పోస్ట్‌లు

నిజం విలువ

"ఒసేయ్ రమ్య… పెళ్లివారు వంట వచ్చునా? అని అడిగితే వెర్రిదానిలాగా రాదు అని చెప్పకు. వచ్చునని తల ఊపు. అలాగే పాటలు కూడా. నిజం చెప్పి ఇంతకుముందు వచ్చిన సంబంధాలన్నీ అలాగే పోగొట్టుకున్నాం. మేము వెనకాల నుంచి ఎంత సైగ చేసినా నీ మట్టి బుర్రకు అర్థం కాలేదు," అని డెబ్బై ఏళ్ల బామ్మ చెప్పిన మాటలకు రమ్యకు నిజంగా నవ్వొచ్చింది. చిన్నప్పుడు అబద్ధాలు చెబితే కొట్టేవారు. ఇప్పుడు పెద్దయ్యాక తెలియనివి కూడా తెలిసినట్టు చెప్పమంటున్నారు. "ఏమిటో ఈ పెద్దవాళ్లు!" అని మనసులో అనుకుంది రమ్య. నిజానికి రమ్యకు వంట రాదు. చదువు పూర్తవగానే క్యాంపస్‌లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఉద్యోగ బాధ్యతలు, పనుల ఒత్తిడిలో కాలం గడిచిపోయింది. "అమ్మా, నేర్చుకోవడానికి నాకు అవకాశం ఎక్కడ వచ్చింది?" అని అడిగితే, రమ్య తల్లి సీతమ్మ వెంటనే— "అవకాశం లేదా? స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక టీ పెట్టమంటే చచ్చినట్టు కూర్చునేదానివి. వంటింట్లోకి తొంగి చూసేదానివి కాదు. ఇప్పుడు అవకాశం లేదని సాకులు చెబుతున్నావు," అంటూ మందలించేది. "ఒసేయ్, ఆ చెవులకు జూకాలు పెట్టుకో. బీరువాలో ఉన్న పట్టు చీర కట్టుకో. మెడలో ఆ రాళ్ల నెక...

ఆ రుచి _ఆ వీధి_ ఆ జ్ఞాపకం

ప్రతి గృహిణికి ప్రతి ఉదయం అల్పాహారం ఒక సమస్యే. “ఈరోజు ఏమి చేయాలి?” అన్న ప్రశ్న నిద్ర లేవగానే మనసులో మెదులుతుంది. కుటుంబ సభ్యులను అడిగితే రకరకాల సమాధానాలు వస్తాయి. ఒకరికి ఇడ్లీ కావాలి, మరొకరికి దోసె కావాలి, ఇంకొకరికి ఉప్మా వద్దు, పూరీ కావాలి. కోరికలకు అంతుండదు. అయితే బాధ్యత గల గృహిణిగా అందరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోవాలి కదా! ఒక కుటుంబం అంటే రకరకాల వ్యక్తుల కలయిక. అందులో పాలు తాగే పసిపిల్లల నుంచి కాలు కదపలేని ముదుసలి వరకు ఉంటారు. అందరినీ దృష్టిలో పెట్టుకుని ముందుకు నడవాలి. ఈ అల్పాహారాల్లో కొన్ని అప్రయత్నంగా చేసేవి. మరికొన్ని అయితే తొలి రోజు నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలి. రకరకాల పేర్లు చెప్పి లిస్టు చదివే పిల్లలు, “ఎప్పుడూ అవేనా!” అని మొహం పెట్టి బజార్లో ఉన్న హోటళ్ల పేర్లు చెబుతూ నోరు చప్పరించే పిల్లలను చూసి, “మీ ఇష్టం రా!” అని విసుగొచ్చి చెప్పే అమ్మలు, వచ్చిన బంధువులకు మన ఊరి వంటకం రుచి చూపిద్దామని అనుకునేవాళ్లు, బుద్ధి పుట్టినప్పుడల్లా అక్కడికి చేరేవాళ్లు—ఇలా చాలామంది కనబడతారు మా ఊర్లో ఒక చోట. “మీ ఊరు అంటే ఏమిటండి?” అని అడిగితే, “మాది కాకినాడ” అని గర్వంగా చెబుతాను.ఆ ప్రదేశం పేరు దేవాల...

కాకినాడ కాజా _ఒక ఊరి తీపి గర్వం

నోరు మెచ్చిన రుచులు ఒక ఊరికి ప్రత్యేకతను, సంస్కృతిని, వారసత్వాన్ని తీసుకొస్తాయనే మాట అతిశయోక్తి కాదు. అది అక్షరాలా నిజం. కళ్లముందు కనిపించే సత్యం. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల విస్తరణతో ప్రతి ప్రాంతం తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న వంటకాల ద్వారా ప్రపంచానికి మరింత చేరువైంది. ఒక ప్రాంతాన్ని గుర్తు చేసే ఆలయాలు, నదులు, పంటపొలాల మాదిరిగానే అక్కడి రుచులు కూడా ఆ ఊరి గుర్తింపుగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ అంటే దమ్ బిర్యానీ గుర్తొస్తుంది. తిరుపతి అంటే లడ్డూ గుర్తుకు వస్తుంది. అన్నవరం ప్రసాదం రుచి చూసినవారు ఆ ఆకు కూడా వదలకుండా తినేస్తారు. బందరు లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు, రాజమండ్రి రోజ్ మిల్క్, గంగరాజు పాలకోవా, కాకినాడ కాజా... ఇలా ఎన్నో రుచులు తరతరాలుగా మన నాలుకలపై మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. కాలం మారినా, తరాలు మారినా వాటి ప్రత్యేకత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రుచి అనేది కేవలం ఆహారానికి సంబంధించినది కాదు. అది ఒక ప్రాంతం ఆత్మను ప్రతిబింబిస్తుంది. సంస్కృతిని మోస్తుంది. చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ మన కళ్ల ముందు నిలబెడుతుంది. ఒక ఊరి పేరు వినగానే అక్కడి ప్రత్యేక రుచి కూడా మనసులో మెదలడం యాదృచ్ఛికం కాదు....

భారం కాదు ! ప్రాణం

“ఏవండీ... మీరు రాకపోతే బాగుండదేమో! దగ్గర వాళ్లు కదా!” అంది సుమతి చేతిలోని శుభలేఖను చూస్తూ. “ఎలా రమ్మంటావు సుమతి? మన విజయ్ ని ఎవరో ఒకరు చూసుకోవాలి కదా! నువ్వూ, రాజేష్ వెళ్లి రండి...” అన్నాడు రాజారావు. “క్రితం సారి పండక్కి వెళ్లినప్పుడు మన విజయ్ చేసిన అల్లరి చూసి గట్టిగా కసిరారు ” అని ఇంటికి వచ్చి బాధపడ్డావు. ఆ పిల్లాడికి ఏమీ తెలియక అల్లరి చేస్తున్నాడని, అలాంటి పనులు చేస్తున్నాడని మనకు తెలుసు. తల్లిదండ్రులుగా మనకు తప్పదు. పై వాళ్లకు మాత్రం అది చిరాకుగా ఉంటుంది. ఏం చేస్తాం? మన కర్మ ఇలా ఉంది. భగవంతుడు ఇలాంటి శిక్ష వేశాడు...” అని బాధపడ్డాడు రాజారావు. సుమతికి ఒక్కసారిగా సంక్రాంతి పండక్కి అన్నగారింటికి వెళ్లినప్పుడు జరిగిన దృశ్యం గుర్తుకొచ్చింది. ఏదో సరదాగా ఉందామని వెళ్తే, విజయ్ చేసిన పనులతో బాధ, సిగ్గు ముంచుకొచ్చాయి.  ఏది పడితే అది, సమయం సందర్భం లేకుండా వంటింట్లోకి వెళ్లి తినడం, ప్రతి సామాను కింద పడేయడం, మలమూత్రాలన్నీ గదిలో, మంచం మీద చేసి పాడు చేయడం...ఒకటి కాదు... ఎవరి దగ్గర వస్తువు కనిపించినా వాళ్ల దగ్గరికి వెళ్లి లాక్కోవడం, పెద్దగా అరవడం, ఎవరు మందలించినా నవ్వుతూ మళ్లీ అదే పని చేయడం...

అలలు మధ్య ఆత్మీయ నగరం_ విశాఖ

  ఏముంది అక్కడ ప్రత్యేకత అన్ని ఊళ్లలాగానే అదీ ఒక ఊరే అని ఎవరైనా అంటే ముక్తకంఠంతో వ్యతిరేక స్వరం వినిపిస్తుంది. “కాదు… ఆ ఊరి అందమే వేరు” అనే మాట గాలిలో మారుమ్రోగిపోతుంది. అన్ని ఊళ్లల్లో ,మా ఊరి లాగా సహజసిద్ధమైన అందాలు ఉంటాయా అని ఎదురుప్రశ్న వేస్తారు. కొండలు సముద్రాన్ని కౌగిలించుకున్న దృశ్యం ఎక్కడ కనిపిస్తుంది? ఉదయించే సూర్యుడి కిరణాలు అలల మీద బంగారు చీర పరచినట్టు మెరిసే తీరం ఎక్కడ ఉంటుంది? వాన పడితే మబ్బులు కొండలపై దిగివచ్చి నగరంతో మాటలాడే అందం ఎక్కడ దొరుకుతుంది? అందుకే అందరూ పిల్లలతో సహా మా ఊరు చూడడానికి వస్తారు అంటారు విశాఖవాసులు.  ఉక్కు లాంటి పట్టుదల, సాగరం లాంటి మనసు ఉన్న ప్రజలు జాతీయ రహదారిలో తిష్ట వేసుకుని కూర్చున్న మా ఊరికి ఒకసారి వచ్చినవారు మళ్లీ రావాలనుకునే ఊరు అది. చూసిన కళ్లలో నీలి జ్ఞాపకాలు మిగిల్చే నగరం అది. మాది ఉక్కునగరం కాదు. ఉర్రూతలు ఊగించే నగరం.  బాధ వచ్చినా… కష్టం వచ్చినా… కన్నీళ్లు వచ్చినా… సంతోషం పంచుకోవాలన్నా… మేము ఆ సముద్రుడి దగ్గరికి చేరకుండా ఉండలేం. అలలు ఎప్పటిలాగే ముందుకు వస్తూనే ఉంటాయి. మాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుగా… మనసులో దాచుకున్న ...

మరో తిరుపతి

తిరుపతి అనగానే ముందు మనకు గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లాలోని పెద్ద తిరుపతి. అది కాదంటే ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల గుర్తుకొస్తుంది. ఒకటి పెద్ద తిరుపతి, రెండోది చిన్న తిరుపతి. పెద్ద తిరుపతిలో వెలిసిన స్వామిని దర్శించాలంటే ఏడుకొండలు ఎక్కవలసిందే. ద్వారకుడు అనే భక్తుడి కోరిక మేరకు స్వామి చిన్న తిరుపతిలో కొలువై ఉన్నాడు. ఏడుకొండలు ఎక్కలేని వారు చిన్న తిరుపతిలో స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.  సప్తగిరులు ఎక్కినా, ద్వారకా తిరుమల స్వామిని దర్శించినా, "గోవిందా!" అని పిలిస్తే స్వామి భక్తుల మొర ఆలకిస్తూ ఉంటాడు. అంత మహిమ గలవి ఈ రెండు పుణ్యక్షేత్రాలు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం చదలవాడ గ్రామంలో మరో తిరుపతి కూడా ఉంది. ఇక్కడ శ్రీ శృంగార వల్లభ స్వామి దేవాలయం ఉంది. ఈ దేవాలయం సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లు అక్కడి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అందుకేనేమో ఈ ప్రాంతాన్ని "తొలి తిరుపతి" అని అందరూ పిలుస్తారు. ప్రతి పుణ్యక్షేత్రం వెనుక ఒక చారిత్రక కథ ఉంటుంది. అది కథగా మనం...

రామ నామంలో నిలిచిన మహావీరుడు

ఆంజనేయస్వామి సర్వమానవ ఆరాధ్య దైవం. రామ బంటుగా రామ భక్తుడిగా, అసాధ్యకార్యసాధకుడుగా, రాక్షస సంహారిగా మన మనసులో నిలిచిపోయిన దైవం.  భారతదేశంలో ఏ గ్రామం చూసిన ఏ రహదారి చూసిన స్వామి విగ్రహం లేని చోటు ఉండదు. దేవాలయంలో ఆంజనేయ స్వామిని చూసిన రహదారి పక్కనున్న విగ్రహాలు చూసిన ఒక రకమైన ఉత్తేజం ధైర్యం కలుగుతుంది. బహుశా ఆయన రూపం చూసి భయం తొలుగుతుంది. విశాలమైన వక్షస్థలం పొడవైన కాళ్లు చేతులు చేతిలో గధ వానర ముఖం వానరులకుండే ప్రత్యేకమైన అవయవం తోక కలిగి ఉంటారు స్వామి.  మానవ రూపంలో ఉండే ఈ దేవుడుకి వానర ముఖం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న అందరికీ కలుగు తుంది. ఆంజనేయ స్వామి తల్లి అంజనీ దేవి. ఆమె వానర వనిత. ఆంజనేయ స్వామి తల్లి అంజనీదేవి పూర్వ జన్మలో ఒక అప్సరస శాపం కారణంగా వానర కన్యగా పుడుతుంది. ఆమెకు కేసరితో వివాహం జరుగుతుంది. చాలా కాలo వరకు సంతానం కలగపోవడంతో శివుడుని పూజించి శివుడు లాంటి కొడుకు కావాలని కోరుకుంటుంది.   శివుడి యొక్క తేజమును వాయుదేవుడు పండు రూపంలో అంజనీ దేవికి ఇవ్వగా ఆ పండు తిన్న అంజనీ దేవికి ఆంజనేయ స్వామి జన్మిస్తాడు. అంజనీ దేవి పుత్రుడు కాబట్టి ఆంజనేయుడు అయ్యాడు. శివ...

దివాన్ బుచ్చిరాజు

రాత్రి పది గంటలయింది. మండువేసవి కాలం. గోడ గడియారం శబ్దం తప్పితే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అందులో ఉండే వ్యక్తులు ఒకరు తప్ప అంతా నిద్రలో మునిగిపోయి ఉన్నారు. వీధిలో ఎటు చూసినా చిమ్మచీకటి. లాంతరు వెలుగు తప్ప ఇంకేమీ కనపడటం లేదు. కాపలాదారులు అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు. ఏ మూల నుంచి ఎవరు దాడి చేస్తారో అనే భయంతో చాలా జాగ్రత్తగా అటూ ఇటూ చూస్తూ, కళ్లకు మూతలు పడకుండా విశ్వప్రయత్నం చేసుకుంటూ తమ విధి నిర్వహణలో మునిగిపోయారు. అవును… అది మామూలు వ్యక్తి ఇల్లు కాదు. రాజుగారి తర్వాత రాజుగారంతటి గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిన ఒక సంస్థానంలోని దివాన్ గారి ఇల్లు. “దివాన్” అంటే ఈ రోజుల్లో మన ఇళ్లలో వాడే మంచం ఆకారంలో ఉండే వస్తువు గుర్తుకొస్తుంది. కానీ ఆ రోజుల్లో రాజ్యాలలో, సంస్థానాలలో “దివాన్” అనేది ఒక పదవి పేరు. రాజుగారి తర్వాత రాజుగారంతటి వాడు దివాన్. ప్రధానమంత్రి లాంటివాడు అన్నమాట. రాజ్య పరిపాలనంతా ఆయన చేతిమీద నడిచేది. రాజు చెప్పిన ఆజ్ఞలను అమలు చేయడమే దివాన్ గారి పని. చాలా అధికారాలు ఉన్నప్పటికీ, ప్రతి విషయంలో రాజుగారి అనుమతి తీసుకోవాలి. నివసించడానికి మంచి ఇల్లు, ఇంటినిండా పనివాళ్లు, వీధిలో కాపలాదారులు, ఒక గుర్రప...

షరతులు లేని ప్రేమ

అన్ని బంధాలు ఏదో ఒక షరతుతోనే నడుస్తాయి. స్నేహం— మనసులు కలిసుంటేనే ఉంటుంది. ప్రేమ— అభిమానాలు తగ్గకపోతేనే నిలుస్తుంది. బంధుత్వం— అవసరాలు కలిసొస్తేనే దగ్గరవుతుంది. డబ్బు ఉంటే పలకరింపులు పెరుగుతాయి, స్థానం ఉంటే గౌరవాలు వస్తాయి. లాభం ఉన్నంతవరకే చాలా సంబంధాలు మన చుట్టూ తిరుగుతాయి. కానీ… ఒక్క అమ్మ ప్రేమకు మాత్రం ఎలాంటి షరతులు ఉండవు. పిల్లవాడు అందంగా ఉన్నాడా? చదువులో మొదటివాడా? డబ్బు సంపాదిస్తున్నాడా? తన మాట వింటున్నాడా? ఏమీ చూడదు అమ్మ. పిల్లాడు ఏడిస్తే ఆమె గుండె కరిగిపోతుంది. పిల్లాడు తప్పు చేసినా తిట్టేది ప్రపంచం, క్షమించేది అమ్మ. అందరూ “నువ్వు నాకు ఏమిస్తావు?” అని అడిగే లోకంలో అమ్మ ఒక్కతే “నీకింకా ఏమివ్వాలి?” అని ఆలోచిస్తుంది. అందుకే అమ్మ బంధం ప్రేమ కాదు… అది ప్రాణం. ప్రపంచంలో మనిషి పెద్దవాడవుతాడు… పదవులు సంపాదిస్తాడు, డబ్బు కూడబెడతాడు, ఎంతో మందిని కలుస్తాడు. కానీ రోజు చివరికి మనసు అలసిపోయి ఒక నిజమైన ఆత్మీయత కోసం వెతికితే— గుర్తుకొచ్చేది అమ్మే. చిన్నప్పుడు చెయ్యి పట్టుకుని నడిపించింది. పెద్దయ్యాక దూరంగా నిలబడి ఆశీర్వదించింది. మన కోపాలను భరించింది, మన మాటలతో గాయపడింది, అయినా “నా బిడ్డ బాగుండ...

ప్రేమ ఋణo

వాళ్లు పాలు తాగే పసిపిల్లలు కాదు. నడక నేర్చుకునే నవ్వుల పాపాయిలు కాదు. మాటలు రాని ముద్దుల బిడ్డలు కాదు. అయితే… ఈ రోజు మన కళ్ల ముందు కనిపిస్తున్న వాళ్లు — మన తల్లిదండ్రులే. ఒకప్పుడు మనం తడబడుతూ అడుగులు వేస్తే, మన వేళ్లను పట్టుకుని నడిపించిన వాళ్లు వాళ్లే. కిందపడితే కన్నీళ్లు తుడిచి, మళ్లీ లేవమని ధైర్యం చెప్పినవాళ్లు వాళ్లే. మాట రాని మన పెదవులకు “అమ్మ”, “నాన్న” అనే మధురమైన శబ్దాలు నేర్పినవాళ్లు వాళ్లే. మన నవ్వుల్లో ప్రపంచాన్ని చూసినవాళ్లు వాళ్లే. కాలం… ఎంత నిశ్శబ్దంగా తన పని చేస్తుందో! ఒకప్పుడు మనల్ని మోసిన చేతులు, ఇప్పుడు మన సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఒకప్పుడు మన అవసరాలన్నీ ముందే తెలుసుకున్న వారు, ఈ రోజు తమ అవసరాల్ని చెప్పడానికి కూడా కొంచెం వెనుకాడుతున్నారు. వాళ్లు వయసులో మనకంటే పెద్దవాళ్లే… కానీ పరిస్థితులు, కాలం కలిసొచ్చి వాళ్లను మళ్లీ పసిబిడ్డలుగా మార్చేశాయి. ఇది ప్రకృతిసిద్ధమైన చక్రం. నిన్న మనం పిల్లలం — వాళ్లు ఆధారం. ఈ రోజు వాళ్లు పిల్లలు — మనమే ఆధారం. ఈ మార్పును అర్థం చేసుకున్నప్పుడు, మన బాధ్యత కేవలం కర్తవ్యంగా ఉండదు… అది ప్రేమగా మారుతుంది. వాళ్లు మళ్లీ పసివాళ్లయితే, మనము మళ్ల...

శ్రమజీవి

. ఆ శ్రమజీవి చెమట చిందించకపోతే మన రోజు గడవదు… ఈ వాక్యం కేవలం మాట కాదు—మన జీవన సత్యం. మనం ఉదయం నిద్రలేవగానే కనిపించే శుభ్రత, మనం తినే ఆహారం, మనం ప్రయాణించే వాహనం, మనం నివసించే ఇల్లు—ఇవన్నీ ఒక శ్రమజీవి చెమటతో నిర్మితమైనవే. మనం చూస్తున్న సౌకర్యం వెనుక, అతను చూడని కష్టాల చరిత్ర దాగి ఉంటుంది. శ్రమకు మనం ధర కడతాం. కానీ ఆ శ్రమ విలువను మాత్రం ఎప్పటికీ కొలవలేము. మనం ఇచ్చే జీతం అతని కష్టానికి ఒక చిన్న ప్రతిఫలం మాత్రమే. కానీ అతను వెచ్చించే శక్తి, అతను మోసే బాధ్యతలు, తన కుటుంబం కోసం చేసే త్యాగాలు—ఇవి అన్నీ కలిపితే అది ఒక అమూల్యమైన రుణంగా మారుతుంది. ఆ రుణం మనం డబ్బుతో తీర్చలేము… గౌరవంతో మాత్రమే కొంతైనా చెల్లించగలం. ఉదయం లేవగానే “అమ్మగారు…” అనే పిలుపు వినిపిస్తే, అది ఒక సాధారణ శబ్దం కాదు—ఒక నమ్మకం. ఒక శ్రమజీవి తన ఇంటి పనులు పక్కన పెట్టి, మన ఇంటిని శుభ్రంగా మార్చడానికి వస్తుంది. మనకు అది ఒక పని మాత్రమే అనిపించవచ్చు… కానీ ఆమెకు అది జీవనాధారం. ఆమె చెమటలో తన పిల్లల భవిష్యత్తు దాగి ఉంటుంది. తెల్లవారక ముందే సైకిల్ తొక్కుకుంటూ ఇంటింటికి తిరిగి సమయానికి పాల ప్యాకెట్లు అందించే వ్యక్తి, నెత్తిమీద తట్ట మోసుకుం...

ఆ ఊరు మాకు వరమే

విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే రత్నాచల్ ఎక్స్ప్రెస్ నెమ్మదిగా నడుస్తూ అన్నవరం స్టేషన్ లోకి వచ్చి ఆగింది. ప్రయాణికులంతా లగేజ్ చేత పట్టుకుని గబగబా దిగే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయాణికులను ఒకసారి చూస్తే కొత్తగా పెళ్లయిన జంట దగ్గర నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. అక్కడే సగం బండి ఖాళీ అయిపోయింది. స్టేషన్లో నిలబడి ఉన్న ప్రయాణికులను గమనిస్తే ఎక్కువ శాతం మంది నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకుని గుండు చేయించుకునీ తలకి గంధం పూత పూసుకున్న వాళ్ళు ఎక్కువగా కనబడ్డారు. అవును ఇది పుణ్యక్షేత్రం కదా ఇక్కడ ఎక్కువ స్వామివారి భక్తులే ఉంటారు. చెన్నై కలకత్తా రైలు మార్గంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు కనబడుతూ ఉంటాయి అలాంటి వాటిలో అన్నవరం ఒకటి  ఎప్పుడూ రెండు నిమిషాలకు మించి ఆగని రైలు బండి సిగ్నల్ ఇవ్వని కారణంగా స్టేషన్లో నిలిచిపోయింది. రైలు స్టేషన్ అంత ఒక్కసారి చూస్తే దూరంగా అనంత లక్ష్మీ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఫోటో దూరంగా కనబడుతోంది. ప్రతి ప్రయాణికుడు ఆ స్వామికి దండం పెట్టుకుని ముందుకు సాగుతున్నారు.  ఆ రైలు మార్గంలో ప్రయాణం చేస్తుంటే దూరాన్నించి కొండమీద కనబడే స్వామికి నమస్కారము చేయని వాళ్ళ...

అక్క హృదయం

  నాన్న మంచం మీద ఉన్నప్పుడు చేతినిండా పని ఉండేది.ఎప్పుడు “ఒరేయ్ కృష్ణా” అని పిలుస్తూనే ఉండేవాడు. ఇప్పుడు ఏ పని లేకుండా ఉంది అని అనుకున్నాడు కృష్ణారావు, చనిపోయిన తన తండ్రి రామారావు గురించి. ఆఫీసుకు వెళ్లిన ఇంటి దగ్గర తండ్రి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు కృష్ణారావు. ఇప్పుడు సమయం గడవడం లేదు. ఆఫీసు నుండి వచ్చిన వెంటనే రామారావు పని చూడడం ఒక పెద్ద బాధ్యతగా ఉండేది. రామారావు మంచం మీద ఉన్నా ఎంతో ధైర్యంగా ఉండేవాడు. ఇంచుమించుగా భార్య పోయిన తర్వాత రామారావు మంచం పట్టేసాడు. తండ్రి గుమ్మం దాటిన తర్వాత ఇప్పుడు “ఒంటరి వాడిని” అనే ఫీలింగ్ వస్తోంది కృష్ణారావుకి. అప్పుడే పన్నెండు రోజులు గడిచిపోయాయి. బంధువులంతా కృష్ణారావుకు ధైర్యం చెప్పి ముందుకు సాగిపోయారు. బంధువులతో పాటు కృష్ణారావు అక్క కూడా బయలుదేరుతూ, “తమ్ముడు బాధపడకు, ఏ అవసరం వచ్చినా నేను ఉన్నాను అని గుర్తుపెట్టుకో!” అని చెప్పి ఏడుస్తూ తమ్ముడిని దగ్గరకు తీసుకుంది కృష్ణారావు అక్క సుమతి. “ఇంకో ముఖ్య విషయం… డాక్యుమెంట్లు రెడీ చేయించు. మాసికానికి వచ్చినప్పుడు సంతకం పెడతాను. నాకు కూడా వయసు మీరిపోతోంది, ఇది చాలా ముఖ్యం,” అని చెప్పి వెళ్ళిపోయింది సుమతి. ఇంకా...

తీరని కోరిక

ఉదయం తొమ్మిది గంటలు అయింది. అందరి ఆర్థిక అవసరాలు, ఆశలు తీర్చే ఆ కార్యాలయం ముందు ఒక స్కూటర్ వచ్చి ఆగింది. స్కూటర్ దిగి జేబులోంచి తాళాలు తీసి తలుపులు తెరుస్తుంటే, జేబులోని సెల్ఫోన్ మోగితే కుడి చెవిలో పెట్టుకుని తలుపులు తెరుస్తూ మాట్లాడుతూ చెమటలు కారుతుంటే, హడావిడిగా కార్యాలయంలోకి అడుగుపెట్టి తనకు కేటాయించిన ప్రత్యేక గదిలోని సీట్లో కూర్చున్నాడు సదరు కార్యాలయం అధికారి రామారావు. ఇంతకీ ఆ కార్యాలయం పేరేమిటి అనే సందేహం అందరికీ వస్తుంది. అది ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖ. ఆ శాఖ ఉండేది ఒక మండల కేంద్రంలో. ఆ ఊరిలో సౌకర్యంగా ఉండే ఇళ్లు దొరకవు. ఆ శాఖలో పనిచేసే వాళ్లు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం నుంచి రోజు వచ్చి వెళుతుంటారు. రోజు ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభమైన ఉద్యోగ యాత్ర రాత్రి ఎనిమిది గంటలకి ఇల్లు చేరడంతో పూర్తవుతుంది. బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభమయ్యేయి. బ్యాంకు ప్రాంగణం అంతా కస్టమర్లతో నిండిపోయింది. అందులో తల పాగా చుట్టుకుని పంచ కట్టుకుని చేతిలో కర్ర పట్టుకునే రైతులు దగ్గర నుంచి, తెల్ల బట్టలు వేసుకుని కూలింగ్ గ్లాసులు పెట్టుకుని వచ్చే బడా బాబులు, నిన్న మొన్నటి వరకు ఆ సీట్లో కూర్చుని ఈవే...

స్థలం

 1. స్థలం రిజిస్ట్రేషన్ తర్వాత ఇల్లు కట్టితే — మళ్లీ రిజిస్ట్రేషన్ అవసరమా? సాధారణంగా → అవసరం లేదు. మీరు స్థలం (plot/land) రిజిస్టర్ చేసుకున్నప్పుడు, ఆ స్థలంపై ఉన్న హక్కు మీకే వస్తుంది.  తరువాత మీరు ఆ స్థలంపై ఇల్లు కట్టినా, ఇల్లు కూడా అదే ఆస్తిలో భాగం (immovable property improvement) గా పరిగణిస్తారు. 👉 కాబట్టి: “ఇల్లు కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్” చేయాల్సిన అవసరం లేదు ఒకే Sale Deed (స్థలం రిజిస్ట్రేషన్) సరిపోతుంది 📌 కానీ ఒక ముఖ్యమైన విషయం: మున్సిపల్ రికార్డుల్లో (House Tax, Property ID) vacant land → house propertyగా update చేయాలి 🧾 2. ఎప్పుడు ఇంటికి ప్రత్యేక రిజిస్ట్రేషన్ అవసరం వస్తుంది? ఈ సందర్భాల్లో మాత్రమే: ✔️ (1) మీరు అమ్మేటప్పుడు మీరు “ఖాళీ స్థలం” అమ్మడం కాదు “ఇల్లు + స్థలం” అమ్మితే 👉 కొత్త Sale Deed లో house వివరాలు కూడా చేరుతాయి 👉 అప్పుడే ఇల్లు విలువ కూడా రిజిస్ట్రేషన్‌లో వస్తుంది ✔️ (2) Joint Development / Builder Agreement మీరు builderకి ఇచ్చి flats కట్టిస్తే  Construction Agreement లేదా Development Agreement రిజిస్ట్రేషన్ అవుతుంది దీనికి వేరే స్టాంప్ డ్యూ...

వేసవి

 బ్లాగ్ సిరీస్: బాల్యంలో వేసవి – మధుర స్మృతుల సందడి భాగం 4: మధ్యాహ్నపు మధుర విరామం వేసవి ఉదయాలు, సాయంత్రాలు ఎంత ఉత్సాహంగా ఉంటాయో, మధ్యాహ్నాలు అంతే నిశ్శబ్దంగా, నెమ్మదిగా సాగుతాయి. ఎండ తన తీవ్రతను చూపించే ఆ వేళ, ఊరు మొత్తం ఒక ప్రశాంత నిద్రలోకి జారుకున్నట్టుగా అనిపిస్తుంది. భోజనం అయిన తర్వాత, ఇంటి నడవలో నడ్డి వాల్చి పడుకుంటే కలిగే ఆ హాయిని మాటల్లో చెప్పడం కష్టం. బయట ఎండ మండుతున్నా, ఆ మట్టివాసన కలిసిన చల్లని గాలి మనసును ఆహ్లాదపరుస్తుంది. కళ్లకు మెల్లగా నిద్ర చేరుతుంది… అది సాధారణ నిద్ర కాదు, ఒక మధురమైన విశ్రాంతి. అమ్మమ్మ పక్కనే పడుకుని ఉండటం ఒక భరోసా. ఆమె చేతి స్పర్శ, ఆమె నెమ్మదైన మాటలు — ఇవన్నీ మనసుకు ఓదార్పు ఇస్తాయి. ఎప్పుడో తెలియకుండానే నిద్రలోకి జారిపోతాం. కొంతసేపటి తర్వాత లేచితే, సాయంత్రపు చల్లని గాలి మనల్ని మళ్లీ చురుకుగా మారుస్తుంది. అదే సమయంలో అమ్మమ్మ జేబులో నుంచి బయటకు వచ్చే జంతిక ముక్కలు పిల్లలకు ఒక చిన్న పండుగలా అనిపిస్తాయి. ఆ కరకరలాడే రుచి, ఆ తియ్యని అనుభూతి — ఇప్పటికీ జ్ఞాపకాల్లో నిలిచే మధుర క్షణాలు. పనసపండు తొనలు తీసి అందించినప్పుడు, వాటి వాసనే ముందుగా మనసును ఆకర్షిస్తుం...

వేసవి రుచుల విందు

 బ్లాగ్ సిరీస్: బాల్యంలో వేసవి – మధుర స్మృతుల సందడి  భాగం 3: వేసవి రుచుల విందు వేసవికాలం అంటే కేవలం సెలవులు మాత్రమే కాదు… అది రుచుల పండుగ కూడా. ముఖ్యంగా పల్లెటూర్లో గడిపే వేసవి రోజులు, మనకు మరచిపోలేని రుచులను అందిస్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు ఎంతగా మండినా, ఆ వేడిని మర్చిపోయేలా చేసే రుచులు గ్రామీణ జీవితంలో దాగి ఉంటాయి. ముఖ్యంగా మామిడి కాలం — వేసవికి అందమైన వరం. మామిడి తోటల్లో స్నేహితులతో కలిసి తిరుగుతూ, చెట్ల నుంచి పడిపోయిన పిందెలను ఏరుకోవడం ఒక ప్రత్యేకమైన సరదా. ఆ పిందెలను ఉప్పు, కారం నంజుకుని తింటే వచ్చే రుచి — అది మాటల్లో చెప్పలేనిది. కాస్త పులుపు, కాస్త కారంపనం కలిసిన ఆ రుచి, బాల్యంలో మాత్రమే ఆస్వాదించగలిగే ఆనందం. ఇంటికి వచ్చాక అమ్మమ్మ చేతిలో పెట్టిన కొత్త ఆవకాయ ముద్ద — అది కేవలం ఒక వంటకం కాదు, ఆమె ప్రేమకు ప్రతీక. ఆవకాయలో ఉండే కారంపనం కంటే, అమ్మమ్మ చూపించే ఆప్యాయత ఎక్కువగా అనిపిస్తుంది. కమ్మగా ఉండే కంది పొడి ముద్దను వేడి అన్నంలో కలిపి తింటే, అది సాధారణ భోజనం కాదు — ఒక అనుభూతి. ఆ ముద్ద గొంతులో దిగుతుంటే, మనసులో ఒక తృప్తి వెల్లివిరుస్తుంది. మధ్యాహ్న భోజనానికి గుమ్మడి ...

వేసవి

 బాల్యంలో వేసవి_ మధురస్మృతుల సందడి భాగం 1 పరీక్షల తర్వాత మొదలయ్యే పండగ వేసవికాలం… ఈ మాట వినగానే ప్రతి ఒక్కరి బాల్యం మనసులో తీయని జ్ఞాపకాలుగా మెదులుతుంది. ముఖ్యంగా పిల్లలకు అయితే వేసవి అనేది ఒక పండుగే. సంవత్సరమంతా ఎదురుచూసే ఆ స్వేచ్ఛ, ఆ ఆనందం దొరికేది వేసవిలోనే. ప్రతి సంవత్సరం ఆఖరి పరీక్షలతో ఒక పెద్ద బాధ్యత పూర్తవుతుంది. చివరి రోజు పరీక్ష రాసి బయటకు వచ్చేటప్పుడు కలిగే ఆ హాయిని మాటల్లో చెప్పడం కష్టం. ఇక పుస్తకాలు, బడులు అన్నీ కొంతకాలం దూరం. పేపర్లు దిద్దడంలో మాస్టారు గారు బిజీ అయిపోతారు; బడి తాళాలు ఆయన జేబులోనే విశ్రాంతి తీసుకుంటాయి. అదే సమయంలో పిల్లల మనసుల్లో మాత్రం కొత్త ఉత్సాహం మొదలవుతుంది — “అమ్మమ్మ ఊరికి ఎప్పుడు వెళ్దాం?” అనే ఆత్రుత. బస్తాలు సర్దుకోవడం, అమ్మ చెప్పే సూచనలు వినడం, రైలు లేదా బస్సు ప్రయాణానికి సిద్ధమవడం… ఇవన్నీ ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తాయి. అమ్మమ్మ ఊరికి చేరుకున్న క్షణం నుంచి నిజమైన వేసవి మొదలవుతుంది. మనవళ్లు వచ్చారంటే అమ్మమ్మ, తాతయ్యల ఆనందానికి అవధులు ఉండవు. వారి కళ్లల్లో మెరుస్తున్న ఆ ప్రేమ, ఆ ఆప్యాయత — అది ఎక్కడా దొరకని సంపద. వాకిట్లోకి అడుగుపెట్టగానే అమ్మమ్మ...