంలో కలల సఖి॥ చందమామ లేని చిన్నారి గీతం, అనిపించదు తీపి తీయనిదిగా॥ 7. ఛ ఛ నుంచి లభ్యమైందీ ఛత్రం, వానలో ఎండలో రక్షణ॥ ఛత్రం లేనిదే జీవితం కష్టమే, రక్షణతోనే సౌఖ్యం సాధ్యం॥ 8. జ జ నుంచి వెలసె జీవితం, ప్రేమ దయల పరిమళ తోట॥ జీవితం అనేది పంచుకోవడమే, స్వార్థమే అయితే జీవం వెలితి॥ 9. ఝ ఝ నుంచి పారె ఝరులు, గానమై ప్రవహించే నదులు॥ ప్రకృతి గీతం వినిపించే చోట, మనసు మధురంగా మారిపోతుంది॥ 10.  11. ట ట నుంచి మ్రోగె టపాసులు, ఉత్సవ రాగాల మేళం॥ రంగుల కాంతుల సంబరమే...

అచ్చులు

అ అ నుంచి పుట్టిన పదం అమ్మ, అమ్మలేని మన జీవితం బొమ్మ॥ (అమ్మ అంటే ప్రేమకు రూపం, జీవానికి ఆరంభం) ఆ ఆ నుంచి వెలసినది ఆనందం, ఆనందమంటే మన జీవన ప్రాణం॥ (ఆనందం అంటే మనసుకు ఊపిరి, జీవితం తీపి) ఇ ఇ నుంచి వెలసినది ఇల్లు, కష్టాలు–సుఖాలు పంచుకునే నిలయం॥ (ఇల్లు అంటే గోడలు కాదు, హృదయాల గూటి) ఈ ఈ నుంచి పలికె ఈశ్వరుడు, ఆయన లేని జీవితం వెలితి॥ (దైవం అంటే మనసుకు ఆశ్రయం, ఆత్మకు శాంతి) ఉ ఉ నుంచి ఊగె ఉయ్యాల, చిన్ననాటి కలల లాలిపాట॥ (బాల్యం అంటే అమాయకపు పరిమళం) ఊ ఊ నుంచి పుట్టె ఊరు, జ్ఞాపకాల తోట, మూలాల నిలయం॥ (ఊరు అంటే మూలాలు, మమకారం, మట్టి వాసన) ఋ ఋ నుంచి వెలసె ఋషులు, వారి జ్ఞానం లేక మార్గం లేదు॥ (ఋషులు అంటే సత్యాన్వేషణకు దీపస్తంభాలు) ఎ ఎ నుంచి మెరిసె ఎదురుచూపు, ఆశలే మనిషి ప్రాణశక్తి॥ (ఆశ లేకపోతే అడుగు ముందుకే వేయలేం) ఒ ఓ ఓ నుంచి మ్రోగె ఓంకారం, ప్రాణమంతా నింపే నాదం॥ (ఓంకారం అంటే సృష్టి, స్థితి, లయమనే త్రిస్వరూపం) ఔ ఔ నుంచి వెలసె ఔదార్యం, దానం లేనిది జీవితం వెలితి॥ (ఔదార్యం అంటే పంచుకోవడమే పరమధర్మము

రాజమహేంద్రవరం_ గోదావరి తీరాన శ్వాసించే చరిత్ర

గోదావరి తీరాన విరాజిల్లే రాజమహేంద్రవరం ఒక పట్టణం కాదు, అది పౌరాణిక ప్రాణం. ఎన్నిసార్లు పేర్లు మారినా, చరిత్ర తన మూలాలను చెరపనీయలేదు. రాజరాజ నరేంద్రుని రాజధాని అన్న గౌరవం ఈ నేలకే లభించింది. ప్రతీ వీధి వెనుక ఒక వ్యక్తిత్వం, ప్రతీ చెరువు వెనుక ఒక జ్ఞాపకం, ప్రతీ గుట్ట వెనుక ఒక పురాణం నిద్రిస్తున్నాయి. ఆంధ్ర మహాభారతo పుట్టిన ప్రదేశం.. ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి నడయాడిన ప్రదేశం . ఎంతోమంది దేశభక్తులు కళాకారులు పండితులు నివసించిన పుణ్యభూమిది. ఈ నగరం కేవలం ఇటుకలతో కట్టబడిన వీధుల సమాహారం కాదు. ఇది కవుల కలల సౌధం, సంఘసంస్కర్తల పోరాటాల వేదిక, కళాకారుల ప్రేరణ స్థలం.   ప్రతిరోజు కొన్ని వందల మంది ప్రయాణికులను ఇక్కడ నుంచి వారి గమ్యస్థానాలకు చేర్చే బస్సులు ఆగే స్థలం . అది ఒక పుణ్యక్షేత్రం పేరు పెట్టుకుంది. అదేనండి కోటిపల్లి బస్టాండ్. కానీ దాని వెనక చరిత్ర ఎంతో ఉంది . బిపిన్ చంద్రపాల్, మహాత్మా గాంధీ ఈ ప్రదేశంలో పర్యటించి ఉపన్యాసాలు ఇచ్చారట.   బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఈ ప్రాంతం వారికి స్థావరంగా ఉండేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్లిపోయ...

శమంతక మణి

 శమంతక మణి  పూర్వకాలంలో సత్రాజిత్తు , ప్రసేనుడు అనే ఇద్దరు యదు వంశ రాజులు ఉండేవారు. సత్త్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు . అయితే ఈ సత్రాజిత్తు ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు భక్తుడు. ఈ సూర్య భగవానుడు ఎల్లప్పుడూ మెడలో శమంతకమణిని ధరించి ఉండేవాడు. ఈ శమంతకమణి కెంపు రంగులో ఉండేది. ఈ శమంతకమణి ఎక్కడ ఉంటే అక్కడ కరువు కాటకాలు లేకుండా దేశం సుభిక్షంగా ఉంటుందట. అయితే ఈ సూర్య భగవానుడు సత్రాజిత్తు కోరిక మేరకు తన మెడలోని శమంతకమణిని ఇచ్చి వేస్తాడు.  ఆ మణిని ధరించి సత్రాజిత్తు ద్వారకా నగరానికి వస్తుంటాడు. అలా వస్తున్న సత్రాజిత్తుని చూసి సూర్యుడు వస్తున్నాడని భ్రమించి ద్వారకవాసులు పరమాత్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి విషయం విన్నవిస్తారు. అది విన్న శ్రీకృష్ణ పరమాత్మ దివ్యదృష్టితో చూసి వస్తున్నవాడు పంచముఖ బ్రహ్మ కానీ, సూర్యదేవుడు కాదని చెబుతాడు.  ఆ తర్వాత సత్రాజిత్తు బ్రాహ్మణుల వేదమంత్రాలు చదువుతుండగా ఆ శమంతకమణిని తన పూజ మందిరంలో ఉంచుతాడు. అది సామాన్యమైన వస్తువు కాదు. ఒక రోజుకి ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఆ శమంతకమణిని యాదవుల రాజైన ఉగ్రసేన మహారాజ...

పుట్టిన ఊరు _ మధురస్మృతులు

పుట్టిన ఊరు అంటే అందరికీ ఇష్టమే. ఏ సౌకర్యాలు ఉన్నా లేకపోయినా, బాల్యంలో మధురమైన అనుభూతులు మిగిల్చిన ఆ గ్రామం మాకు ఇప్పటికీ ఎంతో ఇష్టం. గ్రామం గురించి చెప్పుకోవాలంటే చుట్టూ అందమైన పొలాలు, మామిడి తోటలు, పిల్ల కాలువలు, పెద్ద కాలువలు. ఊరి మొదట్లో అమ్మవారి గుడి, అగ్రహారంలో వ్యాసేశ్వర స్వామి గుడి, గోపాల స్వామి గుడి. ఊరి లోపలికి వెళ్తే రామాలయాలు—ఇవన్నీ చల్లగా దర్శించగలిగే దేవాలయాలు. మా పల్లిపాలెం గ్రామంలో ఒక పంచాయతీ కార్యాలయం, అప్పర్ ప్రైమరీ స్కూలు, కచేరి సావిడి ఇవి ముఖ్యమైన ప్రదేశాలు. కొన్నిచోట్ల కంకర రోడ్లు, మరికొన్ని చోట్ల అవి కూడా లేవు. వర్షాకాలం వస్తే పరిస్థితి చెప్పక్కర్లేదు. చిన్ననాటి వినోదం అప్పట్లో రేడియో ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్. అది కొద్దిమంది ఇళ్లల్లో మాత్రమే ఉండేది. మరి మిగిలిన వాళ్లు రెండు కిలోమీటర్లు నడిచి టూరింగ్ టాకీస్‌కి వెళ్లి సినిమా చూసి ముచ్చట తీర్చుకునేవారు. అలాంటి ఊర్లో ఏడాదికోసారి జరిగే తొమ్మిది రోజుల గణపతి నవరాత్రి ఉత్సవాలు మాత్రం అందరికీ పెద్ద వినోదం. రెండు రోజులు ముందుగా పెద్ద పందిరి కట్టి, గ్రామఫోన్ రికార్డులు, మైక్ సెట్ పెట్టేవారు తొలిరోజు సాయంకాలం ఘంటసాల గారి “నమో ...

భాధ్యత

ఉదయం 5 గంటలు అయింది. ఎప్పుడూ ఐదు గంటలకు కాఫీతో పలకరించే కేర్ టేకర్ లక్ష్మీ ఇవాళ ఇంకా కనపడలేదు. ఏమిటి? ఏం చేయాలి అబ్బా! బీపీ మందు వేసుకోవాలి. మొహం కూడా కడుక్కోలేదు. ఏమిటో, నీరసంగా ఉంది. ఈ అపార్ట్మెంట్లో ఎవరు పిలిచినా పలకరు. రాజేష్ ఫోన్ తీయట్లేదు. వాడు ఇంకా నిద్ర లేచాడో లేదో. ఏమిటో ఈ వయసులో ఈ కర్మ అనుకుంటూ, అలాగే నెమ్మదిగా మంచం దిగి డేకుతూ, మొహం కడుక్కుని, నేల మీద ఉన్న స్టవ్ మీద పాలు పెట్టి, కాఫీ కాచుకుని తాగింది కాంతమ్మ. "కొడుకు ఒక మంచి పని చేశాడు. ఒంటరిగా అపార్ట్మెంట్లో ఉంచినా స్టవ్ సామాన్లు కూర్చుంటే అందేలా పెట్టాడు" అని అనుకుంది కాంతమ్మ. అయినా, ఎప్పుడూ ఈ కేర్ టేకర్ ఎలా ఒంటరిగా వదిలేసి వెళ్లలేదే! ఇవాళ ఏమైందో ఏమో! మార్కెట్కు గాని వెళ్ళిందా, అయినా చెప్పి వెళ్తుంది కదా! ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. పోనీ, రాజేష్ కి విషయం చేద్దాం అంటే వాడు ఫోన్ తీయట్లేదు.  ఏమిటో, వాడు కళాకళల మనిషి. కోపంగా ఉంటే ఫోన్ తీయడు. వాడికి కోపం వస్తే, "అమ్మ" అనే సంగతి మర్చిపోతాడు. ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేది? రాజేష్ నోరు విప్పి మాట్లాడేవాడు కాదు. ఎంత బాగా చూసుకునే వారు. నేల మీద కాలు పెట్టనిచ్చేవారు కాద...

ఒక తల్లి గుండె చప్పుడు

మధ్యాహ్నం మూడు గంటలు అయింది. ఇందిరా గాంధీ లేడీస్ క్లబ్ ఆవరణ అంతా హడావిడిగా ఉంది. కార్యకర్తలంతా అటు నుంచి ఇటు తిరుగుతూ, సభ ప్రారంభానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ, ముఖ్య అతిథి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. "ఆ బ్యానర్ ఎదురుగుండా కట్టండి" అని చెప్పి ఒక్కసారి బ్యానర్ చూసిన లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్, "అదేమిటి? ముఖ్య అతిథి పేరు కింద జిల్లా కలెక్టర్ అని రాయలేదు ఏమిటి?" అని అడిగింది. "లేదు మేడం. కలెక్టర్ గారు ఒక సాధారణ మహిళగానే ఈ కార్యక్రమానికి వస్తారట. అందుకని పేరు మాత్రమే రాయమన్నారు" అంటూ సమాధానమిచ్చింది లేడీస్ క్లబ్ సెక్రటరీ. ఆ జిల్లాకి కలెక్టర్ ఆయన శ్రీమతి సుమతి. ఆ రోజు ముఖ్య అతిథి. జరగబోయే ఫంక్షన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. --- సరే, అనుకున్న సమయానికి కలెక్టర్ గారు రావడం, వేదిక మీదకి ఆహ్వానించడం, అలాగే ఆ రోజు సన్మానితులను కూడా వేదిక మీద కలెక్టర్ గారి పక్కన కూర్చోబెట్టడం జరిగింది. అతి సామాన్యమైన దుస్తులతో, ఏవీ అలంకరణలు లేకుండా, కనీసం జుట్టు కూడా దువ్వుకోకుండా ఉన్న స్త్రీని కలెక్టర్ గారి పక్కన కూర్చోబెట్టారు. ఒక్కసారి కలెక్టర్ సుమతి ఆమెను చూసి, "రోడ్డు మీద పోయే ...

ఆమె స్వరo _ ఊరికి వరం

"ఏమ్మా మల్లి, ఇంత ఆలస్యమైంది?" అని అడిగాడు పొలానికి క్యారేజీ తీసుకువచ్చిన తన కూతుర్ని రామారెడ్డి. "ఏం లేదు నాన్న, నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాను." "నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చావా! దారిలో పాటలు పాడుకుంటూ వచ్చావా?" అని అడిగాడు రామారెడ్డి. ఎందుకంటే ప్రతిరోజు రామారెడ్డికి ఇది మామూలే. రెండు మూడు సార్లు కూతురి ఇంకా రావటం లేదని ఎదురు వెళ్లేసరికి చెట్టు మీద ఉన్న కోయిలని, పాకలో ఉన్న పశువుని, పొలం గట్టు మీద ఉన్న చెట్లని, చేలో ఉన్న పంటని చూస్తూ ఏదో పాటలు పాడుకుంటూ అడుగులు వేస్తూ వస్తోంది మల్లి. "ఏమ్మా, ఎప్పుడు ఆ పాటలేనా? తొందరగా రా! ఆకలేస్తుంది," అంటూ కేకలేశాడు రామారెడ్డి. చిన్నప్పటి నుంచి రేడియో పట్టుకుని వదలదు మల్లి. ఎవరి ఇంటికి వెళ్ళని మల్లి ఈమధ్య తరచూ పక్కింటి వాళ్లింటికి వెళ్లి ఏదో పాటల ప్రోగ్రాం చూడడం మొదలుపెట్టిందని రామారెడ్డికి భార్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. "ఏంటో ఈ పిల్లకి అలవాటు ఎలా వచ్చిందో!" చిన్నప్పటినుంచి ఊర్లో జరిగే గణపతి, నవరాత్రి ఉత్సవాల పందిళ్లలోనూ, శ్రీరామనవమి, శివరాత్రి జాతరలోనూ ఏదో భక్తి గీతాలు పాడుతూ ఉంటుంది. "ఇవి ఎక్కడ న...

మదిని దోచిన బొమ్మ

నల్లటి శరీరం, కమలాల వంటి కళ్ళు. ఆ కళ్ళల్లో కృపారసం. చేతిలో వేణువు, తల మీద పరిసర్పిత పింఛం. ఎప్పుడూ నవ్వుతూ విరాజిల్లే మొహం. ఇది పోతన గారి శ్రీకృష్ణుడి వర్ణన. ఆ వర్ణన చదువుతుంటేనే మన మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడిని మనం చూడలేకపోయినా వెన్నదొంగగా, రాధాకృష్ణుడిగా, అల్లరి కృష్ణుడిగా చిత్రపటంలో చూసినప్పుడు మనసు పదేపదే ఆ ముగ్ధమోహన రూపాన్ని చూడాలని అనిపిస్తుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మతో సమకాలీకులుగా పెరిగిన ఆ యాదవులు ఎంతటి అదృష్టవంతులో అనిపిస్తుంది. నిజమే, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మతో స్నేహితులుగా మెలిగిన యాదవులు చాలా ధన్యాత్ములు. అంటే భగవంతుని పక్కనే ఉండి తమ స్నేహితుడే భగవంతుడు అని తెలియని వాళ్లు. అంత అందమైన పరమాత్మను చూడడానికి ఆ కాలంలో ప్రజలు వీధుల్లో బారులు తీరి ఉండేవారట. మనం ఈ కాలంలో అందమైన శ్రీకృష్ణుడి చిత్రపటం కానీ, బొమ్మ కానీ రోడ్డుమీద కనబడితే ఒకసారి అటు చూడకుండా ఉండలేము. చెరసాలలో పుట్టిన శ్రీకృష్ణ పరమాత్మ, సంకెళ్లతో మన మనసును బంధించి ఆ బొమ్మని ఎంత ఖరీదైనదైనా కొని మన ఇంటికి తీసుకువెళ్లేలా చేస్తాడు. అది శ్రీకృష్ణ పరమాత్మ సమ్మోహనాస్త్రం. ఒక్కడే కాదు, పదహారు వేల...

సీతమ్మ అన్నదానం

ఉదయం పదకొండు గంటలు అయింది. ఆ నగరంలో ప్రముఖ కూడలి ఉన్న గుడి ముందు ఇద్దరు బిచ్చగాళ్లు కూర్చుని ఉన్నారు. ఇంతలో గుడి తలుపులు మూసేసి పూజారి గారు బయటకు వచ్చి, "ఏరా ఇంకా వెళ్ళలేదా?" అని అడిగారు. ఎందుకంటే ఉదయం–సాయంకాలం గుడిమెట్ల మీద ఆ ఇద్దరు బిచ్చగాళ్లు సుమారు ఇరవై సంవత్సరాల నుండి భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఉదయం–సాయంకాలం గుడి దగ్గర బిక్షాటన చేసుకుని, గుడి కట్టేసిన తర్వాత ఎదురుగా ఉన్న చెట్టు దగ్గర, రాత్రి పూట పక్కనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ మెట్ల మీద పడుకుంటారు. ఆ నగరంలో అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ వాళ్లు వేరే గుడి దగ్గరకు వెళ్లలేరు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ప్రమాదవశాత్తు కాళ్లు ఒక యాక్సిడెంట్‌లో పోయాయి. ఎవరో పుణ్యాత్ములు ఇచ్చిన మీద మూడు చక్రాల బండి వాళ్ళకి ఆధారం. పూజారి గారు అడిగిన ప్రశ్నకి "లేదండి" అంటూ సమాధానమిచ్చి, ఏదో నసుగుతూ కనబడ్డారు బిచ్చగాళ్లు. రోజు పదకొండు గంటలకే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ బిచ్చగాళ్లు. ఇవాళ ఇంకా ఎందుకు అక్కడ ఉన్నారని అప్పుడు తట్టింది పూజారి గారికి. విషయం అర్థమైంది రా! మీరు ఎవరి గురించి ఎదురు చూస్తున్నారో! ఆ అమ్మగారి గురించే కదా… అవునన్నట్లుగ...

నా జ్ఞాపకాల కాకినాడ

కాకినాడ మా ఊరండి. ఆ పేరు వినగానే మనసంతా ఏదో అయిపోతుంది. జగన్నాధపురం బ్రిడ్జి దాటగానే మన కాకినాడ పాత జ్ఞాపకాలు ఒక్కసారి సినిమా రీలులా గిర్రున తిరుగుతాయి. అప్పట్లో అలా ఉండేది. ఎప్పుడో విదేశీయులు కాకినాడ వచ్చి కోకల వ్యాపారం మొదలుపెట్టారుట. వ్యాపారం అంటే చీరలు అమ్మడం కాదు, చీరలు ఎగుమతి. చుట్టూ విశాలమైన బంగాళాఖాతం ఉండగా చేపలు పట్టడం మానేసి కాకినాడలో ఈ కోకల వ్యాపారం ఎందుకు ఎంచుకున్నారో ఆ విదేశీయులు డచ్ వారు. అప్పటినుంచి కాకి నందివాడ కోకనాడగా మారిపోయింది. ఇప్పటికీ రైల్వే డిపార్ట్మెంటు వారికి కోకనాడ పేరు మరచిపోలేదు. అది అలానే కంటిన్యూ అవుతోంది. ఆ విదేశీయుల నామకరణం వాడుకలో కాకినాడగా మారిపోయింది. కోకనాడ అతి పురాతన నగరం. తూర్పున బంగాళాఖాత సముద్రం ఓడరేవుగా మారి ఎగుమతలకు సహాయం చేస్తూ మధ్యలోని హోప్ ఐలాండ్ నగరాన్ని ముంపు నుండి కాపాడుతోంది. అందాల నగరం లోపల అందమైన రోడ్లు, మంచి మంచి పార్కులు, మంచి మంచి కాలేజీలు, మంచి స్కూల్స్ ఎన్ని ఉండేవో! అప్పట్లో కాలేజ్ అంటే గుర్తుకొచ్చేది పి.ఆర్. కాలేజ్ అండి. ఈ కాలేజీలో చదువుకుని ఎంతోమంది కలెక్టర్లు, డాక్టర్లు, నాయకులు, ఇంజనీర్లు, యాక్టర్లు అయిపోయారు. కాకినాడ ప్రజలు ...

ఆ అరుగు _ ఆత్మీయ నిలయం

పూర్వకాలంలో ప్రతి ఇంట్లో అరుగులు ఉండేవి. ఈ ఆధునిక యుగంలో అరుగులు కనుమరుగైపోయాయి. కానీ మా తరం వారికి అవి మాత్రం హంసతూలికా తల్పాలు. తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెంలో గల మా నాన్నగారి ఇంట్లో మెట్లుకి ఇరుపక్కల ద్వారపాలకులులా రెండు అరుగులు ఉండేవి. దానిని ఆనుకుని ఒక మెట్టు ఎత్తులో ఎర్రగచ్చుతో చేసిన వసార ఉంది. సుమారు 70 సంవత్సరాల క్రితం మా నాన్నగారు శ్రీ మధునాపంతుల వెంకట చలపతిరావుగారి చేత నిర్మించబడిన చారిత్రాత్మక కట్టడం అది. చారిత్రాత్మక కట్టడం అని ఎందుకు అంటున్నానంటే—ఎంతో మంది ఈ అరుగుమీద పుట్టిన ఆలోచనలను ఆచరణలో పెట్టి తమ తమ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగింది. మొదటి రోజుల్లో మా ఇంటి మెట్లకిఎడమ పక్కన ఉండే గదిలో (దాన్ని కొట్టు గది అంటాం) పంచాయతీ బోర్డు వారి ఆఫీస్ ఉండేది. మా పినతాతగారు శ్రీ మధునాపంతుల కామరాజుగారు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్‌గా పని చేసేవారు. నిత్యం ఎంతో మంది ప్రజలు ఆ ఆఫీస్‌కి వచ్చి అరుగు మీద కూర్చునేవారు. ఎప్పుడూ రెండు అరుగులమీద తాటాకులతో చేసిన చాపలు ఉండేవి. మా తాతగారికి సంఘసేవ మీద ఎక్కువ మక్కువ ఉండేది. ప్రజల సమస్యలను అలవోకగా తీర్చేవారు. అందుచేత ఆయన హయాంలో ...

కెమెరా వెలుగులో పెళ్లి

మగ పెళ్లి వారి కారులు అందమైన అలంకరణతో కళ్యాణమండపం ముందు ఆగాయి. ముందు సీట్లో కూర్చున్న పెళ్ళికొడుకు, వెనకాల సీట్లో తల్లి తండ్రి, ఇలా మిగతా కార్లలో మిగిలిన పెళ్లి వారు దిగారు. ఆడపిల్ల వారు స్వాగతం పలకడానికి మేళతాళాలతో ముందుకు కదలి వచ్చారు. అందరికంటే ముందుగా నలుగురు వీడియో వాళ్ళు, కెమెరా వాళ్ళు అక్కడికి చేరుకుని పెళ్ళికొడుకు దగ్గరికి పరిగెత్తారు. "సార్ రవి గారు కార్ డోర్ పట్టుకుని ఫోజు ఇవ్వండి" అంటూ పెళ్లి కూతురు తండ్రి రవికి సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు. డోర్ పట్టుకుని ఒకటి, పెళ్ళికొడుకు చేతులు పట్టుకుని ఒకటి – రెండు స్నాప్స్ అయిపోయాయి. ఇంక కాళ్లు కడిగే కార్యక్రమం. సూటు బూటు వేసుకున్న పెళ్ళికొడుకు బూటు విప్పకుండా, కాలికి వేసుకున్న బూట్లను తడిచేత్తోటి తుడిపించారు పెళ్లికూతురు తండ్రి చేత. "రవి గారు ఆ బూట్ల మీద చేయి వేయండి" – ఒక కెమెరా క్లిక్ మంది. "రెడీ వన్ టూ త్రీ... రవి గారు దండ పట్టుకుని ఇలా చూడండి. పెళ్ళికొడుకు గారు మీరు క్రాస్ గా నిలబడండి" అంటూ సూచనలిస్తూ హడావుడిగా ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి వీడియో-ఫోటో వాళ్ళు పరిగెత్తుతున్నారు. అసలే ...

సతులాల చూడరే

 సతులారా చూడరే   సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమిl   సకలాయ నడిరేయ కలిగే శ్రీకృష్ణుడు  అంటూ అన్నమయ్య తన కీర్తనల్లో శ్రీకృష్ణుడి పుట్టుక గురించి స్తుతించారు. శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి పరమాత్మ జన్మించాడు. అదే మనకి శ్రీ కృష్ణాష్టమి. చెరసాలలో దేవకి వసుదేవుల కుమారుడుగా జన్మించి రేపల్లెలో నందుని ఇంటిలో యశోదమ్మ ఒడిలో పెరిగి నంద కుమారుడుగా చలామణి అయ్యాడు ఈ కీర్తనలో పసిపాపగా ఉన్న పరమాత్ముడు ఏ రకంగా ఉన్నాడో మనకి కళ్ళకు కట్టినట్టు చెబుతాడు అన్నమయ్య. సాధారణంగా పసిపిల్లలు పుట్టినప్పుడు కళ్ళు మూసుకుని గుప్పెట్లు మూసుకుని నిద్రలో గడుపుతారు. అయితే ఇక్కడ పుట్టింది సాక్షాత్తు పరమాత్మ.  ఆయన చతుర్భుజాలు శంకు చక్రాలు ఒంటినిండా సకల ఆభరణాలు ,తల మీద కిరీటం ధరించి పుట్టాడుట మహానుభావుడు. వాగ్గేయ కారులంతా కారణజన్ములు. లేదంటే పసిపాపడగా ఉన్న పరమాత్మ ని ఇలా వర్ణించడం సాధ్యం కాదు. ఆదిశేషుడు అవతారమైన బలరాముడు రోహిణి దేవి కడుపున పుట్టిన తర్వాత బ్రహ్మదేవుడు శివుడు నారదుడి లాంటి మునులు దేవతలు దేవకీదేవి బంధించబడిన కారాగారం వద్దకు వచ్చి పరమాత్మా!దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అనేక అవతా...

చినుకులో సాయం

నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా రెండు రోజులు స్కూళ్లు, కాలేజీలన్నిటికీ సెలవులు ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి తిరగవద్దు అనే వార్తలు విని పిల్లలు ఎగిరి గంతేశారు. వాళ్లకేం తెలుసు పాపం! నగరంలోని పరిస్థితి. గుమ్మం బయట కాలు పెట్టకపోతే ఎవరికీ బ్రతుకు జీవనం గడవదు. అందులో ఈ ఏడాది మరీ ఎక్కువగా కురుస్తున్నాయి వర్షాలు. దానికి తోడు ట్రాఫిక్ జాము, వర్షపు నీరు ఎక్కడికి కదులకుండా ఉండిపోవడం. రోడ్డుమీద ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియట్లేదు. ఆఫీసుకి వెళ్లి రావడం అంటే తల ప్రాణం తోక వచ్చినట్టే ఉంది. “ఎలాగురా బాబు, ఈ వర్షంలో సెలవు పెట్టమంటే బాసు ఊరుకోడు” అనుకుని బాధపడుతూ, రైన్‌కోట్ వేసుకుని బయలుదేరబోతుంటే, గుమ్మం దగ్గర ఆటో ఆగిన శబ్ధం వినిపించింది. “ఎవరబ్బా ఈ వర్షంలో?” అనుకుంటూ బయటికి వెళ్లాడు. ఆటో డ్రైవర్ రాజు నమస్కారం చేసి, “ఇవాళ సెలవు కదా సార్?” అని అడిగాడు. “సెలవే రాజూ, మరి బేరాలు ఏమీ లేవా?” అని రామారావు. “లేదు సార్… ఇంటిదగ్గర కష్టంగా ఉంది,” అంటూ చేతులు నులిపాడు రాజు. రామారావుకి విషయం అర్థమైంది. ప్రతినెల ఒకటో తారీకు రాకుండానే జీతం మధ్యలో పట్టుకెళ్తుంటాడు. అలాంటిది, ఈ వర...

లక్ష్మి దేవి పుట్టుక

అది త్రేతాయుగ కాలం. స్వర్గలోకం సంతోషాల తోటలా మెరిసిపోతూ ఉండేది. కానీ ఒక్కరోజు, ఋషుల శాపంతో దేవతల శక్తి క్షీణించింది. ఇంద్రుని వజ్రాయుధం బలహీనమైంది, వరుణుని జలప్రవాహం మందగించింది, వాయువుని వేగం తగ్గిపోయింది. ఇదే సమయం చూసుకుని అసురులు, దైత్యులు, లోకాలను కబళించడం మొదలుపెట్టారు. దేవతలు భయంతో విష్ణుమూర్తిని ఆశ్రయించారు. "ప్రభూ! మా శక్తి తగ్గిపోయింది, దైత్యులు మమ్మల్ని జయిస్తున్నారు. మాకు రక్షణ కల్పించండి" అని ప్రార్థించారు. విష్ణువు చిరునవ్వుతో అన్నాడు – "క్షీరసాగరంలో దాగి ఉన్న అమృతమే మీ శక్తిని తిరిగి ఇస్తుంది. దానిని సముద్ర మథనం చేసి తీసుకురండి. కానీ దైత్యుల సహాయం అవసరం ఉంటుంది. మీరు వారితో ఒప్పందం చేసుకోండి. మిగతా యోచన నేను చేస్తాను." క్షీరసాగర మథనం  దేవతలు, దైత్యులు కలసి మందరపర్వతాన్ని మథనదండంగా ఎత్తుకొచ్చారు. కానీ సముద్ర మధ్యలో ఉంచగానే అది మునుగుతూనే ఉంది. అప్పుడు విష్ణువు కూర్మావతారం తీసుకొని పర్వతాన్ని తన వెన్నుపైన మోశాడు. వాసుకి నాగరాజు మథనతాడుగా ముందుకొచ్చాడు. దైత్యులు వాసుకి తలవైపున, దేవతలు వాలువైపున పట్టుకున్నారు. మథనం మొదలయ్యింది. మొదటి ఫలితం – హలాహల విషం వాస...

శ్రీకృష్ణ నిర్యాణం

కౌరవులకి పాండవులకి మధ్య కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మరాజు రాజ్యపాలన సాగించడం మొదలుపెట్టాడు. దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం అవతారం ఎత్తిన మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ చిన్నతనం నుండి అనేక మంది రాక్షసులని సంహరించాడు. ఆ దుష్ట శిక్షణ చూసి అనేకమంది మునీశ్వరులు సంతోషించారు. కంసుడు వంటి రాక్షసులను సంహరించి భూభారం తగ్గించి శ్రీకృష్ణ పరమాత్మ ప్రసిద్ధుడయ్యాడు.  అదే సమయంలో యాదవ సైన్యం విజృంభించి భూమి మోయలేని స్థితికి వచ్చింది. శ్రీకృష్ణ భక్తులైన యాదవులకు బుద్ధి చెప్పడానికి పరమాత్మ ఆలోచనలో పడ్డాడు. అదే సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ చూడ్డానికి విశ్వామిత్రుడు దూర్వాసుడు మొదలగు ఋషులు ద్వారకా నగరానికి వస్తారు. అలా వచ్చిన మునులకు సకల మర్యాదలు చేసి బంగారు ఆసనం పై కూర్చోబెడతాడు. తర్వాత పరమాత్ముని అనేక విధాలుగా స్తుతిస్తూ కొనియాడతారు.అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తాడు. మీ పాదపద్మ సందర్శనార్థం వచ్చాం మా కోరిక తీరింది ఇక సెలవు అంటూ ద్వారక సమీపంలోని పిండారకతీర్థం సందర్శించడానికి బయలుదేరుతారు. అక్కడ కొంతమంది యాదవ బాలురు మదమెక్కి శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడైన సాంబుడికి అ...