పోస్ట్‌లు

మన జాగ్రత్తలో మనం

ఉదయం ఎనిమిది గంటలు అయింది. హాలులో కూర్చుని రామాయణం చదువుకుంటున్న కాంతమ్మగారిని చూసి కోడలు సరోజ, “అత్తయ్య, మరో కప్పు కాఫీ ఇయ్యమంటారా?” అని అడిగింది. “లేదమ్మా, వద్దు. ఇదిగో ఇది అయిన తర్వాత టిఫిన్ తినేస్తాను.” “అది అప్పుడే ఎక్కడ అవుతుంది? ప్రతిరోజు పది గంటల వరకు చదువుకుంటున్నారు. అంతసేపు ఉంటే మీకు నీరసం వస్తుంది,” అని అంది సరోజ. “పరవాలేదు,” అని సమాధానం చెప్పి మళ్లీ రామాయణం చదువుకోవడంలో మునిగిపోయింది కాంతమ్మ. “నువ్వు టిఫిన్ తినేసేయ్. నా గురించి చూడకు,” అంది. ‘అదేమిటి! ఉదయం లేస్తూనే కాఫీ కోసం విలవిల్లాడే ఈ కాంతమ్మ ఈ మధ్య ఇలా తయారవుతోంది ఏమిటి? ఆరోగ్యం ఏమైనా బాగోలేదా? ఏమీ చెప్పదు…’ అని మనసులో అనుకుంది సరోజ. సరోజ పని అంతా పూర్తి చేసుకుని టిఫిన్ చేసి వచ్చేటప్పటికి కాంతమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంది. “మీకు ఇష్టమని పెసరట్లు వేశాను. అల్లం పచ్చడి కూడా చేశాను,” అని చెప్పినా, మొహంలో ఎలాంటి ఉత్సాహం చూపలేదు కాంతమ్మ. ప్లేట్లో పెట్టిన రెండు పెసరట్లు తిని, చేయి కడిగేసుకుంది. ఎప్పుడూ “నోరు బాగాలేదు… ఏదో ఒక పచ్చడి చెయ్యి” అంటూ చెప్పే కాంతమ్మ, మధ్యాహ్నం భోజనం కూడా ఏమి మాట్లాడకుండా తినేసింది. మొన...

మాటలు రాని స్నేహితుడు

అదొక అందమైన సుందర నగరం. ఒకప్పుడు పదవీ విరమణ చేసిన వాళ్లు, “శేష జీవితం ఇక్కడే గడపాలి రా!” అని అనుకునే వాళ్లు. అంత సౌకర్యవంతమైన నగరం అది. ఆ నగరంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రదేశంలో మా నివాసం. అప్పుడు అది అక్కడక్కడ ఇళ్లు ఉన్న ప్రదేశం. అయితే ఇల్లు దూరంగా ఉన్నా ఇరుగుపొరుగు వాళ్లు కలిసిమెలిసి ఉండేవారు. ఏ అవసరం వచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకునే మనస్తత్వం కలవారు. అలాంటి ప్రదేశంలో ఉండడం నాకు భయంగా ఉండేది కాదు. జీవితంలో ఎంతో మంది స్నేహితులు ఉంటారు. అమ్మ ఒడిలో ఉన్నప్పుడు అమ్మే పెద్ద స్నేహితురాలు. బడికి వెళ్ళినప్పుడు ఎంతోమంది స్నేహితులు కలుస్తారు. ఆ చిన్న చిన్న స్నేహాల్లోనే మన బాల్యం నవ్వుతుంది. కానీ బడి దాటిన తర్వాత కొన్ని స్నేహాలు కనుమరుగైపోతాయి. కాలం గడుస్తుంటే కొందరు దూరమవుతారు. కళాశాల దాకా కూడా కొనసాగే స్నేహాలు మరికొన్ని. అక్కడ కూడా కొత్త స్నేహాలు కలుస్తాయి. అలా జీవిత ప్రయాణంలో స్నేహాలు మారుతుంటాయి. కానీ కొన్ని స్నేహాలు మాత్రం మనసులో చెక్కుచెదరకుండా నిలిచిపోతాయి. అలాంటి ఊర్లో ఆ అపురూపమైన వీధి నుంచి మెయిన్ రోడ్డు వరకు రావాలంటే ఒక కిలోమీటర్ దూరం నడవాలి. ఆ దారిలో నాకు ఒక ముఖ్యమైన స్నేహ...

సంధ్యా రాగం

“ఒసేయ్ రమ్య, ఒసేయ్ సంధ్య … వచ్చే నెలలోనే నాన్న రిటైర్మెంట్,” అంది రమ్య, సంధ్యల తల్లి సరస్వతి. “అవునమ్మా! మొన్ననే కదా చెప్పావు. నాన్నకు అరవై ఏళ్లు నిండుతున్నాయని వెటకారం కూడా ఆడావు. అయినా ఇప్పటికి ఐదు సార్లు నుంచి ఇదే మాట చెబుతున్నావ్!” అంది రమ్య నవ్వుతూ. రమ్య తండ్రి భాస్కరరావు ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ చేరదీసి పెంచి, చదువు చెప్పించి, పెళ్లి కూడా చేశాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా, “బిడ్డ చదివితే భవిష్యత్తు వెలుగుతుంది” అనే నమ్మకంతో మేనమామ పడిన కష్టం భాస్కరరావు జీవితానికి బలమైన పునాది అయింది. అందుకే చిన్ననాట అతనికి ముద్దు ముచ్చట్లు, పుట్టినరోజు సరదాలు తెలియనే తెలియలేదు. పెళ్లైన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. పిల్లల పుట్టినరోజులు ఎంత ఘనంగా జరిపేదో, అంతే ప్రేమతో భర్త పుట్టినరోజును కూడా పండుగలా మార్చేది సరస్వతి. పొదుపు అతని అలవాటు, సంతోషం ఆమె స్వభావం—ఆ రెండు కలిసి ఆ ఇంటిని సంతోషంగా నిలబెట్టాయి. తెలుగు ఉపాధ్యాయుడిగా జీవితాన్ని అక్షరాలకు అంకితం చేస్తూ, సంసారాన్ని జాగ్రత్తగా నడిపిస్తూ, పిల్లలిద్...

కోపం

ఒక రోజు ఒక మనిషి బుద్ధుడి దగ్గరకు వచ్చి కోపంతో తిట్టడం ప్రారంభించాడు. అతను చాలా సేపు దూషణలు చేశాడు. బుద్ధుడు మాత్రం ప్రశాంతంగా విన్నాడు. తర్వాత బుద్ధుడు అడిగాడు: “ఒకవేళ ఎవరో ఒకరికి బహుమతి ఇచ్చారు అనుకోండి. అది వారు తీసుకోకపోతే ఆ బహుమతి ఎవరిదిగా ఉంటుంది?” ఆ మనిషి చెప్పాడు: “ఇచ్చినవారిదే.” అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో అన్నాడు: “అలాగే నేను నీ కోపాన్ని స్వీకరించలేదు. అది ఇంకా నీదే.” బోధ: కోపం తీసుకోకపోతే అది మనకు హాని చేయదు.

మైదానంలో మహోత్సాహం

ఆటగాళ్లు మైదానంలో స్వైర విహారమాడగా, బంతి గగనమందు పక్షిలా విహరించె. సిక్సుల సుడిగాలి మైదానమున వీచగా, ప్రేక్షక హృదయములో హర్షధ్వని పొంగె. ఫోర్ల మెరుపులు కళ్ల ముందర మెరవగా, పరుగుల ప్రవాహము స్కోరుబోర్డును నింపె. బౌలర్ల బాణములు వికెట్లు నేలకొరిగె, ప్రత్యర్థి ఆశలు మెల్లగా కరిగె. చివరికి ఆ రేయి జయధ్వని మార్మోగె, భారత జట్టు కీర్తి గగనమున ఎగిసె. — రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు కాకినాడ 9491792279

ఆ ఊరు

 ఆ ఊరు మన జీవన యాత్రలో ఎన్నో ఊర్లు తిరుగుతూ ఉంటాం. పుట్టినఊరు , చదువు కోసం వెళ్ళిన ఊరు, పొట్ట చేత పట్టుకుని తిరిగే ఊరు, అత్తవారి ఊరు అందులో ముఖ్యమైనవి.  పుట్టిన ఊరు స్వర్గంతో సమానం అంటారు. మనం పుట్టిన ఊరు తలుచుకున్నప్పుడల్లా నవమాసాలు మోసి కని పెంచిన తల్లిదండ్రులు, గడిచిపోయిన బాల్య మధుర స్మృతులు, బంధువులు, స్నేహితులు గుర్తుకు వస్తూనే ఉంటారు. అది సహజమే. పుట్టినప్పటినుంచి ఆ గాలి ఆ నీరు ఆ వాతావరణం ఆ మనుషులు తో మమేకమై కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి. అక్కడ ఉండేది కొద్ది రోజులే కానీ మన జీవితం ఆ కాలేజీ , స్నేహితుల మధ్య తిరుగుతుంది. జీవితంలో ఆ ఊరి పేరు తలుచుకున్నప్పుడల్లా మన విద్యార్థి జీవితం గుర్తుకొస్తుంది. మరి ఉపాధి కోసం మనం వెళ్లిన ఊర్లు జీవితంలో చాలా మధుర జ్ఞాపకాలు మిగులుస్తాయి. కష్టాలు కూడా ఉంటాయి లెండి.ముఖ్యంగా కొన్ని వృత్తుల వాళ్ళు అంటే అక్కడ ఉండే ప్రజలతో సంబంధం ఉండే ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రజలతో అనుబంధం పెరుగుతుంది. ఉదాహరణకి గవర్నమెంట్ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు వీరికి నిత్యం అక్కడ ఉండే ప్రజల తోటే మమేకమై పని చేస్తుంటారు.  కానీ మన జీవన సమరంలో మనకి మధ...

జానకమ్మ

ఇల్లంతా పెళ్లి సందడితో హడావుడిగా ఉంది. పందిట్లో సన్నాయి మోగుతోంది. పెరడంతా పందిళ్లతో, పందిళ్లు తోరణాలతో మెరిసిపోతున్నాయి. బంధువులు ఒక్కొక్కరు రావడం మొదలైంది. వచ్చిన బంధువుల్ని, స్నేహితుల్ని ఒక నలభై ఐదు ఏళ్ల స్త్రీ, “రండి… రండి…” అని ఆప్యాయంగా పలకరిస్తూ టిఫిన్ టేబుళ్ల ముందు కూర్చోబెట్టింది. వడ్డన ప్రారంభమైంది. “ఇదిగో ఇంకొక ఇడ్లీ వేసుకోండి… మరో వడ వేసుకోండి… మా ఇందుపల్లి వాళ్ల వంటలు చాలా బాగుంటాయి…” అంటూ కొసరి కొసరి వడ్డిస్తూ హడావుడిగా అటూ ఇటూ తిరుగుతోంది. ఇంతలో ఎవరో, “బీరువా తాళాలు ఎక్కడ పెట్టావ్, జానకమ్మ?” అని గట్టిగా అరిస్తుంటే,“ఇదిగో… మీరు పారేస్తారని నేను పట్టుకుని తిరుగుతున్నాను,” అంటూ తాళాలు అందించి మళ్లీ టేబుల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అందరూ టిఫిన్లు పూర్తి చేయడంతో,“టిఫిన్లు పూర్తయ్యాయి… కాఫీలు ఇవ్వండి,” అంటూ వంట బ్రాహ్మణులకు ఆజ్ఞలు జారీ చేసింది.కాఫీలు తాగిన తర్వాత, “ఎదురింటి కరణం గారింట్లో మీ అందరికీ బస ఏర్పాటు చేశాం. అక్కడికి వెళ్దాం, పదండి. మీ సామానంతా మా వాళ్లు తీసుకువస్తారు,” అంటూ ముందుకు దారి తీసింది. అప్పటికే అక్కడ హాలంతా పరుపులు పరిచి ఉన్నాయి. హాలులో ఒక మూల పెద్ద...

పేరు

వాడు ఎవరు? సమాధానం ఏం చెబుతాము? వాళ్ల అమ్మా నాన్నల పేరు చెప్పి “వాళ్ల కొడుకు” అంటాము. అక్క పేరు చెప్పి “దాని తమ్ముడు” అంటాము. నిన్న మొన్నటి వరకు అమ్మ కడుపులో విహారం చేసి భూమ్మీదకి వచ్చి మూడు నెలలు అయింది. ఇవాళ్టి నుంచి వాడికో పేరు ఉంది. నిన్నటి వరకు ఏదో నోటికి వచ్చిన ముద్దుపేరుతో వాడిని పిలిచేవాళ్లం. ఇప్పుడు ఆ బాధ లేదు. పేరు పెట్టుకున్నాడు కాబట్టి సర్కారు వారు గుర్తింపు పత్రం కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ముద్దు పేరుతో పిలిస్తే వాళ్ల అమ్మ ఊరుకోదు. ఎంతో కష్టపడి వాళ్ల అమ్మానాన్న ఈ పేరు నిర్ణయించారు. పేరు నిర్ణయించడానికి ఎన్నో ఆలోచించాలి. ఆకాశంలో మెరిసే తారలను, గతించిపోయిన తరాలను కలుపుకోవాలి. ఇలవేల్పులను, ఇష్టదైవాలను మర్చిపోకూడదు. చివరలో ఎవరు పెట్టని పేరు ఉండాలి. అవి కదా నిబంధనలు! ఈ నిబంధనల చట్రంలో గిరగిరా ఎన్నో రాత్రులు తిరిగి అలసిపోయి, ఒక పేరుకు ఓట్లు వేసి, ఆ పేరు మనసులో మననం చేసుకుంటూ ఆ శుభముహూర్తం కోసం ఎదురు చూశారు వాడి తల్లిదండ్రులు. పేపర్ ఎక్కడా లీక్ అవ్వలేదు. అంత పగడ్బందీగా పబ్లిక్ పరీక్షల్లాగా ఏర్పాట్లు చేసుకున్నారు. అవును, పేపర్ లీక్ అయితే మజా ఏముంటుంది! పెళ్లి చూపుల్లో...

సూత్రధారి

నీ లీలారంగంలో పాత్రనై పుట్టాను, నీ కరుణాకటాక్షంలో శరణాగతినై నిలిచాను, నీ పాదపద్మాల చెంత విశ్రాంతినై లీనమయ్యాను. నేను నీ సంకల్పసూత్రాలకు కట్టుబడిన కీలుబొమ్మను; తెరపై తెల్లవారుజామునే నాట్యం ఆరంభింపజేసేది నీవే, తెరదించి నాటకసమాప్తి ఘడియను నిర్ణయించేది నువ్వే. తెరపై నటనకు “మహానటుడు” అనే మహిమాబిరుదులు నీవే ప్రసాదిస్తావు, ఆ బిరుదుల మత్తులో నేను ఉప్పొంగి ఉరకలేస్తాను; పాత్రపరిసమాప్తి వేళ మెడలో పూలహారాలు వేయిస్తావు, ఆ హారాల పరిమళంలో కూడా నీ చిత్తమే దాగి ఉంటుంది. నేను క్షణిక పాత్రధారిని — నీవు శాశ్వత సూత్రధారివి నేను నటనలో నిమగ్నుడను  నీవు లీలలో పరిపూర్ణుడవు. నా ఆరంభం నీ సంకల్పం, నా ముగింపు నీ మౌనం. నటించిన ప్రతి క్షణమూ నీకర్పణం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279

పిచ్చుక _ పల్లె జ్ఞాపకo

ప్రకృతి అందాలకు పుట్టినిల్లు మన పల్లెటూళ్లు. అనుబంధం, ఆప్యాయతలతో నిండిన మనుషుల మధ్య, మాటరాని మూగజీవాల సాన్నిధ్యంలో మనిషి ప్రశాంతమైన జీవితం గడపగలిగే ప్రదేశం పల్లెటూరు. అక్కడ జీవితం కృత్రిమం కాదు — సహజం. ప్రతి ఉదయం ఒక కొత్త ఉత్సాహంతో మొదలవుతుంది. గంప కింద కూస్తున్న కోడి తెల్లవారిందని సంకేతం ఇస్తుంది. పాకలోని లేగదూడ అరుపు మన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఆకాశంలో విహరించే పక్షులు, చెట్టు మీద “కుహూ కుహూ”మని ఆలపించే కోయిల, చుట్టూ నీడనిచ్చే చెట్లు — ఇవన్నీ కలిసి జీవన సంగీతాన్ని సృష్టిస్తాయి. గలగల పారే గోదావరి ప్రవాహం మనసుకు నెమ్మదిని ఇస్తుంది. తూర్పున ఉదయించే బాలభానుడు భూమిని బంగారు వెలుగులతో నింపుతాడు. ఈ సృష్టిలోని ప్రతి జీవరాశి మధ్య మనిషి సహజంగా మమేకమై ఆనందంగా జీవిస్తాడు.  ఇలాంటి వాతావరణం కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కొనలేం. ప్రకృతి అంటే కొనుగోలు చేయలేనిది, నిర్మించలేనిది — అది సహజ సిద్ధమైన వరం. దానిని ఆస్వాదించడమే మన అదృష్టం. అలాంటి మన ఊరిలో, మన ఇంటి చూరులో, ఇంటి ముందు ఉన్న తాటాకు పందిరిలో, పచ్చటి చెట్టు కొమ్మమీద గూడు కట్టుకుని నిత్యం “కిచకిచ”మని శబ్దం చేస్తూ, గోధుమరంగులో మెరిసిపోతూ నేలపై ఉ...

నిశ్శబ్ద వీరుడు

  నీ గెలుపుకోసం   ఎన్నోసార్లు నేనే ఓడిపోయాను —   మన సంసార సమరంలో   బాధ్యతగల భర్తగా నిలిచాను. కన్నబిడ్డల కలలన్నీ   నా భుజాలపై మోసుకుంటూ,   నాన్నగా నా జీవితాన్ని   నిశ్శబ్ద త్యాగంగా మార్చుకున్నాను. కుర్చీకి అతుక్కుపోయిన రోజులు,   పని గంటలు మరిచిన రాత్రులు,   రక్తపోటు పెరిగినా   కుటుంబ సంతోషమే ఔషధమైంది. ఎవరూ చప్పట్లు కొట్టలేదు, ఎవరూ గాథలు రాయలేదు; అయినా ప్రతి ఇటుకలో నా చెమట ఉంది, ఈ ఇంటి ప్రతి వెలుగులో నా శ్వాస ఉంది. ఇంతకీ నేనెవరు? పేరులేని త్యాగాల మధ్య నిశ్శబ్దంగా జీవించే వాడిని కాదు — తుఫాన్లను ఆపే తీరం, చీకట్లను తట్టుకునే దీపస్తంభం, కూలిపోకుండా కుటుంబాన్ని నిలబెట్టే అదృశ్య బలాన్ని. నేను సగటు మగవాడిని కాదు… ప్రేమను బాధ్యతగా మోసే ఒక నిశ్శబ్ద వీరుడిని రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279

అరుగు

అరుగు ఇంటికి అందం, యజమానికి ఆనందం, యజమాని కంటే ముందే అతిథి గౌరవం. ఇంటి గౌరవం కాపాడే మౌన బంధం, అడుగుపెట్టగానే మనసు నిండే అనుబంధం. రాజు కూర్చుంటే అది సింహాసనం, పసిబిడ్డకు అది ఆటస్థలం. పండు ముదుసలికి విశ్రాంతి మందిరం, ఉబుసుపోక కూర్చుంటే బోలెడు కాలక్షేపం. రామాయణం, లోకాభిరామాయణం తరతరాలుగా వింటూనే ఉంది; నవ్వుల ప్రతిధ్వనులు, కన్నీటి చరిత్రలు నిశ్శబ్దంగా తనలో దాచుకుంది. గడిచిన కాలానికి గడియారం కాదు అది— జ్ఞాపకాలను కాపాడే నిలువెత్తు గ్రంథం. వచ్చినవారిని ఆహ్వానించి, వెళ్లినవారు గుర్తుంచుకునే  మనసులను మోసే మట్టి పలక . కాలం మారినా కదలని సాక్ష్యం, మనుషులు మారినా తగ్గని ఆత్మీయత. అడుగుల రాకపోకలే దీని శ్వాస అయితే, అరుగు అంటే… ఇంటి ముందు నిలిచిన జీవితం. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు  కాకినాడ 9491792279

సంధ్యా రాగం

“ఒసేయ్ రమ్య, ఒసేయ్ సంధ్య … వచ్చే నెలలోనే నాన్న రిటైర్మెంట్,” అంది రమ్య, సంధ్యల తల్లి సరస్వతి. “అవునమ్మా! మొన్ననే కదా చెప్పావు. నాన్నకు అరవై ఏళ్లు నిండుతున్నాయని వెటకారం కూడా ఆడావు. అయినా ఇప్పటికి ఐదు సార్లు నుంచి ఇదే మాట చెబుతున్నావ్!” అంది రమ్య నవ్వుతూ. రమ్య తండ్రి భాస్కరరావు ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ చేరదీసి పెంచి, చదువు చెప్పించి, పెళ్లి కూడా చేశాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా, “బిడ్డ చదివితే భవిష్యత్తు వెలుగుతుంది” అనే నమ్మకంతో మేనమామ పడిన కష్టం భాస్కరరావు జీవితానికి బలమైన పునాది అయింది. అందుకే చిన్ననాట అతనికి ముద్దు ముచ్చట్లు, పుట్టినరోజు సరదాలు తెలియనే తెలియలేదు. పెళ్లైన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. పిల్లల పుట్టినరోజులు ఎంత ఘనంగా జరిపేదో, అంతే ప్రేమతో భర్త పుట్టినరోజును కూడా పండుగలా మార్చేది సరస్వతి. పొదుపు అతని అలవాటు, సంతోషం ఆమె స్వభావం—ఆ రెండు కలిసి ఆ ఇంటిని సంతోషంగా నిలబెట్టాయి. తెలుగు ఉపాధ్యాయుడిగా జీవితాన్ని అక్షరాలకు అంకితం చేస్తూ, సంసారాన్ని జాగ్రత్తగా నడిపిస్తూ, పిల్లలిద్...

రుచిలో రారాజు _అతిధి మర్యాదలో మహారాజు

అల్లుడు గుమ్మంలోకి అడుగుపెట్టాడో లేదో, ఆ క్షణమే మర్యాదలు మొదలవుతాయి మా గోదారోళ్లింట్లో. అల్లుడైనా, ఆత్మీయ అతిథులైనా—ముందుగా వండి పెట్టేది కరకరలాడే మినప గారెలే. మినుము తింటే కండబలం పెరుగుతుందన్న నమ్మకం ఒకటి; పిండి వంటలలో అది మహారాజులాంటిదన్న విశ్వాసం మరొకటి. అందుకే పెద్దలు— “తింటే గారెలే తినాలి, వింటే మహాభారతం వినాలి” అని అలా నిశ్చితంగా చెప్పేవారు. అంతేకాదు, ఈ లోకంలో ఉన్న వాళ్లకే కాకుండా పరలోకంలో ఉన్న వాళ్లకి కూడా ఈ గారెలు అంటే మహా ప్రీతి. ఏ పితృకార్యమైనా గారెలు లేకుండా ఉండదు. ఎర్రగా నూనెలో వేగిన గారె ముక్క విరుచుకుని, అల్లపు చెట్నీతో నంజుకుని తింటే స్వర్గమే కనపడుతుంది. తినేవాళ్లకి స్వర్గం కనబడుతుంది గానీ, పాపం వండే వాళ్ల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తుంది. ఒకప్పుడు యంత్రాలు వంటింట్లోకి ప్రవేశించని కాలంలో, రుబ్బురోలుతో కుస్తీపట్టి, చెమటలు కక్కుతూ, పీకల లోతు నీళ్లలో నానబెట్టిన మినప గుండును కర్కశంగా తోలువలచి, కసి కొద్దీ రుబ్బురోలు పత్రాన్ని తిప్పుతూ, ఇనప గుండులాంటి మినప గుండును పాలనురుగు రంగులో ఉన్న మినప రుబ్బుగా మార్చేవారు. రుబ్బు తయారయ్యాక హమ్మయ్య అనుకునేవారు. పిండి రుబ్బుతూ అడుతూ పాడుతూ ...

ఆవకాయ ముద్ద_ఒక బంధం

అమ్మా, నీకు ఏం తినాలి ఉందో చెప్పు! ఈ మూడు నెలలలో నీకు కావాల్సింది వండి పెడతాను. మళ్లీ పురుడు వస్తే ఐదు నెలల వరకు తినడం కుదరదు కదా… అని అడిగింది సీతమ్మ, పురిటికి పుట్టింటికి తీసుకువచ్చిన తన కూతురు భారతిని. పెద్దాపురం చేంతాడు లాంటి కోరికల చిట్టా చెప్పింది భారతి. రోజుకో వెరైటీ—ఆ చిట్టాలో టిక్కు పెట్టుకుంటూ చేస్తూనే ఉంది సీతమ్మ. అయితే ఆ కోరికల చిట్టాలో ఒక కోరిక పేరు చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది. “ఇదేమి కోరికే తల్లి! వాడిని ఇప్పుడు ఎక్కడ తీసుకురాను నేను? వాడు ఉండేదేమో గోదావరి జిల్లా. మనం ఉండేది తెలంగాణ రాష్ట్రం. బావుంది నీకోసం పనిగట్టుకుని ఇక్కడికి రావాలా వాడు?” అంటూ నవ్వుతూ అడిగింది. “ఏమో, నాకు తెలీదు. నాకు అది తినాలని ఉంది. అది రోజూ నేను తింటాను. కానీ ఆ చేతిముద్దలో ఏదో అమృతం ఉంది,” అంది భారతి. ఇంతకీ ఆ కోరిక ఏమిటని ఆత్రంగా చిట్టా చూశాడు భారతి తండ్రి సుబ్బారావు. ఆ కోరిక పేరు చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు. “మావయ్య చేతితో పెట్టిన ఆవకాయ ముద్ద!” “నేను నీకు ఆవకాయ అన్నంలో కలిపి నోట్లో పెడతాను,” అన్నాడు సుబ్బారావు. “లేదు నాన్న. మావయ్య ఆవకాయ బాగా కలుపుతాడు. ఆ కలుపుతున్న విధానం చూస్తూనే నాకు నోరూరిపోతుంది...

నా కోసం రెండు అడుగులు

ఒరేయ్ ప్రసాదు… అమలాపురానికి బస్సు రిజర్వేషన్ చేయించు. ఇప్పటినుంచి చేయించుకోపోతే టికెట్లు దొరకవు. ఆఖరి సమయంలో వేలకు వేలు పోసి కొనుక్కోవాలి… అన్నాడు రామారావు ఉదయం లేస్తూనే. “ఇంకా నెలరోజులు టైం ఉంది కదా నాన్న! అయినా అందరం ఇక్కడే ఉన్నాం. పండగ ఇక్కడే చేసుకుందాం,” అన్నాడు ప్రసాద్. “లేదురా… పండగ అంటే మన ఊర్లోనే. ఆ సందడే వేరు,” అంటూ, “నేను అలా బజారుకు వెళ్లి వస్తాను,” అని చెప్పి బయలుదేరాడు రామారావు. “ఇంత పొద్దున్నే షాపులు తీయరు నాన్న,” అంటూ, “అయినా ఇప్పుడు బజారుకెందుకు?” అని అడిగాడు ప్రసాదు. “నేను పండగ బట్టలు కొనుక్కోవాలి రా. లేదంటే నా బట్టలు కుట్టి ఇవ్వరు,” అన్నాడు రామారావు. “అదేమిటండీ! ఇంట్లో పిల్లలకి ఎవరికి ముందుగానే బట్టలు కొనలేదు. మీరు మాత్రం ఇలా కంగారు పడిపోతున్నారు,” అన్న భార్య సుమతి మాటలకు నవ్వుతూ, రామారావు బజారుకి వెళ్లి తిరిగి వచ్చి కొనుక్కున్న గుడ్డ ముక్కలని అందరికీ ఆనందంగా చూపించాడు. “ఇదేమిటండీ ఈ బట్టలు! అరవై ఏళ్లు దాటిన తర్వాత ఈ పువ్వుల చొక్కాలు ఏం బాగుంటాయి మీకు? ఊరంతా నవ్వుతారు, ఇవి వేసుకుంటే,” అంది సుమతి.ఆ మాటలకు సమాధానం చెప్పకుండా రామారావు టైలర్ దగ్గరికి వెళ్లిపోయాడు. రామారావు...

అక్కడ ఏముంది?

ఏమో… మాటల్లో చెప్పలేని ఏదో ఆకర్షణ శక్తి ఉంది ఊరికి. మన ఊరు కదా! అందుకే పండగొస్తే చాలు — నగరం మొత్తం కదలిపోతుంది. రహదారిపై అష్టకష్టాలు పడుతూ, గంటల కొద్దీ ప్రయాణం చేస్తూ అయినా ఆ ఊరు చేరాలనే తపన. రహదారిపై ఎన్ని లైన్లు ఉన్నా, ఏ లైన్ వైపు చూసినా సొంత ఊరికి వెళ్లే వాహనాలే. బస్సులు… కార్లు… బైకులు… రైళ్లు… ఎవరి స్తోమతకు తగినట్లు వాళ్లు. ట్రాఫిక్ జామ్ అవుతుందన్న భయం ఉన్నా, ఆ భయాన్ని మించిన ఉత్సాహం ప్రతి ముఖంలో మెరిసిపోతుంది. ఈ మూడు రోజుల పండక్కి సొంత ఊరి దారి పడతారు. అమ్మానాన్నలు… బాల్యస్నేహితులు… బంధువులు… వాళ్లందరిని కలుసుకుంటామన్న ఆనందం ప్రతి ఒక్కరి కళ్లల్లో కొట్టొచ్చినట్టే కనిపిస్తుంది. నగరంలో పనుల ఒత్తిడితో అలసిపోయిన, విసిగిపోయిన జనం ఏదో కాస్తంత మనసుకు ఊరట, విశ్రాంతి కోసం ఊరి వైపు పరుగులు పెడతారు. “ఎక్కడున్నా పండగే కదా” అంటే కాదు — పండగ సౌరభం పల్లెటూర్లోనే తెలుస్తుంది అంటారు. అసలు పండగ మూడు రోజులే. కానీ మాకు నెలరోజులు ముందు నుంచే ఆకాశంలోని చుక్కలు ప్రతిరోజూ వాకిట్లోకి వచ్చి వెలుగు తెస్తాయి. ఊరంతా మంచు దుప్పటి కప్పుకుని ఉండగా, ఈ నెల రోజులు కోడి కూతతో కాదు — నగర సంకీర్తనతో పల్లె మేలుకుంటుంద...

వేసవి అల్లుడు

వేసవికాలం వచ్చిందంటే ఆ ఊరి అగ్రహారo ఒక్కసారిగా ప్రాణం పోసుకున్నట్టయ్యేది. ప్రతి ఏటా సెలవులకు వచ్చిన పిల్లల అరుపులు, కేకలు, నవ్వులు—వీటన్నిటితో ఇళ్లన్నీ ఉలిక్కిపడేవి. అమ్మమ్మ గారి ఊరికి వచ్చిన పిల్లలు ఊరికే ఉంటారా? తోటలూ, దొడ్లూ, పొలాలూ—వాళ్లకు ఆటస్థలాలే. ఎక్కడ చూసినా వాళ్లే, వాళ్ల సందడే. కానీ ఆ అగ్రహారంలో ఒక ఇంటి సందడి మాత్రం కొంచెం ప్రత్యేకం. పిల్లల గోలతో పాటు, భాగ్యనగరం నుంచి ప్రతి వేసవికీ వచ్చే అల్లుడు గారి సందడి కూడా అక్కడ కలిసిపోయేది. వేసవి అంటే పిల్లల సెలవులే కాదు—ఆ ఇంటికి అల్లుడు రావడంతో పండగలా ఉండేది. పిల్లలకైతే పాఠశాల సెలవులు ఇస్తారు. మరి అల్లుడు గారికి? అప్పటి రోజులు కాబట్టి నెలరోజులు సెలవు పెట్టుకుని, బ్యాంకు గుమ్మం దాటి అత్తగారింటి గడప తొక్కేవాడు సదరు అల్లుడు అచ్యుతరావు. భాగ్యనగరం నుంచి ఆ ఊరు రావడం అంటే ప్రయాణం కాదు—ఒక తపన. పన్నెండు గంటలు బస్సులో కూర్చుని, కాకినాడలో దిగి, అక్కడి నుంచి ఇంకో బస్సు, ఇంకో మార్గం. అష్టకష్టాలు పడి ఊరికి చేరేవాడు. అది అత్తగారి ఊరే కాదు—తను పుట్టి పెరిగిన ఊరు కూడా అదే. మట్టి వాసన, నీటి రుచి, మనుషుల పలకరింపులు—అన్నీ అతనికి తెలిసినవే. అందుకే ఆ ఊరంటే ...

ఫ్రెండ్ రిక్వెస్ట్

ఉదయం కాఫీ చేతిలో పెట్టుకుని ముఖపుస్తకం తెరిచిన రామారావుకు ఒక కొత్త నోటిఫికేషన్ కనిపించింది. పేరు – సంధ్య. సాధారణ చిరునవ్వుతో ఉన్న ఫోటో. ఫ్రెండ్ రిక్వెస్ట్. “ఎవరో?” అనుకుంటూ ఒక క్షణం ఆగాడు. తెలుసున్న వాళ్లు కాదు. పాత స్నేహితులు అసలే కాదు. పైగా ఆడపిల్ల. నాతో స్నేహం ఎందుకు? నా గురించి ఆమెకి ఏం తెలుసు? ప్రొఫైల్లో తన వివరాలన్నీ కరెక్ట్‌గానే ఇచ్చాడు రామారావు. వాటిని చూస్తే నాతో స్నేహం చేసే వయసు ఆమెది కాదు అనిపించింది. అయినా నాతోనే స్నేహం ఎందుకు? ఒక్కటే కారణం గుర్తొచ్చింది. నేను పెద్ద రచయితను కాదు. కానీ మనసును తాకే చిన్న చిన్న కథలు ముఖపుస్తకంలో వ్రాస్తూ ఉంటాను. ఇది నా అభిప్రాయం కాదు. ముఖపుస్తకంలోని కథాపాఠకులు వెలిబుచ్చే మాటల ద్వారా తెలుసుకున్న సత్యం. ఒక వ్యక్తిగా కాదు… రచయితగా నాతో స్నేహం చేద్దామనుకుంటుందేమో అనుకున్నాడు రామారావు. పరస్పర స్నేహితులు కూడా చాలామందే ఉన్నారు. “సరే… భయం లేదు” అనుకుంటూ అంగీకారం తెలుపుతూ బటన్ నొక్కాడు. అంతే. ఆ రోజు సాయంత్రం ఒక మెసేజ్ వచ్చింది. “నమస్తే… మీ కథలు చాలా బాగుంటాయి.” రామారావు ఆశ్చర్యపోయాడు. ఫేస్‌బుక్‌లో రాసే ఈ చిన్న కథలు ఇలా పరిచయాలకు దారి తీస్తాయని ఊహించలేద...

పరంధామయ్య కథ

ఉదయం పన్నెండు గంటలు అయింది. “పోస్ట్…” అనే కేకతో వాలు కుర్చీలో పడుకుని కళ్ళు తెరిచిన పరంధామయ్యకి, పోస్ట్‌మాన్ ఒక శుభలేఖ అందించి వెళ్లాడు. “ఎవరిది అబ్బా ఈ శుభలేఖ?” కార్డు చూస్తే చాలా పెద్దదిగా ఉంది. బాగా డబ్బున్న వాళ్లది అయి ఉంటుంది, అని అనుకుంటూ శుభలేఖ తెరిచి చూశాడు. పూర్తిగా చదివేసరికి — “అబ్బో! రవికి ఇంత పెద్ద కూతురు ఉందా!” అని లోలోపల సంబరపడ్డాడు. అంతలో వంటింట్లో నుంచి శారద బయటికి వచ్చింది. “ఎవరిదండి ఆ శుభలేఖ?” అని అడిగింది. “మా మేనల్లుడు రవి కూతురు పెళ్లిట. శుభలేఖ పంపించాడు,” అన్నాడు పరంధామయ్య ఆనందంగా. “వెళ్లి వస్తే బాగుంటుందేమో,” అని కూడా అన్నాడు. శారద నిట్టూర్చింది. “ఏదో పై వాళ్లల్లాగా శుభలేఖ పంపించి ఊరుకున్నాడు. ఏనాడైనా మన ఇంటికి వచ్చాడా? ఎప్పుడైనా ఫోన్ చేశాడా? కనీసం పెళ్లి కుదిరిందని కూడా చెప్పలేదు. వాళ్ల అమ్మానాన్న ఉన్నంతకాలం బంధుత్వాలు బానే మెయింటైన్ చేశారు. ఆ తర్వాత మీ అక్క పిల్లలందరూ మేనమామను మర్చిపోయారు,” అంది నిష్టూరంగా. శారద మాటల్లో నిజం లేకపోలేదు అని పరంధామయ్యకి అనిపించింది. అయినా… రక్తసంబంధం కదా! ఇన్నాళ్లూ ఆ చేదు నిజాన్ని కడుపులోనే దాచుకున్నాడు. అంతలో గతం కళ్ల ముందుకు వచ...