పోస్ట్‌లు

నా జ్ఞాపకాల కాకినాడ

కాకినాడ మా ఊరండి. ఆ పేరు వినగానే మనసంతా ఏదో అయిపోతుంది. జగన్నాధపురం బ్రిడ్జి దాటగానే మన కాకినాడ పాత జ్ఞాపకాలు ఒక్కసారి సినిమా రీలులా గిర్రున తిరుగుతాయి. అప్పట్లో అలా ఉండేది. ఎప్పుడో విదేశీయులు కాకినాడ వచ్చి కోకల వ్యాపారం మొదలుపెట్టారుట. వ్యాపారం అంటే చీరలు అమ్మడం కాదు, చీరలు ఎగుమతి. చుట్టూ విశాలమైన బంగాళాఖాతం ఉండగా చేపలు పట్టడం మానేసి కాకినాడలో ఈ కోకల వ్యాపారం ఎందుకు ఎంచుకున్నారో ఆ విదేశీయులు డచ్ వారు. అప్పటినుంచి కాకి నందివాడ కోకనాడగా మారిపోయింది. ఇప్పటికీ రైల్వే డిపార్ట్మెంటు వారికి కోకనాడ పేరు మరచిపోలేదు. అది అలానే కంటిన్యూ అవుతోంది. ఆ విదేశీయుల నామకరణం వాడుకలో కాకినాడగా మారిపోయింది. కోకనాడ అతి పురాతన నగరం. తూర్పున బంగాళాఖాత సముద్రం ఓడరేవుగా మారి ఎగుమతలకు సహాయం చేస్తూ మధ్యలోని హోప్ ఐలాండ్ నగరాన్ని ముంపు నుండి కాపాడుతోంది. అందాల నగరం లోపల అందమైన రోడ్లు, మంచి మంచి పార్కులు, మంచి మంచి కాలేజీలు, మంచి స్కూల్స్ ఎన్ని ఉండేవో! అప్పట్లో కాలేజ్ అంటే గుర్తుకొచ్చేది పి.ఆర్. కాలేజ్ అండి. ఈ కాలేజీలో చదువుకుని ఎంతోమంది కలెక్టర్లు, డాక్టర్లు, నాయకులు, ఇంజనీర్లు, యాక్టర్లు అయిపోయారు. కాకినాడ ప్రజలు ...

ఆ అరుగు _ ఆత్మీయ నిలయం

పూర్వకాలంలో ప్రతి ఇంట్లో అరుగులు ఉండేవి. ఈ ఆధునిక యుగంలో అరుగులు కనుమరుగైపోయాయి. కానీ మా తరం వారికి అవి మాత్రం హంసతూలికా తల్పాలు. తూర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెంలో గల మా నాన్నగారి ఇంట్లో మెట్లుకి ఇరుపక్కల ద్వారపాలకులులా రెండు అరుగులు ఉండేవి. దానిని ఆనుకుని ఒక మెట్టు ఎత్తులో ఎర్రగచ్చుతో చేసిన వసార ఉంది. సుమారు 70 సంవత్సరాల క్రితం మా నాన్నగారు శ్రీ మధునాపంతుల వెంకట చలపతిరావుగారి చేత నిర్మించబడిన చారిత్రాత్మక కట్టడం అది. చారిత్రాత్మక కట్టడం అని ఎందుకు అంటున్నానంటే—ఎంతో మంది ఈ అరుగుమీద పుట్టిన ఆలోచనలను ఆచరణలో పెట్టి తమ తమ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగింది. మొదటి రోజుల్లో మా ఇంటి మెట్లకిఎడమ పక్కన ఉండే గదిలో (దాన్ని కొట్టు గది అంటాం) పంచాయతీ బోర్డు వారి ఆఫీస్ ఉండేది. మా పినతాతగారు శ్రీ మధునాపంతుల కామరాజుగారు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్‌గా పని చేసేవారు. నిత్యం ఎంతో మంది ప్రజలు ఆ ఆఫీస్‌కి వచ్చి అరుగు మీద కూర్చునేవారు. ఎప్పుడూ రెండు అరుగులమీద తాటాకులతో చేసిన చాపలు ఉండేవి. మా తాతగారికి సంఘసేవ మీద ఎక్కువ మక్కువ ఉండేది. ప్రజల సమస్యలను అలవోకగా తీర్చేవారు. అందుచేత ఆయన హయాంలో ...

కెమెరా వెలుగులో పెళ్లి

మగ పెళ్లి వారి కారులు అందమైన అలంకరణతో కళ్యాణమండపం ముందు ఆగాయి. ముందు సీట్లో కూర్చున్న పెళ్ళికొడుకు, వెనకాల సీట్లో తల్లి తండ్రి, ఇలా మిగతా కార్లలో మిగిలిన పెళ్లి వారు దిగారు. ఆడపిల్ల వారు స్వాగతం పలకడానికి మేళతాళాలతో ముందుకు కదలి వచ్చారు. అందరికంటే ముందుగా నలుగురు వీడియో వాళ్ళు, కెమెరా వాళ్ళు అక్కడికి చేరుకుని పెళ్ళికొడుకు దగ్గరికి పరిగెత్తారు. "సార్ రవి గారు కార్ డోర్ పట్టుకుని ఫోజు ఇవ్వండి" అంటూ పెళ్లి కూతురు తండ్రి రవికి సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు. డోర్ పట్టుకుని ఒకటి, పెళ్ళికొడుకు చేతులు పట్టుకుని ఒకటి – రెండు స్నాప్స్ అయిపోయాయి. ఇంక కాళ్లు కడిగే కార్యక్రమం. సూటు బూటు వేసుకున్న పెళ్ళికొడుకు బూటు విప్పకుండా, కాలికి వేసుకున్న బూట్లను తడిచేత్తోటి తుడిపించారు పెళ్లికూతురు తండ్రి చేత. "రవి గారు ఆ బూట్ల మీద చేయి వేయండి" – ఒక కెమెరా క్లిక్ మంది. "రెడీ వన్ టూ త్రీ... రవి గారు దండ పట్టుకుని ఇలా చూడండి. పెళ్ళికొడుకు గారు మీరు క్రాస్ గా నిలబడండి" అంటూ సూచనలిస్తూ హడావుడిగా ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి వీడియో-ఫోటో వాళ్ళు పరిగెత్తుతున్నారు. అసలే ...